Sunday, 31 January 2021

అస్తమించిన ఈ సూర్య ''ప్రకాశం''.... ఆశయానికి ఆసరాగా నిలబడిన దేహం ఇప్పుడు లేదు....

ఇప్పుడాయన లేరు కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. 
నేను ఆయన భార్య విజయలక్ష్మిగారితోనూ వారి అమ్మాయి భానుప్రియగారితోనూ ఇందాకే అంటే  8-20 PM కి మాట్లాడాను. 
ఆయన కార్యం ఆగిపోవడం ఇష్టం లేని వారు ఈ కార్యంలో వారికి చేయూతగా నిలిచేవారు వారెవ్వరైనా వారితో మాట్లాడవచ్చు. వారి అశయానికి స్పూర్తిగా నిలబడవచ్చు. - 28th Jan, 2021. - గౌతమ్ కశ్యప్ Dr Gautham Kashyap PhD.,
ఎందుకంటే నాకు తెలిసిన ఆ మామూలు ప్రకాశరావు లక్షల్లో ధనం వున్నవాడు కాదు కానీ కోట్లు పోసినా కొనలేని నిస్వార్థమైన హృదయం వున్నవాడు. అందుకే భారత ప్రభుత్వం తలవంచి ఆయనను పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించి తనను తాను గౌరవించుకుంది.  
ఆయన చాలా చిన్నవాడు, జీవితంలో తళుకు బెళుకులు లేని వాడు. అవి తెలియని వాడు. 
ఎపుడూ సంపాదన మీద దృష్టిపెట్టని వాడు. 
ఉన్నదాంట్లో సగం, అది ఇల్లూ కావచ్చు, సంపాదన కావచ్చు,
ఎపుడూ పేద పిల్లలతో పంచుకునేవాడు...!
ఆయనే దేవరపల్లి ప్రకాశ్ రావు.. 
ఈయన వృత్తి ఒరిస్సాలోని కటక్ లో టీ బంకు నడుపుతూ ఉంటాడు. ఆయన కేవలం తమ టీ స్టాల్ తో విప్లవం తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ప్రకాశరావు చాలా కిందట ఒరిస్సా వెళ్లి, అక్కడ రకరకాల మార్గాల్లో బతుకు పోరాటం సాగించి సాగించీ చివరకు టీ బంకుతో సెటిల్ అయ్యారు.!
అయితే, తానుంటున్న బస్తీలో పేద పిల్లలకు స్కూల్ లేకపోవడంతో తన చిన్న ఇంట్లో నే స్కూల్ తెరిచారు. తన సంపాదనలో సగంతో పిల్లల మీద ఖర్చు పెట్టి చాలా పెద్ద వాడయ్యాడు. మనమెవ్వరం అందుకోలేనంత పెద్దవాడయ్యాడు. ఆంధ్ర ప్రదేశ్ దాకా ఆయన కీర్తి రాకపోయినా, ప్రపంచమంతా ఆయనకు నీరాజనాలు పట్టింది.  ఆయనకు పద్మశ్రీ అవార్డ్ కూడా ప్రకటించింది.!
ఆయన కథ ఇది!
ఒడిషా రాష్ట్రంలోని కటక్ లో బక్సిబజార్ అని ఒక బస్తీ ఉంది. 
అక్కడ ఉండేవాళ్లంతా కూలీనాలి చేసుకునే వాళ్లు, రిక్షా తోలేవాళ్లు, చిన్న చిన్న పనులు చేసి బతుకు వెళ్లదీస్తున్న వాళ్లు. 
భారత దేశంలోని అన్ని బస్తీల లాగానే ఇది కూడా ఒక మురికి వాడ. 
ఆ మధ్య హఠాత్తుగా ఈ బస్తీ వార్తలకెక్కింది. 
జాతీయ, అంతర్జాతీయ విలేకరులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ఎన్జీవోల ప్రతినిధులు ఈ బస్తీ కొస్తున్నారు కనక ఆ బస్తీ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమ్రోగుతోంది.
తాజాగా ఈ మధ్య జిల్లాకలెక్టర్ కూడా వచ్చి వెళ్ళారు. దీనికంతటికీ కారణం, అక్కడున్న ఆ చిన్న చాయ్ దుకాణం, దాన్నినడిపే తెలుగు వాడైన ప్రకాశ్ రావు.!
ప్రకాశ్ రావుతో ఫోన్లో మాట్లాడండి, తెలుగులో బాగున్నారా అనడగండి..
అంతే ఆయన అనర్గళంగా తెలుగులో సంభాషణ మొదలుపెట్టి, మధ్య మధ్య ఒడియాలో కి దూకుతూ, ఇంగ్లీష్ లో అలవోకగా మాట్లాడుతూ, అపుడపుడు హిందీ వాడుతూ మిని ఇండియాలా ప్రత్యక్షమవుతాడు..!
ప్రకాశ్ రావు ఖాయిలాపడి, చచ్చిబతికినవాడు. అపరేషన్ జరుగుతున్నపుడు ఎవరో అనామకుడు చేసిన రక్తదానంతో బతికి బయటపడ్డాడు. ఆ అనామకుడే ఈ రోజు ‘ఇంత వాడు’ అయ్యాడు....!
ఇది జరిగి 40 సంవత్సరాలయింది. 
అప్పటినుంచి చావుబతుకుల్లో ఉన్నవాళ్లకి రక్తదానం చేసితీరాలని కున్నాడు. రక్తమే కాదు, ఎంత సహాయం చేయాలో అంతా చేయాలనుకున్నాడు. చేస్తున్నాడు.
ఆయన రక్తదానం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది...!
అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్ లెట్స్ దానం చేశాడు...! 
ఇపుడు, పేద రోగులకు అసుప్రతిలో వేడి నీళ్లిందిస్తాడు, పాలు, బ్రెడ్ అందిస్తాడు, వీలయితే, పళ్లు కూడా అందిస్తాడు. ఇది రోజూ జరిగే ప్రక్రియ. 
ప్రకాశ్ రావు సేవ చూసి ఒక పెద్ద మనిషి ఆయన గీజర్ కొనిచ్చాడు, అధికారులు ఆసుప్రతిలో ఒక గది ఇచ్చారు. మరొకరెవర్ అంబులెన్స్ ఇచ్చారు..! 
ఇంతకంటే మరొక ముఖ్యవిషయం ఉంది. 
బస్తీలో పిల్లలెవరు చదువుకోవడం లేదని, చిల్లర తిరుగుళ్లకు అలవాటు పడి పాడైపోతున్నారని గమనించి, ఆ పరిస్థితి మార్చాలని కున్నాడు...! 
అంతే, వెంటనే తన రెండుగదుల ఇంటిలో ఒక గదిని స్కూలుగా మార్చేశాడు. పిల్లలని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చి, పుస్తకాలు కొనిపించి చదువు చెప్పడం మొదలుపెట్టాడు.
"మొదట్లో వారి తల్లిదండ్రులు నన్ను తిట్టారు. మాపిల్లలు పాచిపనికి వెళ్లి నాలుగు రూకలు తెచ్చే వాళ్లు.
నువ్వు బడిపెట్టాక, వీళ్లు పని మానేస్తున్నారని దబాయించారు...!
వాళ్లని ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను. చివరకుభోజనం నేనే పెడతాను అనిచెప్పి వాళ్ల అంగీకారం పొందాను...!
ఇపుడు నా గది స్కూలయింది. 70 మంది విద్యార్థులు, అయిదుగురు టీచర్లున్నారు. టీచర్ కు రు. 1500 ఇస్తాను. అందరికి భోజనం ఉచితం, అని ఎషియానెట్కు ఫోన్లో వివరించాడు .
ఈ ఖర్చెవరిస్తున్నారు...!?
‘ఇదంతా నా సొంత డబ్బే. టీ స్టాల్ లో బన్ బిస్కట్ లతో పాటు వడలు కూడా ఉంటాయి. రోజూ అన్ని ఖర్చులు పోను రు. 600 దాకా మిగులుతుంది. అందులో స్కూల్ కోసం రు. 300 ఇస్తాను..!
నాకుటుంబానికైనా తగ్గిస్తాను, బడి ఖర్చు తగ్గించను. అది నా జీవిత ధ్యేయం. చిన్నపుడు డాక్టర్ కావాలని నాకు కల ఉండేది.
పేదరికం, అనారోగ్యం వల్ల సాధ్యం కాలేదు. అందువల్ల ఈ పిల్లలను చదివిస్తున్నాను. కొంత మంది మెట్రిక్ లేషన్ పాస్ అయ్యారు కూడా" అని స్కూల్ ప్రగతి గురించి వివరించాడు.
మధ్యాహ్నబోజనానికి రోజూ రు. 8 కావాలి, అయితే, అంత లేదు. అందువల్ల ఉన్నంతలో చేస్తున్నాను.
ఈ మధ్య కలెక్టర్ వచ్చి అభినందించారు. మధ్యహ్నం భోజనం పథకాన్ని మాస్కూల్ కు పొడిగించాలని కోరాను. అయితే, రూల్స్ ప్రకారం ప్రయివేటు స్కూళ్లకు పథకం వర్తించదని చెప్పారు. అయినా  తాను నిరుత్సాహ పడటం లేదు అని అన్నాడు.
పొద్దున పూటంతా చాయ్ దుకాణం నడిపి, మధ్యాహ్నం టీచర్ అవతారం ఎత్తుతాడు ప్రకాశ రావు. ఈ మద్య లో ఒక రౌండ్ సైకిలేసుకుని ఆసుప్రతికి వెళ్లడం ఆయన రోజు వారి పని...!
ఇంతకీ ప్రకాశరావు ఎవరు?
ప్రకాశరావు ముత్తాత దేవర పల్లి అప్పాలస్వామి...!
1888 ప్రాంతంలో పిల్లా జెల్లా వేసుకుని నడుచుకుంటూ తూర్పు దేశ యాత్ర ప్రారంభించారు. చివరకు వాళ్లు ఒరిస్సా కటక్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో మకాం వేశారు. అదిపుడు "తెలంగపెంట"ఊరుగా మా రింది. తాత మంచి వంటగాడు కావడంతో బ్రిటిష్ వాళ్ల దగ్గిర కొలువుకు కుదిరాడు. బెంగాల్ అస్సాం తిరిగి చివరకు "తెలంగపెంట" ఊరికే వచ్చాడు..
తండ్రి కృష్ణ మూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో సైన్యంలో బర్మాలో పనిచేసి తిరిగొచ్చాడు. కొద్ది రోజులు ఒక ప్రయివేటు కంపెనీలో అర్క్ వెల్డర్ గా పనిచేశాడు.
1960లో టీ స్టాల్ తెరిచాడు. అయితే, తండ్రి చనిపోవడం, తర్వాత టిబి వ్యాధి సోకడంతో ప్రకాశ్ రావు చదువు మానేసి టీస్టాల్ బాధ్యత తీసుకున్నాడు. 
అంతర్జాతీయ అవార్డు :
బిసెంట్ సెల్ఫ్ లెస్ సర్వీస్ అవార్డు-2016కి ఆయన ఎంపిక అయ్యారు. 
ఆయనకు గతంలో చాలా అవార్డులొచ్చాయి. ఇపుడాయన కీర్తి అంతర్జాతీయస్థాయికి చేరుకుంది..!
ఆయన వయస్సు 60 సంవత్సారాలు. అలసటలేదు, విశ్రాంతి లేదు. ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని ఉత్సాహంగా చెబుతాడు.
నీకింత ఉత్సాహం ఎలా వచ్చిందంటే..
" ఇద్దరు కూతుళ్ళున్న తండ్రికి కొంచెం గర్వం ఉండాలి కదా - నాకూ ఉంది ...! వాళ్ళే నా ఉత్సాహం వాళ్ళే నా బలం" అంటాడు.
.
"నా ఇద్దరు కూతుర్లు. బాగా చదువుకున్నారు..!" 
"ఇద్దరూ స్థిరపడ్డారు...అదే నా ఉత్సా హానికి అసలైన కారణం..!"
"నాస్కూళ్లో కూడా అడపిల్లలకు మొదటి ప్రాధాన్యం... " అని ముగిస్తాడు...!!
.
కటక్ ఒకసారి రండి, మా స్కూలు పిల్లలను చూడాలి మీరు- అని ఫోన్లో పలకరించిన వారందరిని ఆహ్వానించడం ఆయనకు అలవాటు!
.
ఈయన  కటక్ లో వుండేవారు 
ఇప్పుడాయన లేరు 18 రోజుల క్రితం ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. 
కానీ ఆయన కార్యం మాత్రం ఆగలేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన కూతురు భానుప్రియ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన తల్లి విజయలక్ష్మీ గారితో కలిసి ఆయన ఆరంభించిన ఆ సేవా కార్యం కొనసాగిస్తున్నారు. 
వారిద్దరితో నేను ఇప్పుడే అంటే  8-20 PM కి మాట్లాడాను. - 28th Jan, 2021. వారి ఫోన్ నెంబర్ ఇది. +91 98612 35550 
ఆయన కార్యం ఆగిపోవడం ఇష్టం లేని వారు, ఈ కార్యంలో వారికి చేయూతగా నిలిచేవారు ఎవ్వరైనా వారితో మాట్లాడవచ్చు. వారి అశయానికి స్పూర్తిగా నిలబడవచ్చు. 
వారికేమైనా మీరు పంపిస్తే ఆ రసీదులను ఇక్కడ కామెంట్లలో పెడితే నేను చాలా చాలా చాలా సంతోషిస్తాను. ఆయన్ని మళ్ళీ బతికించినంతగా మనసారా ఆనందిస్తాను. 🙏🙏🙏 
- గౌతమ్ కశ్యప్ Dr Gautham Kashyap PhD., Hyderabad - 500045- 
ఆయన ఎక్కౌంట్ నెంబర్ ఇది.
Punjab National Bank account no. 
4911000100016184 
Asha Aswasana Slum School
Cuttack..
మీరు నెంబర్ ఆయన పేరు సరిచూసుకుని వారి భార్య విజయలక్ష్మిగారి తోనూ ఆయన కూతురు భానుప్రియ గారితోనూ మాట్లాడి అప్పుడు డబ్బులు పంపించాలనుకుంటే ఆయనకు అదే ఆయన ఆరంభించిన ఆ సత్కార్యానికి పంపించండి. మీకేమాత్రం వీలైనా ఆ రసీదులను ఇక్కడ కామెంట్లలో వుంచండి. నాకు నిజంగా ఏనుగెక్కినంత సంతోషం కలుగుతుంది 🙏🙏🙏🙏🙏 - గౌతమ్ కశ్యప్

Saturday, 16 January 2021

ఊపిరిలూదే వైధ్యుల ఉసురు తీసిన ప్రమాదం.. సంతాపం వ్యక్తం చేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్...

 ...
కర్నాటక దార్వడ ప్రాంతంలో బస్సు ను డీకోన్న టిప్పర్ అందులో ప్రయాణిస్తున్న పలువురు  డాక్షర్లు మృతి
17 doctors died on the spot ,3 vey crtical from JJMM college Davangere on the way to Goa
All ladies group , mostly from Gynae dept
This is the spot of accident of TT and a tipper in the morning outskirts of Dharwad in which thirteen were dead out of fifteen ladies travelling from davangere to Goa. All were from high end families. 
One was Dr Veena OBG professor in JJMMC and wife of a gastroenterologist dr Prakash Mattihalli, another was wife of a surgeon Dr Ravi Jagaloor, another was daughter in law of Mahima Patel son of former CM j h Patel, all other names are yet to be known. 

Friday, 15 January 2021

ఘనంగా అయ్యప్ప పార్వేట ఉత్సవం

శబరిమలై అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఆయ్యప్ప స్వామి పార్వేట ఉత్సవం(వేట)..ఉత్సాహంగా నిర్వహించారు. మకర విలక్కు రెండవరోజు..అయ్యప్ప మూర్తిని ఆవహింపజేసిన ప్రతిమ 18మేట్లు దిగివచ్ఛి వేట జరిపే తంతును ఆలయవర్గాలు అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు.. కాగడలు..డప్పుల మోత మధ్య సాగే ఈ కార్యక్రమంలో కత్తీ..డాలు..పట్టి కొందరు ముందుకు సాగుతారు.. వెనుక అయ్యప్ప ప్రతిమతో పాటు..మేల్ శాంతి.. సిబ్బంది.. రక్షక బటులతో ముందుకు సాగుతారు.. ఆలయ పరిసరాల్లో చుట్టిన ఈ వేడుక ఆనంతరం అయ్యప్ప 18మెట్లు ఎక్కి ఆలయ ప్రవేశంతో ముగుస్తుంది..

#Manikumar Kommamuru for internet Desk.#

Tuesday, 12 January 2021

మకరవిళక్కుకు సిద్దమైన శబరిమలై... మొదలైన తిరువభరణ యాత్ర...

శబరిగిరిపై 2021 సంవత్సరానికి మకరవిలక్కు సన్నాహాలు పూర్తయ్యాయి. .14 ఉదయం గణపతి హోమంతో కార్యక్రమానికి అంకురార్పణ చేయనుండగా..
రాత్రి 7.30 గంటలకు ఉషా పూజ. ఉదయం 8.14 గంటలకు . మకరసంక్రమణ పూజ నిర్యహించనున్నారు. 

 ట్రావెన్కోర్ ప్యాలెస్ నుండి ప్రతినిధులకు అప్పగించిన నేయెటంగా వద్ద నేయ కాళియుగారదా విగ్రహాన్ని అభిషేకం చేయడం ద్వారా మకరసంక్రమణ పూజ చేస్తారు. పూజ తరువాత తంత్ర కంధరర్ రాజీవరర్ భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. 
25 వ కలశాభిషేకం తరువాత మధ్యాహ్నం పూజ మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగుతుంది. 

నడక   మధ్యాహ్నం 1 గంటలకు మూసివేయబడుతుంది మరియు సాయంత్రం 5 గంటలకు నడక తెరవబడుతుంది. 
సాయంత్రం 5.15 గంటలకు దేవస్థానం ప్రతినిధులు ఆలయ మందిరంలో పూజించే దండలు ధరించి తిరువభరణ ఊరేగింపును ఆహ్వానం పలికేందుకు.. శారంగుత్తి దగ్గరకు వెళతారు. 
సాయంత్రం 5.30 గంటలకు శరణకుట్టిలో ఆహ్వాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6.20 గంటలకు సన్నీధనానికి తీసుకురాబోయే తిరువభరణ పల్లకి  ఉన్న ఫ్లాగ్‌పోల్ ముందు దేవదాయ  మంత్రి,, ఆలయ బోర్డు అధ్యక్షుడు, బోర్డు సభ్యులు  ఇతర విశిష్ట అతిథులు ఆచార ఆహ్వానం పలుకుతారు . ఆ తర్వాత మెట్ల వద్దకు చేరుకునే తిరువభరణాలకు  ఆలయం వద్ద తాంత్రి, మేల్శాంతి అందుకుంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మకరసంక్రమ, తిరువభరణంతో ప్రత్యేక   దీపరాధన జరుగుతుంది. దీపారాధన ముగింపులో, మకరవిలక్కు పొన్నంబలం వద్ద వెలిగిస్తారు ఆనంతరం మకర జ్యోతి ఆకాశంలో కనిపిస్తుంది. 
ఈ సమయంలో, సన్నీధనం, దాని పరిసరాలు శలణుఘోషతో  ఉంటాయి. అప్పుడు 18 వ దశకు అధిరోహణ ప్రారంభమవుతుంది.
 15, 16, 17 మరియు 18 తేదీలలో ఆరోహణ జరుగుతుంది.
శరంగుత్తికి ఆరోహణ 19 న జరుగుతుంది. సాయంత్రం 5.30 గంటలకు గణపతి హోమ. రాజ కుటుంబ దర్శనం తరువాత, తిరునాడ ఉదయం 6.30 గంటలకు హరివరసనం పాడతారు.
దీంతో మకరవిలక్కు పండుగ ముగియనుంది ...
......
 మకరవిలక్కు - ప్రత్యేక ఆరాధన సమాచారం
12-01-2021 మంగళవారం (1196 ME ధనుస్సు 28) సాయంత్రం ---- ప్రసాద శుద్ధి క్రియస్ ---
ఆచార్యవారణం, ప్రసాదసుద్ధి, గణపతి పూజ రక్షోఘ్నహోమం వాస్తుహోమం, వాస్తుకలసం, రాక్షకాలసం, వాస్తుబలి వాస్తుపున్యహం, అతాపూజ, అప్పుడు హరివారణ ....
• 13-01-2021 బుధవారం (1996 ME ధనుస్సు 29) ఉదయం ----- 
చిత్ర శుద్దీకరణ క్రియలు ......
గణపతి హోమ, బింబాసుద్ధి, కలసపూజలు, చతుర్సుద్ధి, ధారా, పంచగవ్యం, పంచకం, ఇరవై ఐదు కలసపూజాలు
విగ్రహ అభిషేకం ఉష పూజ తరువాత జరుగుతుంది.
మధ్యాహ్నం ఇరవై ఐదు అభిషేకం
ఈ నడక గురువారం 14-01-2021 (1996 ME మకరం 1) సాయంత్రం 5 గంటలకు తెరవబడుతుంది. దీని తరువాత ప్రక్షాళన మరియు సాధారణ అభిషేకం జరుగుతుంది. 8.14 గంటలకు మకరసంద్రమ పూజ ....
15.01.2021
నయాభిషేకం, కళాభాభిషేకం, పడిపూజ
16.01.2021
െയ నయభీషేకం, ఉదయస్థమాన పూజ, కళాభాభిషేకం, పడిపూజ
17.01.2021
െയ నయాభిషేకం, కళాభాభిషేకం, పడిపూజ
18.01.2021
నయాభిషేకం, కళాభాభిషేకం, పాడిపూజ
నయాభిషేకం 18.01.2021 వరకు మాత్రమే
• 19.01.201
పడిపూజ, మాలికప్పురం గురు
20.01.2021
సాయంత్రం 5 గంటలకు తిరువాడ ప్రారంభం
ఉదయం 6.30 గంటలకు తిరువాడ మూసివేయబడుతుంది.
@ Manikumar Kommamuru For internet Desk...
Information Courtesy by..#Sunil Arumanur, 
PRO - Sabarimala, Kerala#

Sunday, 10 January 2021

హిందూ ఆలయాలపై దాడి బాధాకరం : శృంగేరి జగద్గురు భారతితీర్థ

 

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా ఆలయాలపై జరుగుతున్న దాడులపై దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.  ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రాలైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా దాడులు జరుగుతుండడం తీవ్రమైన వేదనను కలిగిస్తోందని, ఇటువంటి దాడులు రాజ్యాంగవిరుద్ధమని, వీటివల్ల దేశ ప్రజల సామరస్యానికి భంగమేర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.

ఇలాంటి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇలాంటివి పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు.




స్వామివారి ప్రసంగం పూర్తిపాఠం:

శృంగేరి 09.01.2021

సనాతనహిందూధర్మము ఈ ప్రపంచములో అన్ని ధర్మములకంటెను అత్యంత ప్రాచీనమైనదను విషయము సర్వవిదితము. మనుష్యునకు ఇహపరలోకములలో శ్రేయోదాయకమయిన ఈ ధర్మమును స్వయముగా భగవంతుడే ప్రతియొక్క యుగమునందవతరించి ఉద్దరింతునని భగవద్గీతయందు శెలవిచ్చియున్నాడు. అట్టి ఈ ధర్మమునకు మూలములైన వేద శాస్త్రములలో సకలమానవుల శ్రేయస్సు కొరకు భగవదుపాసన చెప్పబడియున్నది. మన పవిత్ర భారతదేశంలో విలసిల్లుచున్న అనేక పుణ్యక్షేత్రములలో మరియు ప్రాచీన దేవాలయములలో అనేకరూపములలో అనేకనామములతో భగవదుపాసన అనాదికాలముగ విశేషముగా ఆచరింపబడుచున్నది. ప్రస్తుతము ఆంధ్రరాష్ట్రంలో ఆస్తిక మహాజనులందరకు శ్రద్దాకేంద్రములైన కొన్ని దేవాలయములపై గత కొన్ని నెలలుగా అవిరతముగా దాడులు జరుగుచుండుట వీటికి కారకులైన వారిని గుర్తించి వారికి కఠినమైన శిక్షను విధింపకుండుట మా మనస్సుకు అత్యంత దుఃఖమును కలిగించినవి. ఇది అత్యంత ఖండనీయమైన విషయము. భగవంతుని విషయమున జరిగిన ఇట్టి అక్షమ్యమైన అపరాధములు వాటినొనర్చినవారిని జన్మ జన్మలకు ఎెంటాడి అపరిమితమైన దుఃఖమును కలిగించును. దాడులు మహాపాపములే కాక రాజ్యాంగమునకు కూడా అత్యంత విరుద్ధములు. వీటవలన దేశ ప్రజల సామరస్యమునకు భంగమేర్పడుటయే కాక అనేకవిధములైన అనిష్టములను ఎదుర్కొనవలసిన దుస్థితి కూడా రాగలదు. ఇట్టి దుశ్చర్యలను ఆరంభదశలోనే నివారించి ఇవి పునరావృత్తము కాకుండుటకు కఠినమైన చర్యలను తీసుకొనవలసిన బాధ్యత ప్రభుత్వమునకున్నది. హిందూధర్మములో అనేక సంప్రదాయ భేదములు ఉన్నప్పటికీ అవి ధర్మసంరక్షణకు విఘాతకములు కాకూడదను విషయమును చక్కగా ఆకళింపు చేసికొని ఆస్తికులందరూ ఇట్టి సందర్భమున ఐకమత్యమును ప్రదర్శించి ధర్మమును కాపాడి భగవదనుగ్రహపాత్రులై కృతార్థులగుదురుగాకయని మేమాశించుచున్నాము.

Friday, 1 January 2021

తల్లిదండ్రులు కనిపించే దైవాలు': సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్,

 

*

‘’వృధ్ధశ్రమాలు అవసరంలేని సమాజం కోరుకుందాం అని సైబరాబాద్త సి.పి. సజ్జానర్ సూచించారు. నూతన సంవత్సరం 2021’’ సందర్భంగా కార్ఖానాలోని జనక్ పూరి కాలనీ ఏబీఎం ప్లాజా లోని ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్  వారి సతీమణి అనుప వీ సజ్జనార్, కుమార్తెలు అధితి, నియతి, సీపీ  తమ్ముడి పిల్లలు చిన్నారులు సమర్థ్, సమృధ్ తో కలిసి ఈ ఉదయం వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ తో కలిసి కేక్ కట చేసి, వారికి అల్పాహారం తినిపించి వారిలో ఆనందంని నింపారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సంతోషాన్ని పంచారు.



ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు.
*తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలన్నారు.* పిల్లలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనన్నారు. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే వారి ఆశీస్సులతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలమన్నారు.
వృద్ధుల ఆశ్రయం కోసం, వారి వైద్య సాయనికై ఇంత మంచి మెడికల్ హోమ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.. అదే సమయంలో వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజాన్ని నిర్మించాలన్నారు.
రానున్న రోజుల్లో వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు. ప్రతీఒక్కరూ దేశ భద్రత, సురక్షిత కోసం, అభివృద్ధి కోసం పునరంకితం కావాలన్నారు.
అనంతరం డాక్టర్ రామకృష్ణ ను సమాజం కోసం ఆయన చేస్తున్న సేవకు గాను సీపీ గారు అభినందించారు. తన వంతుగా వారికున్న పరిమితుల్లో డాక్టర్ రామకృష్ణ సమాజానికి సేవ చేస్తున్నారని.. ప్రతీ ఒక్కరూ సమాజానికి తమవంతుగా సేవ చేయాలన్నారు. సైబరాబాద్ పోలీసులు తరుపున  ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు ఏదైనా సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమన్నారు.
ఈ సందర్భంగా ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ పోలీస్ వృత్తిపరంగా నిత్యం బిజీ గా ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్ల కళ్లలో ఆనందాన్ని నింపేందుకు ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ కు కుటుంబ సమేతంగా విచ్చేసిన సీపీ సజ్జనార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని సీపీ గారు నూతన ఒరవడికి నాంది పలికారన్నారు.
సరైన సమయానికి సరైన  వైద్య సాయం అందక/ అందించలేక దురదృష్టవశాత్తూ తన తల్లి గారైన రాములమ్మ చనిపోయారన్నారు.. తనలా మరెవరికీ అలాంటి పరిస్థితి రావద్దని  సదుద్దేశంతో 12 సంవత్సరాల క్రితం ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ ను నెలకొల్పామన్నారు.
నూతన సంవత్సర వేడుకలకు  విచ్చేసి.. వయో వృద్ధులలో నూతనోత్సాహాని నింపిన సీపీ సజ్జనార్ గారి మరియు వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ రామకృష్ణ గారు మరియు సీనియర్ సిటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ కే ఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ మేనేజర్ నాగబూషణం, డాక్టర్ ఛత్రి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రమోద్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆనంద్,  కృష్ణ చౌదరీ, జోష్ వెబ్ సైట్ వాలంటీర్లు మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.