ఇప్పుడాయన లేరు కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.
నేను ఆయన భార్య విజయలక్ష్మిగారితోనూ వారి అమ్మాయి భానుప్రియగారితోనూ ఇందాకే అంటే 8-20 PM కి మాట్లాడాను.
ఆయన కార్యం ఆగిపోవడం ఇష్టం లేని వారు ఈ కార్యంలో వారికి చేయూతగా నిలిచేవారు వారెవ్వరైనా వారితో మాట్లాడవచ్చు. వారి అశయానికి స్పూర్తిగా నిలబడవచ్చు. - 28th Jan, 2021. - గౌతమ్ కశ్యప్ Dr Gautham Kashyap PhD.,
ఎందుకంటే నాకు తెలిసిన ఆ మామూలు ప్రకాశరావు లక్షల్లో ధనం వున్నవాడు కాదు కానీ కోట్లు పోసినా కొనలేని నిస్వార్థమైన హృదయం వున్నవాడు. అందుకే భారత ప్రభుత్వం తలవంచి ఆయనను పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించి తనను తాను గౌరవించుకుంది.
ఆయన చాలా చిన్నవాడు, జీవితంలో తళుకు బెళుకులు లేని వాడు. అవి తెలియని వాడు.
ఎపుడూ సంపాదన మీద దృష్టిపెట్టని వాడు.
ఉన్నదాంట్లో సగం, అది ఇల్లూ కావచ్చు, సంపాదన కావచ్చు,
ఎపుడూ పేద పిల్లలతో పంచుకునేవాడు...!
ఆయనే దేవరపల్లి ప్రకాశ్ రావు..
ఈయన వృత్తి ఒరిస్సాలోని కటక్ లో టీ బంకు నడుపుతూ ఉంటాడు. ఆయన కేవలం తమ టీ స్టాల్ తో విప్లవం తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ప్రకాశరావు చాలా కిందట ఒరిస్సా వెళ్లి, అక్కడ రకరకాల మార్గాల్లో బతుకు పోరాటం సాగించి సాగించీ చివరకు టీ బంకుతో సెటిల్ అయ్యారు.!
అయితే, తానుంటున్న బస్తీలో పేద పిల్లలకు స్కూల్ లేకపోవడంతో తన చిన్న ఇంట్లో నే స్కూల్ తెరిచారు. తన సంపాదనలో సగంతో పిల్లల మీద ఖర్చు పెట్టి చాలా పెద్ద వాడయ్యాడు. మనమెవ్వరం అందుకోలేనంత పెద్దవాడయ్యాడు. ఆంధ్ర ప్రదేశ్ దాకా ఆయన కీర్తి రాకపోయినా, ప్రపంచమంతా ఆయనకు నీరాజనాలు పట్టింది. ఆయనకు పద్మశ్రీ అవార్డ్ కూడా ప్రకటించింది.!
ఆయన కథ ఇది!
ఒడిషా రాష్ట్రంలోని కటక్ లో బక్సిబజార్ అని ఒక బస్తీ ఉంది.
అక్కడ ఉండేవాళ్లంతా కూలీనాలి చేసుకునే వాళ్లు, రిక్షా తోలేవాళ్లు, చిన్న చిన్న పనులు చేసి బతుకు వెళ్లదీస్తున్న వాళ్లు.
భారత దేశంలోని అన్ని బస్తీల లాగానే ఇది కూడా ఒక మురికి వాడ.
ఆ మధ్య హఠాత్తుగా ఈ బస్తీ వార్తలకెక్కింది.
జాతీయ, అంతర్జాతీయ విలేకరులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ఎన్జీవోల ప్రతినిధులు ఈ బస్తీ కొస్తున్నారు కనక ఆ బస్తీ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమ్రోగుతోంది.
తాజాగా ఈ మధ్య జిల్లాకలెక్టర్ కూడా వచ్చి వెళ్ళారు. దీనికంతటికీ కారణం, అక్కడున్న ఆ చిన్న చాయ్ దుకాణం, దాన్నినడిపే తెలుగు వాడైన ప్రకాశ్ రావు.!
ప్రకాశ్ రావుతో ఫోన్లో మాట్లాడండి, తెలుగులో బాగున్నారా అనడగండి..
అంతే ఆయన అనర్గళంగా తెలుగులో సంభాషణ మొదలుపెట్టి, మధ్య మధ్య ఒడియాలో కి దూకుతూ, ఇంగ్లీష్ లో అలవోకగా మాట్లాడుతూ, అపుడపుడు హిందీ వాడుతూ మిని ఇండియాలా ప్రత్యక్షమవుతాడు..!
ప్రకాశ్ రావు ఖాయిలాపడి, చచ్చిబతికినవాడు. అపరేషన్ జరుగుతున్నపుడు ఎవరో అనామకుడు చేసిన రక్తదానంతో బతికి బయటపడ్డాడు. ఆ అనామకుడే ఈ రోజు ‘ఇంత వాడు’ అయ్యాడు....!
ఇది జరిగి 40 సంవత్సరాలయింది.
అప్పటినుంచి చావుబతుకుల్లో ఉన్నవాళ్లకి రక్తదానం చేసితీరాలని కున్నాడు. రక్తమే కాదు, ఎంత సహాయం చేయాలో అంతా చేయాలనుకున్నాడు. చేస్తున్నాడు.
ఆయన రక్తదానం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది...!
అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్ లెట్స్ దానం చేశాడు...!
ఇపుడు, పేద రోగులకు అసుప్రతిలో వేడి నీళ్లిందిస్తాడు, పాలు, బ్రెడ్ అందిస్తాడు, వీలయితే, పళ్లు కూడా అందిస్తాడు. ఇది రోజూ జరిగే ప్రక్రియ.
ప్రకాశ్ రావు సేవ చూసి ఒక పెద్ద మనిషి ఆయన గీజర్ కొనిచ్చాడు, అధికారులు ఆసుప్రతిలో ఒక గది ఇచ్చారు. మరొకరెవర్ అంబులెన్స్ ఇచ్చారు..!
ఇంతకంటే మరొక ముఖ్యవిషయం ఉంది.
బస్తీలో పిల్లలెవరు చదువుకోవడం లేదని, చిల్లర తిరుగుళ్లకు అలవాటు పడి పాడైపోతున్నారని గమనించి, ఆ పరిస్థితి మార్చాలని కున్నాడు...!
అంతే, వెంటనే తన రెండుగదుల ఇంటిలో ఒక గదిని స్కూలుగా మార్చేశాడు. పిల్లలని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చి, పుస్తకాలు కొనిపించి చదువు చెప్పడం మొదలుపెట్టాడు.
"మొదట్లో వారి తల్లిదండ్రులు నన్ను తిట్టారు. మాపిల్లలు పాచిపనికి వెళ్లి నాలుగు రూకలు తెచ్చే వాళ్లు.
నువ్వు బడిపెట్టాక, వీళ్లు పని మానేస్తున్నారని దబాయించారు...!
వాళ్లని ఒప్పించేందుకు చాలా కష్టపడ్డాను. చివరకుభోజనం నేనే పెడతాను అనిచెప్పి వాళ్ల అంగీకారం పొందాను...!
ఇపుడు నా గది స్కూలయింది. 70 మంది విద్యార్థులు, అయిదుగురు టీచర్లున్నారు. టీచర్ కు రు. 1500 ఇస్తాను. అందరికి భోజనం ఉచితం, అని ఎషియానెట్కు ఫోన్లో వివరించాడు .
ఈ ఖర్చెవరిస్తున్నారు...!?
‘ఇదంతా నా సొంత డబ్బే. టీ స్టాల్ లో బన్ బిస్కట్ లతో పాటు వడలు కూడా ఉంటాయి. రోజూ అన్ని ఖర్చులు పోను రు. 600 దాకా మిగులుతుంది. అందులో స్కూల్ కోసం రు. 300 ఇస్తాను..!
నాకుటుంబానికైనా తగ్గిస్తాను, బడి ఖర్చు తగ్గించను. అది నా జీవిత ధ్యేయం. చిన్నపుడు డాక్టర్ కావాలని నాకు కల ఉండేది.
పేదరికం, అనారోగ్యం వల్ల సాధ్యం కాలేదు. అందువల్ల ఈ పిల్లలను చదివిస్తున్నాను. కొంత మంది మెట్రిక్ లేషన్ పాస్ అయ్యారు కూడా" అని స్కూల్ ప్రగతి గురించి వివరించాడు.
మధ్యాహ్నబోజనానికి రోజూ రు. 8 కావాలి, అయితే, అంత లేదు. అందువల్ల ఉన్నంతలో చేస్తున్నాను.
ఈ మధ్య కలెక్టర్ వచ్చి అభినందించారు. మధ్యహ్నం భోజనం పథకాన్ని మాస్కూల్ కు పొడిగించాలని కోరాను. అయితే, రూల్స్ ప్రకారం ప్రయివేటు స్కూళ్లకు పథకం వర్తించదని చెప్పారు. అయినా తాను నిరుత్సాహ పడటం లేదు అని అన్నాడు.
పొద్దున పూటంతా చాయ్ దుకాణం నడిపి, మధ్యాహ్నం టీచర్ అవతారం ఎత్తుతాడు ప్రకాశ రావు. ఈ మద్య లో ఒక రౌండ్ సైకిలేసుకుని ఆసుప్రతికి వెళ్లడం ఆయన రోజు వారి పని...!
ఇంతకీ ప్రకాశరావు ఎవరు?
ప్రకాశరావు ముత్తాత దేవర పల్లి అప్పాలస్వామి...!
1888 ప్రాంతంలో పిల్లా జెల్లా వేసుకుని నడుచుకుంటూ తూర్పు దేశ యాత్ర ప్రారంభించారు. చివరకు వాళ్లు ఒరిస్సా కటక్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో మకాం వేశారు. అదిపుడు "తెలంగపెంట"ఊరుగా మా రింది. తాత మంచి వంటగాడు కావడంతో బ్రిటిష్ వాళ్ల దగ్గిర కొలువుకు కుదిరాడు. బెంగాల్ అస్సాం తిరిగి చివరకు "తెలంగపెంట" ఊరికే వచ్చాడు..
తండ్రి కృష్ణ మూర్తి రెండో ప్రపంచ యుద్ధంలో సైన్యంలో బర్మాలో పనిచేసి తిరిగొచ్చాడు. కొద్ది రోజులు ఒక ప్రయివేటు కంపెనీలో అర్క్ వెల్డర్ గా పనిచేశాడు.
1960లో టీ స్టాల్ తెరిచాడు. అయితే, తండ్రి చనిపోవడం, తర్వాత టిబి వ్యాధి సోకడంతో ప్రకాశ్ రావు చదువు మానేసి టీస్టాల్ బాధ్యత తీసుకున్నాడు.
అంతర్జాతీయ అవార్డు :
బిసెంట్ సెల్ఫ్ లెస్ సర్వీస్ అవార్డు-2016కి ఆయన ఎంపిక అయ్యారు.
ఆయనకు గతంలో చాలా అవార్డులొచ్చాయి. ఇపుడాయన కీర్తి అంతర్జాతీయస్థాయికి చేరుకుంది..!
ఆయన వయస్సు 60 సంవత్సారాలు. అలసటలేదు, విశ్రాంతి లేదు. ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని ఉత్సాహంగా చెబుతాడు.
నీకింత ఉత్సాహం ఎలా వచ్చిందంటే..
" ఇద్దరు కూతుళ్ళున్న తండ్రికి కొంచెం గర్వం ఉండాలి కదా - నాకూ ఉంది ...! వాళ్ళే నా ఉత్సాహం వాళ్ళే నా బలం" అంటాడు.
.
"నా ఇద్దరు కూతుర్లు. బాగా చదువుకున్నారు..!"
"ఇద్దరూ స్థిరపడ్డారు...అదే నా ఉత్సా హానికి అసలైన కారణం..!"
"నాస్కూళ్లో కూడా అడపిల్లలకు మొదటి ప్రాధాన్యం... " అని ముగిస్తాడు...!!
.
కటక్ ఒకసారి రండి, మా స్కూలు పిల్లలను చూడాలి మీరు- అని ఫోన్లో పలకరించిన వారందరిని ఆహ్వానించడం ఆయనకు అలవాటు!
.
ఈయన కటక్ లో వుండేవారు
ఇప్పుడాయన లేరు 18 రోజుల క్రితం ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.
కానీ ఆయన కార్యం మాత్రం ఆగలేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన కూతురు భానుప్రియ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన తల్లి విజయలక్ష్మీ గారితో కలిసి ఆయన ఆరంభించిన ఆ సేవా కార్యం కొనసాగిస్తున్నారు.
వారిద్దరితో నేను ఇప్పుడే అంటే 8-20 PM కి మాట్లాడాను. - 28th Jan, 2021. వారి ఫోన్ నెంబర్ ఇది. +91 98612 35550
ఆయన కార్యం ఆగిపోవడం ఇష్టం లేని వారు, ఈ కార్యంలో వారికి చేయూతగా నిలిచేవారు ఎవ్వరైనా వారితో మాట్లాడవచ్చు. వారి అశయానికి స్పూర్తిగా నిలబడవచ్చు.
వారికేమైనా మీరు పంపిస్తే ఆ రసీదులను ఇక్కడ కామెంట్లలో పెడితే నేను చాలా చాలా చాలా సంతోషిస్తాను. ఆయన్ని మళ్ళీ బతికించినంతగా మనసారా ఆనందిస్తాను. 🙏🙏🙏
- గౌతమ్ కశ్యప్ Dr Gautham Kashyap PhD., Hyderabad - 500045-
ఆయన ఎక్కౌంట్ నెంబర్ ఇది.
Punjab National Bank account no.
4911000100016184
Asha Aswasana Slum School
Cuttack..
మీరు నెంబర్ ఆయన పేరు సరిచూసుకుని వారి భార్య విజయలక్ష్మిగారి తోనూ ఆయన కూతురు భానుప్రియ గారితోనూ మాట్లాడి అప్పుడు డబ్బులు పంపించాలనుకుంటే ఆయనకు అదే ఆయన ఆరంభించిన ఆ సత్కార్యానికి పంపించండి. మీకేమాత్రం వీలైనా ఆ రసీదులను ఇక్కడ కామెంట్లలో వుంచండి. నాకు నిజంగా ఏనుగెక్కినంత సంతోషం కలుగుతుంది 🙏🙏🙏🙏🙏 - గౌతమ్ కశ్యప్
No comments:
Post a Comment