ఖమ్మం : మున్నేరు కిరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల, భూ సేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత సంవత్సరం వచ్చిన వరద, మున్నేరు నదికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, రిటైనింగ్ వాల్ కొరకు భూసేకరణ, భూ నిర్వాసితులకు ఇచ్చే ప్రభుత్వ స్థలం వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* మున్నేరు నదికి ఇరువైపులా ఎనిమిదిన్నర కిలో మీటర్ల చొప్పున మొత్తం 17 కిలో మీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, వీటీ కోసం మొత్తం 245 ఎకరాల భూమి అవసరమని, ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూమిలో 5 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయని అన్నారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన 138 ఎకరాల పట్టా భూమి సేకరణ చేయాలని నిర్ణయించామని అన్నారు. పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అభివృద్ధి చేసి పరిహారంగా అందించేలా స్థానిక రైతులను ఒప్పించాలని అన్నారు.మున్నేరు నదికి ఇరువైపులా సేకరించాల్సిన పట్టా భూముల రైతులతో పలుమార్లు చర్చలు జరిపి 70 ఎకరాల వరకు ఒప్పించామని అధికారులు తెలిపారు. పోలేపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో వెంచర్, 100 ఫీట్ రోడ్డు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసిన భూమి పట్టాదారులకు అందించాల్సి ఉంటుందని అన్నారు.
పోలేపల్లి ఏరియాను ముందు గ్రౌండ్ లెవెలింగ్ పనులు, 100 ఫీట్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
పోలేపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ లాగా అంతర్గత రోడ్లు, స్కూల్స్, త్రాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రతి వారం పనుల పురోగతి నిర్దేశిత లక్ష్యాలను పెట్టుకోవాలని అన్నారు. ప్రకాష్ నగర్ చెక్ డ్యాం బ్యాక్ వాటర్ కారణంగా ముంపు పెరుగుతుందని, దానిని తొలగించడానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖలతో ఫాలో అప్ అవుతూ త్వరగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం డిస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం పనులకు, సింగరేణి, జాతీయ రహదారుల నిర్మాణం అవసరమైన భూ సేకరణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు. భూ సేకరణ ఎంజాయ్ మెంట్ సర్వే వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్ గౌడ్, నేషనల్ హై వే పిడి రామాంజనేయ రెడ్డి, మేనేజర్ దివ్య, ఇర్రిగేషన్ డిఇ రమేష్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
*రైతుల ఖాతాల్లో 406 కోట్ల 36 లక్షల రైతు భరోసా
------------------------------------------------------------------------
నిధులు జమ… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం : రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు 406 కోట్ల 36 లక్షల రైతు భరోసా నిధులు జమ చేసామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 3 లక్షల 53 వేల 794 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 436 కోట్ల 84 లక్షల 65 వేల 365 రూపాయలు జమ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 15 ఎకరాల వరకు వున్న 3 లక్షల 31 వేల 397 మంది రైతులకు 406 కోట్ల 36 లక్షల 62 వేల 570 రూపాయలను రైతు భరోసా వానాకాలం - 2025 క్రింద రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.