తిరుమలలో ప్రముఖమైనది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. ఎత్తయిన వృక్షాలు.. ఇలా పచ్చటి లోయలో వెలసిన ప్రాకృతిక పర్ణశాల జాబాలి తీర్థం. దీనినే జాపాలి తీర్థంగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇట్టి మహిమాన్విత క్షేత్రం ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టి రామభక్త లంకా భీకర అసుర సంహారక హనుమకు ఫిబ్రవరి 19వతేది ఆదివారం అనంతాళ్వాన్ తోట ఆధ్యుడు అయిన శ్రీ అనంతాళ్వాన్ 969వ అవతార విశేష ఉత్సవం సందర్భంగా.. అనంతాళ్వాన్ 26వ తరం వారసులు శ్రీమాన్ టి.ఏ.పి.రంగాచారి ఆశీస్సులు అందుకున్న అనంతరం విజయవాడకు చెందిన పివి రామిరెడ్డి (అనంతళ్వాన్ దివ్య చరిత్ర పుస్తక రచయిత) జగదీష్, కత్తి సాయి కృష్ణ, నంబూరు నరసింహారావు, రావుల రాజా, భక్త బృందం "గద"ను సమర్పించారు.
దశాబ్దాలుగా ఈ ఆలయం హాథీరామ్జీ మఠం ఆధ్వర్యంలో నిర్వహణ పూజాధికాలు సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శించ వచ్చిన భక్తుల్లో చాలామంది జాపాలి ఆంజనేయుణ్ణి దర్శించుకుంటారు. దుష్ట గ్రహ నివారణకు, ఆరోగ్య సిద్ధికి స్వామిని సేవిస్తారు.
తిరుమల శిఖరాలపై ధర్మపథ, జ్ఞానపథ, ముక్తిపథ, భక్తిపథ తీర్థాల పేరిట 108 పుణ్య తీర్థాలు ఉన్నాయి. వాటిలో జాబాలి తీర్థం
జాపాలి తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిశలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే దారిలో మధ్యలో దిగాలి. అక్కడి నుంచి పావు కిలోమీటరు దూరం మెట్ల మార్గంలో వెళ్లాలి. తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం పక్కన ఉన్న దారి గుండా... కాలినడకన జాపాలి ఆంజనేయుడి సన్నిధికి చేరుకోవచ్చు. కాకపోతే, దట్టమైన అరణ్యం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గాన స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అపర రేణుక అంశగా భావించే బాట గంగమ్మను పూజించి, దారిలో ఏ ఇబ్బందీ లేకుండా చూడాలని వేడుకుంటూ ఉంటారు.
జాబాలి తీర్థం పరిసరాల్లో ఆధ్యాత్మికత తొణికిసలాడుతుంటుంది. చుట్టూ చిక్కని పచ్చదనం.. మధ్యలో కోనేరు... చూడముచ్చటగా ఉంటుంది. జాబాలి అనే మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేదట. భగవంతుని కోసం ఆయన కఠోర తపస్సు ఆచరించిన పుణ్య ప్రదేశం ఇది. అందుకే ఈ తీర్థం.. జాబాలి తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా ఇక్కడి జాబాలి ఆశ్రమానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడి తీర్థంలో రాముడు స్నానమాచరించాడని అంటారు. ఆ తీర్థాన్నే ‘రామకుండం’గా పిలుస్తున్నారు. ఈ తీర్థ ప్రాశస్త్యం స్కాంద, వరాహ పురాణాల్లోనూ కనిపిస్తుంది.
జాబాలి తీర్థంలో వెలసిన ఆంజనేయుని ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది. అంజనాదేవికి.. స్వామి హనుమ ఇక్కడే జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఉత్తరాభిముఖంగా ఉన్న కపీశ్వరుడిని పూజించడం ద్వారా గ్రహ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జాపాలి తీర్థాన్ని ‘ఆనందాశ్రమం’గా కూడా అభివర్ణిస్తారు. ఇక్కడ స్వామి దర్శన మాత్రం చేత.. మానసిక ఆనందం సిద్ధిస్తుందని నమ్మకం.తప్పకుండా దర్శించవలసిన అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి జన్మస్థల క్షేత్రం శివుడు రుద్రాంశలో ఆంజనేయ స్వామిగా అవతరించడానికి ముందే ఒక మహా భక్తునికి ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చిన స్థలం.
ఆంజనేయ స్వామి వారి తల్లి అంజనాదేవి కఠిన తపస్సు చేసిన పుణ్యస్థలం.
పరమ పవిత్ర తిరుమల క్షేత్రంలో శ్రీరాముడు స్నానమాచరించిన రామగుండం తో పాటు అనేక విశేషాలకు నెలవైన ఆ క్షేత్రమే *జపాలి క్షేత్రం.*
స్థల పురాణం
త్రేతాయుగంలో దుష్ట సంహారం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ రామచంద్ర స్వామి అవతారం ఎత్తగా, శ్రీరాములవారికి సహాయము చేయడానికి శివుడే / శివుడి అంశనే ఆంజనేయ స్వామిలా అవతరించారని ప్రతీతి
అయితే *జాబాలి* అనే మహర్షి హనుమంతుడి అవతారనికంటే ముందే ఆ రూపాన్ని దర్శించి, ప్రసన్నం చేసుకోవాలని తలచి అనేక చోట్ల ఘోర తపస్సు చేస్తూ తిరుమల కొండపై అనేక జప / హోమాలు చేసిన పిమ్మట స్వామి సంతోషించి భవిష్యత్తులో అవతరించబోయే హనుమంతుని రూపాన్ని ఇక్కడ స్వయంభుగా వెలసి జాబాలి మహర్షికి చూపించినాడని స్థల పురాణం.
జాబాలి మహర్షి జపాలకు మెచ్చి స్వామి స్వయంభుగా వెలసినందువల్ల ఈ క్షేత్రం జాపాలి క్షేత్రంగా పిలవబడుతోంది.
ఈ క్షేత్రంలోనే పరమ పవిత్రమైన తీర్థాలైన రామగుండం, సీతాగుండం, ధృవతీర్థం వంటి తీర్థాలు ఉండటం వల్ల జపాలి తీర్థం అయ్యింది.
శ్రీరాముడు రావణాసురున్ని సంహరించి, సీతా మాత సమేతంగా అయోధ్య వెళుతూ ఇక్కడ స్నానామాచరించినారట. అందుకే శ్రీరాముల వారు స్నానం చేసిన తీర్థాన్ని రామగుండం (ఆలయం ఎదురుగా ఉన్న తీర్థం ) అనీ, సీతమ్మవారు స్నానమాచరించిన తీర్థాన్ని సీతాగుండం (ఆలయం వెనుక వైపు) అనీ పిలుస్తారు వినీల ఆకాశంలో ధృవతార గా వెలుగొందుతున్న భక్త ధృవుడు తపమాచరించినాడట. ఇప్పటికీ ఇక్కడ ధృవ తీర్థం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటినే ఆంజనేయస్వామి వారి కైంకర్యాలకు వినియోగిస్తున్నారు. ఈ తీర్థములోని నీరు అనేకఔషధ గుణాలు కలిగి ఉన్నవని ప్రతీతి.ఆలయానికి పశ్చిమాన ఉన్న తీర్థాన్ని హనుమాన్ తీర్థం అని పిలుస్తున్నారు.
ఆలయ విశిష్టత .
ఎటువంటి కష్టానష్టాలున్నా స్నానం చేసి తడిబట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తీరుతాయని విశ్వాసం. జన్మ శని కలిగినవారు తమ పుట్టినరోజు నాడు ఇక్కడ స్వామి వారికి పూజ, అభిషేకము చేస్తే శని ప్రభావం వల్ల కలిగే అనేక బాధలు కలగవు అని మరో విశ్వాసం. అలాగే పంచమహా పాతకాలు, భూత, ప్రేత, పిశాచాది బాధలు ఉన్నవారు ధృవ తీర్థంలో స్నానామాచారిస్తే ఆ కష్టాలు తీరుతాయని స్కాందపురాణంలోని వేంకటాచల మహాత్మ్యంలో చెప్పబడింది
జాబాలి మహర్షి ఇక్కడి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడైనాడట
శ్రీవారి ప్రియ భక్తులైన
శ్రీ హాథీరాంబావాజీ కూడా ఇక్కడే సంచరిస్తూ తపస్సు చేసుకునేవారట.
ఈ ఆలయం ప్రస్తుతం శ్రీ హాథీరాంజీ మఠం వారి ఆధీనంలో ఉన్నది
ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు భాగం వినాయకుడి ఆకారంలో ఉండటం మరో విశేషం.
తిరుమల వెళ్లినపుడు తప్పకుండా జపాలి క్షేత్రాన్ని దర్శించుకోండి.
No comments:
Post a Comment