Tuesday, 27 May 2025

*సుస్థిర జీవనోపాధి లక్ష్యంగా మహిళా మార్ట్ ఏర్పాటు*


*ప్రారంభోత్సవకు సిద్దమైన ఖమ్మం మహిళా మార్ట్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
*మహిళా మార్ట్ ను లాభాల బాటలో నడిపేలా అవసరమైన కార్యచరణ*
**సీక్వెల్ రోడ్డులోని మహిళా మార్ట్ ప్రారంభ ఏర్పాటు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*

ఖమ్మం : మహిళా సంఘాలకు అర్ధిక భరోసా కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఖమ్మం మహిళా మార్ట్ బుధవారం మంత్రులచే అధికారంగా ప్రారంభోత్సవంకు సంసిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్, సీక్వెల్ రోడ్డులోని ఖమ్మం మహిళా మార్ట్ ను సందర్శించి మంత్రులచే ప్రారంభోత్సవ ఏర్పాటు పనులను పరిశీలించారు. మార్ట్ లో ఏర్పాటు చేయు ఆర్గానిక్ ఉత్పత్తులు, మహిళాలచే చేసిన తినుబండారాలు, బొమ్మలు, ఎక్విప్మెంట్ లపై, ప్రొడక్ట్స్, స్వయం తయారీ ఇతర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఖమ్మం బ్రాండ్ మార్క్ ను పరిశీలించారు. మార్ట్ ఆకర్షణీయంగా ఉండే విధంగా కంప్యూటరైజ్ బిల్లు, లోగోల నిర్వహణ పట్ల అధికారులను కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* మహిళా మార్ట్ నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. మహిళా మార్ట్ ను లాభాల బాటలో నడిపేలా మహిళా సంఘాలకు ప్రత్యేక కార్యచరణ రూపొంచామని చెప్పారు. మహిళా మార్ట్ లో ఏ.సి. ఏర్పాటు ద్వారా ప్రతి నెలా కరెంట్ బిల్లు అధికంగా వస్తుందని, మహిళా మార్ట్ ప్రారంభించిన తర్వాత నిర్వహణ బాధ్యత స్వశక్తి మహిళా సంఘాలపై మాత్రమే ఉంటుందని, వీటిని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. 
మహిళా మార్ట్ ముందు భాగంలో ఉన్న ఓపెన్ స్పేస్ లో రిటైల్ బిజినెస్ క్రింద ఏర్పాటు చేస్తున్న వాటిని, వర్షం వచ్చిన కూడా ఇబ్బంది లేకుండా నీడలో కూర్చొనే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.మహిళా మార్ట్ నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని, సామాన్లు అందంగా పొందికగా అమర్చాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళా మార్ట్ లో పెట్టే వస్తువుల స్టాక్ నిల్వలు పకడ్బందీగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, పీఆర్ ఈఈ మహేష్ బాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***********************************************

*భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకం ....... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

*శిక్షణ పొందిన సర్వేయర్లు భూ హద్దులలో రైతులకు న్యాయం చేయాలి.*

*ల్యాండ్ సర్వేయర్ల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి* 
ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి లైసెన్స్‌ సర్వేయర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మంగళవారం స్థానిక టిటిడిసి భవనంలో సర్వే, ల్యాండ్ రికార్డు శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్‌ సర్వేయర్లకు మొదటి బ్యాచ్‌ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరైనారు.  భూ భారతి చట్టం, భూ సమస్యలపై సమగ్ర అవగాహన, భూ మ్యాప్, నక్షా, భూ హద్దులు తదితర విషయాలపై స్పష్టంగా సర్వేయర్ల అవసరమని వారి విధుల పై అవగాహన కల్పిస్తు కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* భూభారతి చట్టం అమలులో లైసెన్స్డ్ సర్వేయర్లు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు వీలుగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లను ఎంపిక చేసి, వారికి శిక్షణ అందించి అర్హత సాధించిన వారికి లైసెన్సులను జారీ చేయనుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన వారికి శిక్షణ కోసం ఎంపిక చేశామని అన్నారు. 50 రోజుల పాటు వీరికి భూముల సర్వేలో నిష్ణాతులు, అనుభవజ్ఞులైన వారిచే శిక్షణ ఇస్తున్నామని వివరించారు.భూభారతి చట్టంలో పొందుపర్చిన సెక్షన్ ల ప్రకారం భూముల క్రయవిక్రయాలు, సక్సేషన్ వంటి వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్ లను రూపొందించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వ్యవసాయ భూములకు కూడా సర్వే మ్యాప్ లను జతచేయాలని భూభారతి చట్టంలో పొందుపర్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు లైసెన్సుడ్ సర్వేయర్లు సర్వే జరిపి భూముల హద్దులు, సమగ్ర వివరాలతో సర్వే మ్యాప్ లను సమర్పిస్తే, వాటిని ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి ఆమోదించిన మీదట పట్టా పాస్ బుక్ కు జతచేయడం జరుగుతుందని తెలిపారు. పట్టా పాస్ బుక్ లు కలిగిన రైతులు ఎవరైనా సరే సర్వే మ్యాప్ కోసం దరఖాస్తు చేసుకుని, లైసెన్సుడ్ సర్వేయర్లచే సర్వే చేయించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి భూమి పార్సిల్ కు ఆధార్ తరహాలో భూధార్ నెంబర్ ను కేటాయించనుందని, దీని కోసం కూడా లైసెన్సుడ్ సర్వేయర్ల సేవలు అవసరం అవుతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ సందర్భంగా నేర్పించే అంశాలను చక్కగా ఆకళింపు చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. లైసెన్స్ సర్వేయర్లకు గెట్టు, భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులు  తదితర అంశాలపై థియరీ క్లాసులతో పాటు క్షేత్రస్థాయిలో చెయిన్ సర్వే, మ్యాప్ రీడింగ్ వంటి వాటి గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. భూ సంబంధిత సమస్యలలో అత్యధికంగా సర్వేతో ముడిపడిన అంశాలే ఎక్కువగా ఉన్నందున లైసెన్సుడ్ సర్వేయర్లు చక్కగా సేవలందిస్తే, అనేక భూ సమస్యల దరఖాస్తులు పరిష్కారం అవుతాయని, తద్వారా భూ వివాదాలకు తావు లేకుండా చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందని అన్నారు.
సర్వేయర్ల శిక్షణలో ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏమాత్రం సంశయానికి లోను కాకుండా వాటిని నివృత్తి చేసుకోవాలని సూచించారు. 50 రోజుల పని దినాలలో కొనసాగే శిక్షణ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తానని అన్నారు. భూభారతి చట్టం గురించి అవగాహన ఏర్పర్చుకుని, భూముల సర్వే విధానాన్ని సమగ్రంగా నేర్చుకుంటే లైసెన్సుడ్ సర్వేయర్ గా చక్కటి ఆదాయ వనరులను పొందవచ్చని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన లైసెన్సుడ్ సర్వేయర్లుగా ప్రభుత్వం గుర్తింపు పత్రాలను జారీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములు లావాదేవీలు జరిగినప్పుడు సర్వే చేసి హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తరువాత రిజిస్ర్టేషన్లు జరుగుతాయని దీనివల్ల తగాదాలకు చోటు ఉండదని కలెక్టర్‌ తెలిపారు. నిరుద్యోగులు ఈ ట్రైనింగ్‌ పూర్తి చేసి రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ కోరారు. అనంతరం నూతన సర్వేయర్లకు  శిక్షణ మెటీరియల్‌ ను కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏ డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
***********************************************
*అమ్మాయిల పరిరక్షణ అందరి బాధ్యత ....... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
*బాలికలు సమయపూర్తితో సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలి.*
*సోషల్ మీడియా పట్ల అమ్మాయులు అప్రమత్తంగా ఉండాలి.* 
*రిక్కాబజార్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న బాలికల రక్షణ,  హ్యూమన్ ట్రాఫికింగ్ పై స్కూల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్*
----------------------------------------------------------------------
ఖమ్మం : బాలికల భద్రత పట్ల ప్రభుత్వ ప్రాధాన్యత లో మొదటి అంశంగా ప్రత్యేక రక్షణ వ్యవస్ధ కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం స్థానిక రిక్కాబజార్ హైస్కూల్‌ నందు స్కూల్ అసిస్టెంట్ లకు నిర్వహించిన బాలికల రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్ పై శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో బాలికల భద్రత, హక్కులు, మానవ అక్రమ రవాణా నివారణ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అమ్మాయిలకు కలిగే ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులను గుర్తించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. అమ్మాయిలు అనుమానాస్పద వ్యక్తులతో మాటలాడే ముందు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ మహిళలు పంచుకోవద్దని సూచించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే, తక్షణమే అప్రమత్తం ఉండేలాగా  అమ్మాయిలకు ధైర్యం కల్పించాలని వివరించారు.విద్యార్థుల మానసిక, శారీరక మార్పులను గమనిస్తూ అవసరమైన సందర్భాల్లో సలహా, సహాయం ఉపాధ్యాయులు అందించాలని తెలిపారు. సిబ్బందికి బాలికల పట్ల చైతన్యవంతమైన శిక్షణ, వర్క్‌షాప్‌లు నిర్వహించడం ముఖ్యమని అన్నారు.విద్యార్థులు భద్రంగా ఉండాలంటే ఉపాధ్యాయులు ముందుగా అప్రమత్తంగా ఉండాలని, మానవ అక్రమ రవాణా వంటి మానవతా విరుద్ధ చర్యలను ఎదుర్కొనేందుకు స్కూల్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో కీలకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 24 May 2025

వేదంతో బాంబులు పేలకుండా చేసిన ఘనాపాటి: దండిభట్ల

వేదాల సాయంతో 
జర్మనీలోబాంబులు పేలకుండా చేసిన దండిభట్ల :-
మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని.. 

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట  విదేశీయులూ చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తోంది.. 
 శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.
ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభి
నివేశం,  ప్రతిభ ఉన్నవారుగా 19వ శతాబ్దంలో  పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు! 
రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.
తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థిక మాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూ పించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చ డానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యా లున్నాయని ఆయన గ్రహించారు. 
ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింప చేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు లబ్ధిపొందడానికి గట్టి చర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.
దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనే వారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరు వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కలకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటి దంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం! బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదు లయ్యారు. 
తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందేది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయల వంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది! 

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం. 

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.
ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..
అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు. 
ఇప్పటికీ గుర్తు పెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి..
ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలో స్క్రాప్ అంతా 
మన దేశంలో.. 
పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధంగా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు
మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితిలో లేము.. 
మన భారతదేశ ఔన్నత్యంను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ అంగుళం పెరగాలి కదా!
@highlight 
#డాఅయోధ్యశర్మకస్తూరి

Monday, 12 May 2025

టేక్ ఏ బ్రేక్ పాక్... ప్రధాని మోడీ హెచ్చరిక


పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఇందులో తొలుత ఉగ్రవాద శిబిరాలపైనా, ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లపైనా మిసైళ్ల వర్షం కురిపించింది.
ఈ దాడులతు ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను శరణు వేడటంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ పై ప్రధాని మోడీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఇవాళ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ పై చేసిన దాడి విషయంలో సైన్యానికి, శాస్త్రవేత్తలకు, దేశ ప్రజలకు సెల్యూట్ చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దేశంలోని ప్రతీ మహిళకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు చేసిన దాడి దేశంలో ప్రతీ ఒక్కరినీ కలచివేసిందన్నారు. కుటుంబ సభ్యుల ముందే తమ వారిని ఉగ్రవాదులు చంపారని, ఇది దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర అన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకు సవాల్ గా మారిందన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కు పీఏకేను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు.మన కూతుళ్లు, తల్లుల నుదుటి సిందూరం తీసేస్తే ఏం జరుగుతుందో అన్ని ఉగ్రవాద సంస్థలకు తెలిసేలా చేశామని ప్రధాని మోడీ తెలిపారు. మన దళాలు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడి చేశాయని, భారతదేశం ఇంత విధ్వంసం సృష్టించగలదని ఉగ్రవాదులు ఊహించలేకపోయారని ప్రధాని వెల్లడించారు. దేశం ఐక్యంగా ఉన్నప్పుడు, మనం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఉగ్రవాదులపై తాము చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు మాత్రమే కాదని, ఇది కోట్లాది మంది సెంటిమెంట్ తో కూడిన విషయం అన్నారు.

ఆపరేషన్ సిందూర్ అనేది న్యాయం కోసం ఒక అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ అని ప్రధాని మోడీ తెలిపారు. మే 6వ తేదీ అర్థరాత్రి, మే 7వ తేదీ ఉదయం, ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారడాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. శత్రువులకు తగిన సమాధానం ఇచ్చినందుకు భారత సాయుధ దళాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారి శౌర్యం మన దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు అంకితం అన్నారు. భారత క్షిపణులు, డ్రోన్లు పాకిస్తాన్ లోపల దాడి చేసినప్పుడు, దాడికి గురైంది ఉగ్రవాద సంస్థలు మాత్రమే కాదని, వారి నైతికత కూడా దెబ్బతిందన్నారు.

ఆపరేషన్ సిందూర్ తో భారతదేశం 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని ప్రధాని తెలిపారు. దీంంతో పాకిస్తాన్ తీవ్ర షాక్‌లో ఉందన్నారు. తమ దాడితో పాకిస్తాన్ ఉలిక్కిపడిందని, భారతదేశంతో నిలబడటానికి బదులుగా ప్రతిదాడులు చేసిందన్నారు. పాకిస్తాన్ గురుద్వారాలు, పాఠశాలలు, పౌరుల ఇళ్లను ,సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. పాకిస్తాన్ తనను తాను పూర్తిగా బయటపెట్టుకుందని తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దులో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని, కానీ భారతదేశం నేరుగా పాకిస్తాన్ గుండెపై దాడి చేసిందని మోడీ స్పష్టం చేశారు.పాకిస్తాన్ పై దాడుల్ని జస్ట్ వాయిదా వేశామని, ఆ దేశం భవిష్యత్తులో తీసుకునే చర్యను బట్టి తాము దాడుల్ని కొనసాగిస్తామని ప్రధాని తెలిపారు. భారతదేశంపై దాడి జరిగినప్పుడు తాము ధీటుగా, అణిచివేతగా స్పందించామన్నారు. భారతదేశంపై ఇకపై ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే తాము దీటుగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. తాము ఎలాంటి అణు బెదిరింపుల్ని సహించబోమన్నారు. తమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్తాన్ సైన్యం,ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, అది ఒకరోజు వారిని లోపలి నుండే నాశనం చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే, వారు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలన్నారు. ఉగ్రవాదం,చర్చలు కలిసి సాగలేవన్నారు.

Friday, 9 May 2025

జర్నలిస్టులకుమరోసారి భరోసా.. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి.....

హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల మరణానికి గురైన 38 మంది జర్నలిస్టులతో పాటు ప్రమాదాలకు, అనారోగ్యానికి గురై మంచం పట్టిన మరో 8మంది జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) అండగా నిలిచింది. తెలంగాణ మీడియా అకాడమీ నుండి అందించే ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాల చేత టీయూడబ్ల్యూజే దరఖాస్తులు సమర్పించింది. ఇవ్వాళ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిల చేతుల మీదుగా బాధిత కుటుంబాలు చెక్కులను అందుకున్నాయి. ఈ సందర్భంగా సమాచారం రెవెన్యూ స్టాంప్ లు రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి శ్రీనివాసరెడ్డి మరోసారి జర్నలిస్టులకు ఇళ్ల విషయం విషయంలో హామీ ఇచ్చారు. అర్హులైన.  జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాడు నాంపల్లి లోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మండల, నియోజకవర్గ స్థాయిలో పని చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజనికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు  ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.  జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తన జీవితం మొత్తం ఆ వృత్తికే అంకితం అయినవాళ్ళు ఎంతోమంది ఉన్నారని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమత్తులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు.విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42.00 కోట్లను ఫీక్సడ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు పెడుతుందని.  జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన 597 మందికి రూ.1,00,000/-తో పాటు అయిదు సంవత్సరాల వరకు, నెలకు రూ.3000/- ల చొప్పున పెన్షన్, వారి పిల్లలకు ట్యూషన్ ఫీజుల క్రింద 1 నుండి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు నెలకు 1,000/-ల చొప్పున గరిష్టంగా ఇద్దరికి అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ఖాతాలో మొత్తం రూ.8,98,39,000/-లు ఆర్థిక సహాయం అందించండం జరిగిందన్నారు.ఖమ్మం  పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురామ రెడ్డి మాట్లాడుతూ ఈ  సమాజంలో జర్నలిస్టు వృత్తి అత్యంత  కీలకమైనదని తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని గడిచిన రెండు రోజులుగా రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఎదురుచూస్తున్న ప్రజలకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణలతో పాటు ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ. మాజీద్, రాష్ట్ర కార్యదర్శులు కే.శ్రీకాంత్ రెడ్డి, జి.మధుగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్ కుమార్, గౌస్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు,హెచ్.యూ.జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ లు పాల్గొన్నారు.
#################################
@ మణికుమార్ కొమ్మమూరు.
సీనియర్ జర్నలిస్ట్, 
మోబైల్ : 9032075966
#################################

Wednesday, 7 May 2025

గురి తప్పలేదు... ఉగ్రముఖలపై విరుచుకుపడ్డ స్కాల్ మిస్సైల్..


పహల్గాం ఘాతుకానికి పాల్పడిన పాక్‌కు భారత్.. ఆపరేషన్ సిందూర్‌తో గట్టి షాకిచ్చింది. అర్ధరాత్రి మిసైల్ దాడులతో పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను తుత్తునీయలు చేసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు చేసేందుకు భారత్ హామర్, స్కాల్ప్ మిసైళ్లను కూడా వాడినట్టు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ దీర్ఘశ్రేణి మిసైల్స్‌తో శత్రుమూకలకు చెందిన అత్యంత పటిష్ఠమైన నిర్మాణాలను కూడా కూల్చి వేయొచ్చు.

ఏమిటీ స్కాల్ప్ మిసైల్
ఫైటర్ విమానాల నుంచి ప్రయోగించ గలిగే ఇవి దీర్ఘ శ్రేణి క్రూయిజ్ మిసైల్స్. ఇవి 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులువుగా ఛేదించగలవు. ఈ మిసైల్స్‌కు చెందిన కొన్ని వర్షెన్లు 560 కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఛేదించగలవు. శత్రుదేశపు కమాండ్ సెంటర్లు, విమానిక స్థావరాలు, బంకర్ల వంటి భద్రతమైన నిర్మాణాలను కూడా ఈ మిసైల్స్ ధ్వంసం చేస్తాయి. వీటిల్లోని ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ, టెర్రెయిన్ ఫాలోయింగ్ రాడార్, ఇన్‌ఫ్రారెడ్ టర్మినల్ హోమింగ్ వంటి వ్యవస్థల కారణంగా ఇవి అత్యంత కచ్చితత్వంతో తమ లక్ష్యాలను ఛేదింజగలుగుతాయి. వీటితో 450 కిలోల సంప్రదాయిక వార్ హెడ్స్‌ను మోసుకెళ్లగలదు. సిందూర్‌ ఆపరేషన్‌లో రఫేల్ విమానాల ద్వారా వీటిని ప్రయోగించినట్టు తెలుస్తోంది.
హామర్ మిసైల్స్
యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే ఈ మిసైల్స్ 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. బంకర్లు, బహుళ అంతస్తుల భవనాలను ధ్వంసం చేసేందుకు వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇన్‌ఫ్రారెడ్, లేజర్ గైడెన్స్ ఉన్న కారణంగా వీటికి వివిధ రకాల లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. రఫేల్, తేజస్ యుద్ధ విమానాల ద్వారా వీటిని ప్రయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

శత్రుదేశ దాడులతో యుద్ధ విమానాలకు అపాయం లేకుండా కామెకాజీ డ్రోన్స్‌తో దాడులు చేస్తారు. స్వతంత్రతో పనిచేసే ఈ డ్రోన్లు ఎంపిక చేసిన లక్ష్యాలపై ఎగురుతూ దాడులు చేస్తాయి. ముఖ్యమైన లక్ష్యాలను ధ్వంసం చేసేందుుకు వీటిని వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు.

భారత ఆర్మీకి సంఘీభావంగా నెక్లెస్ రోడ్ నుంచి రేపు ర్యాలీ తెలంగాణ సి.ఎం.

దేశ భద్రతా బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్మీ, పోలీసు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర అత్యవసర విభాగాలతో తాజా పరిణామాలను సమీక్షించిన ముఖ్యమంత్రి ఇలాంటి సందర్భాల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

✅భారత సైనిక బలగాలకు సంఘీభావంగా, అండగా ఉన్నామని సందేశం ఇవ్వడానికి తెలంగాణ ప్రజల తరఫున గురువారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. “తీవ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావ ప్రకటన” గా ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు.

✅ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు, పార్టీలకు సంబంధించిన వివాదాలకు తావులేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి  ఆయా విభాగాలకు స్పష్టంగా పలు ఆదేశాలిచ్చారు.

✅మంత్రులు, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలి. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలి. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి.
✅వైద్యం, పౌరసరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

✅పరిస్థితిని ఆసరా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

✅ముఖ్యంగా తప్పుడు సమాచారం వ్యాప్తి జరక్కుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన కఠినంగా వ్యవహరించాలి. ఫేక్ న్యూస్‌ను, పుకార్లు వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.

✅రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో 24 గంటలు అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలి.

✅హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సందర్భంగా పీస్ కమిటీలతో సమావేశం కావాలని చెప్పారు. పాత నేరస్తులు, ఇతర నేర చరిత్ర కలిగిన వారిపట్ల పోలీసులు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సీఎం ఆదేశించారు.

✅ఈ సమావేశంలో ఆర్మీ, పోలీసు, ఇతర అత్యవసర విభాగాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Following the developments under Operation Sindoor conducted by the Indian security forces, Hon'ble Chief Minister Shri A Revanth Reddy convened an emergency review meeting. He reviewed the situation with senior officials from the Army, Police, Disaster Management, and other emergency departments and issued directions on necessary actions.

✅ On behalf of the people of Telangana, it has been decided to organise a Solidarity Rally from Dr. B.R. Ambedkar Secretariat to Necklace Road at 6 PM on Thursday, to express support for the Indian military forces. The Chief Minister stated that this rally would stand as a statement of unity in the fight against terrorism.

✅ The CM made it clear: no politics or party disputes—only collective responsibility. Departments must be on high alert.

✅ Leaves are cancelled for all emergency staff. Foreign trips must be postponed. Ministers and officials should remain available 24/7.

✅ Toll-free helplines must be set up for round-the-clock medical, electricity, and civil supply services. A monitoring unit will operate from the Police Command Control Center.

✅ Strict action against those spreading fake news or provocative content on social media. A dedicated cell will handle misinformation.

✅ CCTV networks in all three commissionerates must be linked to the command center. Security is to be tightened across all districts and sensitive zones.

✅ Police in Hyderabad must remain vigilant and coordinate with peace committees. Repeat offenders must be closely watched.

✅ Senior officials from the Army, Police, and emergency departments participated in the meeting.
#OperationSindoor #indianarmy #JaiHind #Telangana

ఆపరేషన్ సింధూర్ పై అమెరికాతో అజిత్ దోవల్ మాటా-మంతి

ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలపై  NSA అజిత్ దోవల్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు వివరించారు 🇮🇳 ఆప్ సిందూర్ అనేది తీవ్రతరం కాని దాడి. పాకిస్తాన్ పౌర, ఆర్థిక లేదా సైనిక లక్ష్యాలను తాకలేదు. తెలిసిన ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. దాడుల తర్వాత కొద్దిసేపటికే NSA శ్రీ అజిత్ దోవల్ అమెరికా NSA మరియు విదేశాంగ కార్యదర్శితో మాట్లాడారు మార్కో రూబియో ఉగ్రవాద లక్ష్యాలపై భారత క్షిపణి దాడులను 'యుద్ధ చర్య'గా అభివర్ణించారు, ప్రతిస్పందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. #IADN

Saturday, 3 May 2025

ఏసీబీ కస్టడిలోనే మాజీ ఈఎన్సీ హరిరామ్.. మరో మూడు రోజుల పాటు విచారణ*

*

కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరి రామ్‌ పై ఏసీబీ విచారణ రెండో రోజు కోనసాగుతుంది. నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతితో చంచల్ గూడ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న హరిరామ్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణకు కస్టడికీ తీసుకున్నారు.
వారం రోజులు పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. మే 6 వ తేది వరకు ఏసీబీ అధికారులు హరిరామ్ ను విచారించనున్నారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. శుక్రవారం విచారణకు హరిరామ్ సహకరించలేదని తెలుస్తున్నది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో సస్పెన్షన్ లో ఉంచారు. ఏసీబీ దాడులలో గుర్తించిన రూ.13.50కోట్ల ఆస్తుల పై హరిరామ్ ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. గజ్వేల్ లో వంద ఏకరాలు కొనుగోలు చేశారన్న ఆరోపణల పై కూడా విచారణ చెపట్టనున్నారు

*NTA-NEET (UG) పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNS అమలు : ఖమ్మం సి.పి. సునీల్ దత్*


*NTA-NEET (UG) పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు*

*పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు, పరిసరాలలో పోలీస్ పెట్రోలింగ్*

*పోలీస్ కమిషనర్ సునీల్ దత్*
ఖమ్మం : నేడు (ఆదివారం) ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నిర్వహించే NTA- NEET (UG) -2025 పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12.00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్  తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు  పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు తో పాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

*NTA-NEET (UG) పరీక్ష కేంద్రాలు*

1) SR & BGNR డిగ్రీ కళాశాల, NTR సర్కిల్, ఇల్లందు రోడ్డు, ఖమ్మం.

2 ) ప్రభుత్వం హై స్కూల్, శాంతి నగర్, చర్చి కంపౌండ్, మిషన్ హాస్పిటల్ సమీపంలో, ఖమ్మం. 

3) ప్రభుత్వ హై స్కూల్, ఎన్ఎస్సి కాలనీ, ఎన్ఎస్టి రోడ్, నిర్మల్ హృదయ్ స్కూల్ సమీపంలో, ఖమ్మం.

4) ప్రభుత్వం మహిళ డిగ్రీ కాలేజ్, రాధాకృష్ణ బ్లాక్, రైల్వే స్టేషన్, ఖమ్మం.

5) యూనివర్శిటీ పిజి కాలేజ్ ఫర్ ఉమెన్, ఎన్‌టిఆర్ సర్కిల్, ఇల్లందు రోడ్డు, ఖమ్మం.

6) కేంద్రీయ విద్యాలయం, కరుణగిరి సమీపంలో, పోలేపల్లి, ఖమ్మం రూరల్.