Sunday, 21 December 2025

దేశానికి కావలసింది ఉచితాలా ఊరేగింపులు కాదు... ఇటువంటి సౌకర్యం...

భారతదేశానికి కావలసింది ఉచితాలా ఊరేగింపులు కాదు వృద్ధుల సౌకర్యార్థం ఇటువంటి ఆవాసాలు ..సేవలు..
ఈ రోజుల్లో ఆకాశాన్నంటుతున్న ఇంటి అద్దెలు చూసి మనం బెంబేలెత్తిపోతుంటాం. కానీ, మీరు కచ్చితంగా ఈ జర్మన్ గ్రామం గురించి తెలుసుకోవాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రశాంతమైన, పచ్చని తీగలతో నిండిన అందమైన ఇళ్లు ఏదో సినిమా సెట్టింగ్ అనుకుంటే పొరపాటే. ఇది జర్మనీలోని 'ఫుగ్గేరే' (Fuggerei). దీనికి ఒక చాలా ప్రత్యేకమైన, ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలోనే ఇప్పటికీ వాడుకలో ఉన్న అత్యంత పురాతనమైన సోషల్ హౌసింగ్ కాంప్లెక్స్.

ఇక్కడి అసలు విశేషం ఏమిటంటే, 1521 సంవత్సరం నుండి ఇక్కడ ఇంటి అద్దె ఒక్క రూపాయి కూడా పెరగలేదు. అవును, మీరు విన్నది నిజమే! గత 500 సంవత్సరాలుగా ఇక్కడ నివసించడానికి ఏడాది మొత్తానికి కేవలం $1 డాలర్ (ప్రస్తుత మన కరెన్సీలో సుమారు 83 రూపాయలు) మాత్రమే అద్దె వసూలు చేస్తున్నారు. ఈ ఫోటోలో ఫౌంటెన్ దగ్గర నిల్చున్న బామ్మగారు, బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్న వారు, కర్ర సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న తాతగారి ముఖాల్లో ఎంతటి ప్రశాంతత, నిశ్చింత ఉందో గమనించారా?
ఆర్థిక పరమైన చింతలు లేకుండా, ఒకరికొకరు తోడుగా ప్రశాంతమైన శేష జీవితాన్ని గడపడానికి ఈ గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణ. ధరలు విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో, మానవతా దృక్పథంతో పేదల కోసం, ముఖ్యంగా వృద్ధుల కోసం ఇలాంటి ఒక వ్యవస్థ కొన్ని శతాబ్దాలుగా విజయవంతంగా నడుస్తుండటం నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఇది కేవలం ఇళ్లు మాత్రమే కాదు, వారికి ఒక గొప్ప ఆసరా. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు ప్రపంచంలో ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో కదా!

ఈ చారిత్రక గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి.

Saturday, 6 December 2025

..సత్తుపల్లి వన్యప్రాణుల అక్రమ వేట కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్ : జిల్లా ఫారెస్ట్ అధికారి వెల్లడి


సత్తుపల్లి అర్బన్ పార్క్ పరిధిలో ఇటివలే జరిగిన వన్యప్రాణుల అక్రమ వేట కేసు నేపథ్యంలో ఈ కేసు పురోగతిపై. DFO కీలక వివరాలను వెల్లడించారు.
ఆపరేషన్ వివరాలు మరియు అరెస్టులు సుదీర్ఘ గాలింపు చర్యలు, నిరంతర నిఘా, ప్రత్యేక బృందాల సమన్వయంతో ఈ కేసులో ప్రధాన నిందితులైన మెచ్చ రాఘు, కుంజా భారత్‌లను అటవీశాఖ–జిల్లా టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేసిందని. 
ఖమ్మం జిల్లా అటవీ అధికారి శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్, IFS 
అన్నారు. ఖమ్మంలోని జిల్లా అటవీ కాంప్లెక్స్ నందు తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరెస్టు అనంతరం నిందితులను సత్తుపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని 16.12.2025 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు, నిందితులపై Telangana Forest Act, 1967, Wild Life (Protection) Act, 1972 మరియు Arms Act, 1959లలోని సంబంధిత నిబంధనల కింద కఠిన కేసులు నమోదు చేయబడ్డాయని DFO గారు పేర్కొన్నరు 
అడవి జంతువుల వేట, వన్యప్రాణుల హానీ, అక్రమ ఆయుధ వినియోగంపై శూన్య సహన విధానంతో కొనసాగుతున్నామని ఆయన వివరించారు. భవిష్యత్తు కార్యాచరణ ఇలాంటి అక్రమ వేట ఘటనలను నిరోధించడానికి జిల్లాలో పహారా వ్యవస్థను బలోపేతం చేయడం, రహస్య సమాచార సేకరణను విస్తరించడం, సున్నిత ప్రాంతాల్లో లక్ష్యిత ప్రత్యేక దాడులు నిర్వహించడం వంటి చర్యలను మరింత దృఢంగా అమలు చేయనున్నట్టు అటవీశాఖ ప్రకటించింది.
మీడియాకు ధన్యవాదాలు
“వన్యప్రాణి సంరక్షణ, అటవీ రక్షణ, ప్రజలలో అవగాహన పెంపు కోసం ఖమ్మం అటవీ విభాగం చేపడుతున్న చర్యలను సమాజానికి చేరివేయడంలో మీడియా భూమిక అత్యంత ముఖ్యమైనది. ఖచ్చితమైన సమాచారం, బాధ్యతాయుతమైన ప్రచారం ద్వారా మీరు అందిస్తున్న సహకారం అమూల్యం; ఈ మద్దతు ఇదే విధంగా కొనసాగాలని ఆశిస్తున్నాను” అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్, IFS గారు మీడియా సమావేశంలో తెలిపారు.

: *ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ లో  పరిస్థితులను సమీక్షించిన సైబరాబాద్ పోలీసులు*
ఇండిగో విమానాల రద్దు, అంతరాయులపై ప్రయాణికులలో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ బి.రాజేష్, అదనపు డీసీపీ కె.పూర్ణచందర్ రావు, ఏసీపీ వి.శ్రీకాంత్ గౌడ్, ఆర్జీఐఏ ఔట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ సంపతి కనకయ్య ఈరోజు (05.12.2025) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.
ఇండిగో విమానాల రద్దు, విమాన  కార్యకలాపాల్లో వచ్చిన అంతరాయాలపై అధికారులు ఇండిగో రీజినల్ మేనేజర్‌తో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. సమస్యను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరించే లా తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే సాధారణ సేవలు పునరుద్ధరించనున్నామని రీజినల్ మేనేజర్ డీసీపీకి వివరించారు.
అనంతరం డిసిపి సిబ్బందితో కలిసి ఇండిగో చెకిన్ కౌంటర్లు, డిపార్చర్ జోన్, బోర్డింగ్ గేట్లు, బస్ గేట్లను పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది నియామకాలను సమీక్షించి ప్రస్తుత పరిస్థితి పై ఆరా తీశారు.ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా, పీక్ అవర్స్‌లో, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జిఐఏ అవుట్ పోస్ట్ ఇన్ స్పెక్టర్ సంపతి కనకయ్య ను ఆదేశించారు.
సమస్య పరిష్కారమయ్యే వరకూ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డిసిపి తెలిపారు.

: *మహిళలు, చిన్నారుల రక్షణకై..*
*సదా మీ సేవలో..మీ సైబరాబాద్ పోలీస్*
మహిళలు చిన్నారుల భద్రతకు సైబరాబాద్  విమెన్ అండ్ చిల్డ్రన్  సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన పర్యవేక్షణలో  29.11.2025 నుంచి  05.12.2025 వరకు అనేక చర్యలు చేపట్టారు.యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 8  మంది సెక్స్ వర్కర్లు, 11 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. 4 పిటా కేసులు నమోదు చేశారు. ముగ్గురు బాధితులను పోలీసులు రక్షించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.షీ టీం బృందాలు ఈ వారం మొత్తం 152 డెకాయ్ ఆపరేషన్లు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన 51 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. మహిళల నుండి అందిన 15 ఫిర్యాదులను స్వీకరించారు.ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ / సీడిఇడబ్ల్యూ కేంద్రాలు భార్యాభర్తల వివాదాల పరిష్కారంలో  31 కుటుంబాలను తిరిగి కలిపి వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపారు.సైబరాబాద్ పరిధిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీం బృందాలు ఈ వారంలో  112 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.మహిళల హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100, నేరాలు 1930 వంటి సేవల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.

*19 arrests in cyber Crime: Cyberabad Police*
*Cybercrime Crackdown: 05 cases Detected, 19Arrests Across various States in the month of November26/11/2025 to December 02/12/2025by CybercrimePolice,
  *5th, December 2025.*
The Cybercrime Police, Cyberabad, successfully detected 05 cybercrime cases for the weekof November26/11/2025 to December 02/12/2025, leading to the arrest of 19 offenders across multiple States. The investigation revealed the pan-India spread of cybercriminal networks, with offenders from different states.

*Key Highlights:*
• Out of the 19 arrests, 9 were linked to Trading Fraud.

*Refunds:*
Cyber Crime PS, Cyberabad successfully processed and obtained93refund orders in39cases from Hon’ble Courtfor an amount of Rs.47,14,805 /- to be refunded to victims. 

*Important case of this week: Cyberabad Police Crack Trading Scam; ₹81.55 Lakhs Cheated from an IT employee— Two Accused Arrested

*Case Details: The complainant stated that he was added to a WhatsApp group through a shared link and was induced to download a fraudulent trading platform. After creating an account, he was misled by coordinated conversations in the group, where members posed as successful investors and repeatedly praised a self-proclaimed trading analyst to gain his confidence. Initial small investments reflected fake profits on the trading app, after which the administrators pushed him to invest in IPO subscriptions, upper-circuit trades, and block trades. They falsely claimed that funds were “temporarily frozen” and demanded further deposits to release them. Believing this, the victim continued to transfer money, even borrowing from friends and taking loans. He ultimately paid ₹81,55,000/- to various bank accounts and UPI IDs shared by the group. When he attempted to withdraw, he was told to pay an additional ₹35,00,000/- as service charges. The accused returned only ₹500/-, after which the victim realised the platform was forged and he had been cheated.

*Modus Operandi: Creation of a Fake Trading Platform Fraudsters developed a faketrading platform and a WhatsApp group posing as a legitimate trading community to lure the victim.Trust Building Through Group Manipulation. Coordinated members posted fabricated profits, positive reviews, and promoted a fake “trading analyst,” gradually convincing the victim of the platform’s authenticity.
• Induced High-Value Investments Using Fake IPO Schemes Victim was pushed into depositing large amounts for supposed IPO allocations and block trades, with claims that funds were “frozen” and required additional deposits for release.
• Withdrawal Blocked & Additional Charges Demanded
When the victim attempted to withdraw, fraudsters demanded an extra ₹35 lakhs as processing fees, after which communication became evasive, exposing the fraud.
*Arrests : Acting on credible intelligence, investigation team conducted operations in Maharastra, and apprehended the following 2 accused:
1. Swapnil Rajesh Ghasing
2. Tejas Rajesh Bankar

*Advisory to the Public:*
• Do not trust investment links, trading apps, or WhatsApp groups claiming guaranteed profits.
• Verify any trading platform only through official SEBI-registered brokers and authorised website.
• Never transfer money for IPOs, “frozen funds,” or processing charges demanded by online groups.
• Avoid sharing bank details, passwords, or OTPs with unknown persons or Telegram/WhatsApp admins.
• If cheated or suspicious, immediately call the National Cyber Crime Helpline 1930 and report to the Cyber Crime Police.

@ Mani kumar Kommamuru  
📱 9032075966

Saturday, 29 November 2025

డెంటల్ డాక్టర్ పై సైబర్ వాళ్ళ 14 కోట్లు హాంఫట్


హైదరాబాద్‌: హబ్సిగూడలో డెంటల్‌ డాక్టర్‌  సైబర్ మోసగాళ్ల చేతుల్లో రూ.14 కోట్లు  రూపాయలు కోల్పోయారు.. ఫేస్‌బుక్‌లో మౌనిక పేరుతో మెసేంజర్‌కి రియాక్ట్‌ అయిన డాక్టర్.. తాను కష్టాల్లో ఉన్నానని ఆదుకోవాలని రిక్వెస్ట్ పెట్టిన మౌనిక..మాయమాటలతో డాక్టర్‌ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన మౌనిక.. క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్‌ అకౌంట్‌ ఓపన్‌ చేయించి.. 
లావాదేవీలు నిర్వహించి లాభాలు చూపెట్టిన మౌనిక.. 
డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్‌ చెల్లించాలని నమ్మించి మోసం చేసినట్లు డాక్టర్ ఆవేదన.
***********************************************
*ఇంటర్ స్టేట్ ట్రేడింగ్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్మ్యూల్ అకౌంట్ & సిమ్ సప్లై రాకెట్‌లో గుట్టురట్టు....* *ఆరుగురు నిందితుల అరెస్ట్...*
మెట్రో న్యూస్ క్రైమ్ ప్రతినిధి, సైబరాబాద్:
సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు, బహిరంగంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు సహకరిస్తున్న, బ్యాంక్ అకౌంట్లు, చెక్ బుక్స్ మరియు సిమ్ కార్డులు సరఫరా చేసే ఒక వ్యవస్థీకృత సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌లో భాగమైన ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్ పలు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించారు.
ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (BNS) Sections 318(4), 319(2), 336(3), 338, 340(2) r/w Section 3(5) అలాగే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66-D కింద రిజిస్టర్ చేయబడింది.మోడస్ ఆపరెండీ (నేర పద్ధతి)అప్పగించబడిన బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులను నేరస్థులు ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లను నడపడానికి ఉపయోగించారు. బాధితులకు నకిలీ లాభాల స్క్రీన్‌షాట్లు, డ్యాష్‌బోర్డ్‌లు చూపించి, భారీ మొత్తాలు మ్యూల్ అకౌంట్లలో జమ చేయించారు. ఈ అకౌంట్ల ద్వారా భారీ మొత్తాల మనీ ట్రాఫికింగ్ జరిపి, కమీషన్ ద్వారా లాభాలు పొందారు.
అరెస్ట్ అయిన వ్యక్తులు..వెనిగల్ల శ్రీనివాసరావు, 52 ఏళ్లు, NTR జిల్లా, చిట్ట గణేష్, 45 ఏళ్లు, పశ్చిమ గోదావరి జిల్లా, గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి, 33 ఏళ్లు, అనంతపురం జిల్లా, సత్తూరి రాజేష్, 41 ఏళ్లు, మెడ్చల్ జిల్లా మడ్డిరల్ల సుధీర్, 50 ఏళ్లు, కృష్ణా జిల్లా
మొహమ్మద్ అష్రఫ్, 39 ఏళ్లు, హైదరాబాద్ 
 వివరాలు
వెనిగల్ల శ్రీనివాసరావు, చిట్ట గణేష్ – బ్యాంక్ అకౌంట్లు మరియు సిమ్ కార్డులు సేకరించేవారు.
గండ్లూరు నవీన్ కుమార్ రెడ్డి – అకౌంట్ హోల్డర్లను గుర్తించి, డాక్యుమెంటేషన్ నిర్వహించేవారు.
సీజ్ చేసిన మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణలో 60 చెక్ లీఫ్ ఇమేజ్‌లు, దేశవ్యాప్తంగా 400 సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి.
బాధితుల ఆర్థిక నష్టం: ₹1,09,50,000/-
సీజ్ చేసిన వస్తువులు..
7 మొబైల్ ఫోన్లు
3 చెక్ బుక్స్
11 సిమ్ కార్డులు
దర్యాప్తు స్థితి..
అరెస్ట్ చేసిన ఆరుగురిని పోలీస్ కస్టడీకి తీసుకుని, కేసు తదుపరి దర్యాప్తు సాగుతోంది. ఇంకా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనులు కొనసాగుతున్నాయి.
కేసును ఇన్‌స్పెక్టర్ జి. విజయ్ కుమార్,ఇన్‌స్పెక్టర్లు దుర్గ, డి. పళవెల్లి, సందీప్,సీసీపీ ఎస్ సిబ్బంది..
ఏసీపీ (సైబర్ క్రైమ్స్) ఎ. రవీంద్ర రెడ్డి డి.ఎస్.పి పర్యవేక్షణలో,
 డి.సి.పి (సైబర్ క్రైమ్స్) వై.వి.ఎస్. సుదీందర్  పర్యవేక్షణలో చేస్తున్నారు..
********************************************** *ట్రాఫిక్ చలానాలపై హైకోర్టు సీరియస్.. ఆ హక్కు మీకు లేదంటూ..*
**********************************************
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించే విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చలాన్ల అమలులో పారదర్శకత లేదంటూ వి.రాఘవేంద్ర చారి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.పిటిషనర్ రాఘవేంద్ర చారి, ట్రాఫిక్ పోలీసుల అమలు పద్ధతుల చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ పిటిషన్‌లో ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు తమకు కేటాయించిన అధికారిక పరికరాలకు బదులుగా.. సొంత మొబైల్ ఫోన్లతో వాహనాల ఫోటోలు తీసి చలాన్లు జారీ చేస్తున్నారు. తనపై కూడా ఇలాగే మూడు చలాన్లు విధించారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. వ్యక్తిగత మొబైల్ ఫోన్లు లేదా ధృవీకరించబడని పరికరాల ద్వారా తీసిన ఫోటోలు చట్టపరమైన సాక్ష్యంగా చెల్లవని, ప్రభుత్వం ఆమోదించిన నిఘా కెమెరాల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డు చేయాలని పిటిషనర్ వాదించారు.చట్టబద్ధత లేని పద్ధతిలో చలాన్లు వేయడం వల్ల వాహనదారుల హక్కులు దెబ్బతింటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చట్టవిరుద్ధంగా జరిమానా మొత్తాలను నిర్ణయించడం.. న్యాయ పర్యవేక్షణ లేకుండా డబ్బు వసూలు చేయడంపై కూడా పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. శిక్షను నిర్ణయించే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు మాత్రమే ఉంటుందని.. క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లు లేదా ఇన్‌స్పెక్టర్లకు ఆ హక్కు ఉండదని పిటిషనర్ స్పష్టం చేశారు. ఈ రిట్ పిటిషన్ 2011 నాటి ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) నెం. 108ని కూడా సవాలు చేసింది. ఈ జీవో పోలీసులకు వాహనాలను ఆపి, కాంపౌండ్ జరిమానాలు అక్కడికక్కడే వసూలు చేయడానికి అధికారం ఇస్తుంది.
అయితే ఈ జీవో 108 చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం , ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేది అని పిటిషనర్ ఆరోపించారు. ఇది న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను పోలీసులు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తుందని ఆయన ఆరోపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్, పోలీసులు దశాబ్దాలుగా చట్టాలను ఉల్లంఘిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హోం శాఖ తరపున ఏజీపీ లక్ష్మీకాంత్ హాజరుకాగా.. జస్టిస్ మాధవి దేవి ప్రాథమిక వాదనలు విన్న తర్వాత.. చలాన్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక దాఖలు చేయడానికి రాష్ట్ర హోం శాఖకు నాలుగు వారాల సమయం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం జరిగిన విచారణలోనూ హైకోర్టు ట్రాఫిక్ అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించిన తర్వాత.. వాటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలు ప్రకటించడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయితీలు ఇవ్వడం వలన చట్టపరమైన పరిణామాలపై ప్రజల్లోని భయం బలహీనపడి, మరింత ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతుందని హైకోర్టు పేర్కొంది.
***********************************************
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ నిజాంపేట్ రోడ్డు బ్రాంచ్ వారు నిర్వహించిన "ఫిట్ ఇండియా మూవ్మెంట్" 2K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, స్కూల్ ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి,  కిందికుంట పార్క్ వరకు జరిగిన 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ, స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే 2K రన్ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే మంచి కార్యక్రమం. ఈ కార్యక్ర లో లోమం ద్వారా విద్యార్థులు వ్యాయామానికి అలవాటు పడతారు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి ప్రేరణ పొందుతారు. అలాగే, క్రమం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేయడం వంటి విలువలు నేర్చుకుంటారు. పాఠశాలలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించి, శారీరక–మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అలానే ఇలాంటి మంచి కార్యక్రమం పాఠశాలల్లో పిల్లల్లు తల్లిదండ్రుల సమక్షంలో చేసిన శ్రీ చైతన్య స్కూల్ సిబ్బంది వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ AGM శివరామకృష్ణ, RI పద్మజా, RI శ్రీనివాస రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మురళి కృష్ణ, ప్రిన్సిపల్ సిందూష, డీన్ సునీల్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
 *తిరుమలలో రికార్డు స్థాయిలో నమోదు*
------------------------------------------------------------------
వైకుంఠ ద్వార దర్శనం – eDIP
eDIP వ్యవస్థలో ఇప్పటివరకు 6 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మొత్తం 15.50 లక్షల సభ్యులు (1+3) చేరుకున్నారు.
TTD ఈ ఐదు రోజుల వ్యవధిలో 60–70 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
1.76 లక్షల స్లోటెడ్ టోకెన్లు మూడు రోజుల పాటు ఎంపికైన భక్తులకు జారీ చేయబడతాయి.
ప్లాట్‌ఫారమ్‌ వారీగా రిజిస్ట్రేషన్లు 📱💻
👉 మొబైల్ యాప్: 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు (8.51 లక్షల సభ్యులు)
👉 వెబ్‌సైట్: 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు (5.75 లక్షల సభ్యులు)
👉 వాట్సాప్: 39 వేల రిజిస్ట్రేషన్లు (98 వేల సభ్యులు)
e-DIP రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

------------------------------------------------------------------
*24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు.... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు* 
**220 కోట్లతో త్రాగునీటి పనులు*
**నగరాన్ని ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి*
**ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల*
------------------------------------------------------------------
ఖమ్మం :ఖమ్మం నగరంలో 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రివర్యులు, శనివారం ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు నాలుగు కాలాల పాటు స్థిరంగా ఉండే విధంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు.కార్పొరేటర్లు, ప్రజలు మున్సిపల్ కమీషనర్ కు సహకరిస్తూ పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని అన్నారు.   అమృత్ పథకం క్రింద ఖమ్మం మున్సిపాలిటీకి 220 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు కూర్చొని చేపట్టాల్సిన పనుల యొక్క డిపిఆర్ తయారు చేయాలని అన్నారు. డిసెంబర్ నెలలో అమృత్ పనులకు టెండర్ పిలిచి రాబోయే వేసవి కాలం నాటికి పనులు పూర్తి చేయాలని, నగర వ్యాప్తంగా 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో డ్రైయిన్ నిర్మాణం కోసం మరో 200 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. ఖమ్మం ఖిల్లాకు రోప్ వే సౌకర్యం కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని, లకారం ప్రక్కన శిల్పారామం నిర్మిస్తున్నామని, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చర్యలు చేపట్టామని అన్నారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------
*భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*భక్త రామదాసు కళా క్షేత్రాన్ని సందర్శించి, చేపట్టవలసిన ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం‌ : ఖమ్మం నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 
శనివారం భక్త రామదాసు కళాక్షేత్రాన్ని మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. కళాక్షేత్రం మొత్తం కలియతిరుగుతూ చేయవలసిన పనులను పరిశీలించారు. కళా క్షేత్రంలో చేపట్టవలసిన ఆధునీకరణ పనులపై టాప్ ప్రూఫ్ లీకేజీ, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్, పార్కింగ్, కలర్ వాష్, పరిసరాలలో పచ్చదనం కోసం మొక్కల పెంపు, నిర్వాహణ, మరమ్మత్తు పనులపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* కళలకు, కళాకారులకు పుట్టినిల్లయిన ఖమ్మం జిల్లాలో ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరించి, మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం ఆకర్షణీయంగా తయారు చేయడం, సౌండ్, ఆడియో వ్యవస్థను మెరుగు పర్చడం, పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటుకు చర్యలు, గోడలకు సంప్రదాయక వాల్ పెయిటింగ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, టాప్ ప్రూఫ్ వాటర్ లీకేజీ, కళాక్షేత్రం బయట పరిసరాల్లో గ్రీనరికి చర్యలు, పూర్తి స్థాయి మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం, కళాక్షేత్రంలో ఏసి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, వెనుక ఉన్న ప్రేక్షకులకు డయాస్ స్పష్టంగా కనిపించేలా రూపొందిచాలని అన్నారు. కళాక్షేత్రం సౌండ్ ప్రూఫ్, లోపల ఆడియో మైక్ వ్యవస్థ పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు. ముందు సీట్లలో కూర్చునే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేజీ ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు.ఇంజనీరింగ్ అధికారులు తయారుచేసిన మోడల్ డిజైన్ మ్యాప్ లు, ఆర్కిటెక్చర్ రూపొందించి నమూనా వీడియోను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ దీక్షా రైనా, పంచాయతీరాజ్ ఇఇ మహేష్ బాబు, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమీషనర్ అనిల్, ఖమ్మం అర్బన్ తహసీల్దారు సైదులు,  మునిసిపల్ డిఇ ధరణి కుమార్, ట్లౌన్ ఫ్లానింగ్ అధికారి సంతోష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
*కటుదిట్టమైన ఏర్పాట్లతో గ్రామ పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ... సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు*
ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించండి : 
ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ
ఖమ్మం : ఎన్నికల నిబంధనల ప్రకారం అప్రమత్తంగా ఉంటూ విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు అన్నారు.
శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతి ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిశీలించారు. చిమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోటపాడు, చిమ్మపూడి, కోయచెలక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రేగులచెలక, కోయచెలక, శివాయిగూడెం  గ్రామాల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేశారు. అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ ప్రతాలను పరిశీలించారు. ఎన్నికల విధులు, బాధ్యతల పట్ల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా *సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామ రావు మాట్లాడుతూ* ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన ఘట్టమని, నామినేషన్ పత్రాలలో ప్రతి అంశం సరిగా ఉన్నాయో, లేవో జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చూడాలని తెలిపారు. *జిల్లా కలెక్టర్  అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వో ల వద్ద పొందవచ్చని తెలిపారు. వార్డు సభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రపోజర్ గా ఉండాలని అన్నారు. సర్పంచ్ గా పోటీచేసే అభ్యర్థి డిపాజిట్ క్రింద  కేటగిరి వారిగా  చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే ఆర్డీవోను సంప్రదించాలని సూచించారు.నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు సంబంధించిన కర పత్రాలు, గోడపత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల అధికారులను సంప్రదించాలని తెలిపారు. గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు అవగాహకు హెల్ప్ డెన్స్ లో నివృత్తి చేసుకోవచ్చని,  ప్రతి చిన్న అంశాన్ని, అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ వెంట రఘునాథపాలెం మండల తహసీల్దారు శ్వేత, లింగనాయక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
Another Indian Air Force IL-76 aircraft lands in Colombo with:
➡️9 Tons Relief Material 
➡️2 Urban Search & Rescue Teams comprising 80 National Disaster Response Force Personnel
A total of around 27 tons of relief material delivered by air and sea. More is on the way!

Wednesday, 26 November 2025

పది రూపాయల బిక్ష... 10 లక్షలు దానం చేసిన రజినీకాంత్...

సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఒక భిక్షగాడిగా భావించి ఆయనకు పది రూపాయలు భిక్ష వేసిన ఒక మహిళకు సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.   ప్రముఖ వైద్యురాలు గాయత్రీ శ్రీకాంత్ గారు రజనీ కాంత్ పై రాసిన పుస్తకంలో  ఈ విషయం వెలుగు చూసింది.  రజనీ కాంత్ హీరోగా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత బెంగుళూరులోని ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించడానికి వెళ్లారట , దర్శనం తర్వాత ఆయన ఆ గుడిలోని ఒక స్థంబం వద్ద కూర్చున్నారట.   రజనీ తన సాధారణ గెటప్ లో పంచె , చెరిగిన జుట్టు , మాసిన గెడ్డంతో అక్కడ కూర్చున్నారు.
అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ , ఆయనను భిక్షగాడు అనుకొని రజనీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు దానం చేసింది.   ఈ సంఘటనకు రజనీ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారట. అది చూసిన కొంతమంది పరిగెత్తుకొని వచ్చి,   “ ఆయనను ఎవరనుకుంటాన్నావ్........? అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలుపెట్టారట. దానితో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ , రజనీని పట్టుకొని క్షమించమని ఏడ్చిందట.  దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ,  ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని చెబుతూ ,  తాను సూపర్ స్టార్ ను కాను ,కేవలం సామాన్యుడినే అని  ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని ఆమెను ఓదార్చి ,  ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి  ఒక అనాథ శరణాలయానికి ఇచ్చాడట మన సూపర్ స్టార్.  హ్యాట్సాఫ్ టు రజనీ కాంత్.
సేకరణ: సోషల్ మీడియా.

Thursday, 20 November 2025

దర్యాప్తులో సిపిఎం జోక్యం ఉండబోదు. పద్మ కుమార్ అరెస్టుపై కేరళ సిపిఎం స్పందన..

శబరిమలైలో  బంగారం ఛోరిలో దర్యాప్తులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది శబరిమలై అయ్యప్ప ఆలయం.. ట్రావన్కూర్ దేవస్థానం బోర్డు  మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేయడంతో శబరిమల బంగారు దొంగతనం కేసు కీలక మలుపు తిరిగింది.- ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ అరెస్టుతో శబరిమల బంగారు దొంగతనం కేసు మలుపు తిరిగింది.- శబరిమల ఆలయం నుండి బంగారం  మాయం అయినా కేసులో దర్యాప్తు బృందం (SIT)  దర్యాప్తులో భాగంగా  ఈ అరెస్టు జరిగింది.
- దొంగతనం దరిమిలా ఉన్న సంఘటనలను బెరిజు వేసుకున్న సీటు SIT పద్మకుమార్‌ను ప్రశ్నించిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఆలయ భద్రత విశ్వాసంపై దాని ప్రభావం కారణంగా 
ఈ కేసు గణనీయమైన ప్రజా దృష్టిని ఆకర్షించింది.
 #శబరిమల #గోల్డ్‌థెఫ్ట్ కేసు దర్యాప్తులో పార్టీ జోక్యం చేసుకోదని #CPM రాష్ట్ర కార్యదర్శి M.V గోవిందన్ అన్నారు.దర్యాప్తు బృందానికి ఎవరినైనా ప్రశ్నించడానికి లేదా అరెస్టు చేయడానికి పూర్తి అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. అరెస్టు అంటే నేరం అని అర్థం కాదని, దీనిని కోర్టు మాత్రమే నిర్ణయించగలదని నొక్కి చెప్పారు.సీపీఎం పతనంతిట్ట జిల్లా కార్యదర్శి రాజు అబ్రహం కూడా ఇదే విషయం వెల్లడించారు.సీపీఎం సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పద్మకుమార్ జిల్లా కమిటీ సభ్యుడు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆయన అరెస్టు పార్టీలో ఆందోళనను సృష్టించింది.
మణికుమార్ కొమ్మమూరు, మోబైల్: 9032075966.

Monday, 17 November 2025

మక్కా యాత్రికుల బస్సుకు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి...

మక్కా యత్రకు వెళ్లిన హైదరాబాద్ యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. దాదాపు 42 మంది ప్రయాణికులు మృతి చెందినట్లుగా పేర్కొంటున్నారు.. ముఖ్యంగా అందులో 11 మంది మహిళలు 10 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం.
                                     --------
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని వస్తున్న ప్రాథమిక సమాచారంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి  పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించారు. ఈ దుర్ఘటనపై విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని, తక్షణం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు వెంటనే ఢిల్లీలో ఉన్న కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్తో  మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ కుటుంబీకులు, బంధువులకు సమాచారం కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
+91 79979 59754
+91 99129 19545

Saudi Arabia Bus Accident
Control Room Numbers:
📞 +91 79979 59754
📞 +91 99129 19545
-------------
Chief Minister A. Revanth Reddy has expressed deep shock over the tragic bus accident in Saudi Arabia involving Indian pilgrims. Initial reports indicate that the accident occurred while the passengers, including residents of Hyderabad, were travelling from Mecca to Medina.The Chief Minister immediately directed the Chief Secretary and the DGP to obtain full details of the incident. He also instructed officials to coordinate with the Ministry of External Affairs and the Saudi Embassy to ensure prompt relief measures for the affected.Chief Secretary K. Ramakrishna Rao contacted Coordination Secretary Gaurav Uppal in Delhi and provided necessary guidance to facilitate immediate assistance. A control room has been established at the Telangana Secretariat to keep the families and relatives informed and to monitor ongoing relief efforts.
A spiritual journey turned into a nightmare early Monday when a bus carrying Indian Umrah pilgrims from Mecca to Madinah collided with a diesel tanker. The crash, followed by a massive fire, has left at least 42 people feared dead. Initial reports indicate that many passengers on the bus were women and children from Hyderabad. Unofficial information suggests 11 women and 10 children may be among the dead, though officials are still verifying exact numbers.

Sunday, 16 November 2025

మీడియాకు స్వచ్ఛంద ప్రెస్ కౌన్సిల్ వుండాలి : సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్

మీడియా స్వేచ్ఛ తోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు అత్యంతఆవశ్యకమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి  సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ, సమాజంలో మీడియా పేరుతో జరుగుతున్న దుష్టప్రయోగాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసారు. వర్కింగ్ జర్నలిస్టులు, 
వార్తా పత్రికలు, చట్టాలు ఏలా రూపొందించాలో ఆనాటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ సూచనల మేరకు దేశంలో మొదటి ప్రెస్ కమీషన్ తోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1966 నవంబర్ 16న ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సి ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) నిర్వహించుకోవడం ఆనావాయితిగా వస్తుందన్నారు. అందులో భాగంగా నేడు మనం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆందరం ఒకే వేదికపె కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా అందరికి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.కొన్ని పత్రికలు, ఛానాల్స్ యాజమాన్యాలు మీడియా చట్టాలు, నైతిక నియామావళిని పాటించకపోవడం వలన, తప్పుడు వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల మీడియా మొత్తాన్ని దూషిస్తున్నారు. దీనిని అరికట్టాలంటే మీడియా సంస్థలు, సంఘాలు అన్ని ఒక తాటిపై వచ్చి మనపై ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.అదే విధంగా సోషల్ మీడియా నియంత్రణకు చట్ట పరంగా సరియైన మార్గదర్శకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని ఆయన కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం తరుపున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియా కౌన్సిల్ ఇండియా మార్చే విధంగా అన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, మీడియా అకాడమి కృషి చేయాలన్నారు. గత రెండేళ్లుగా భారత ప్రెస్ కౌన్సిల్ కు పాలక వర్గాన్ని నియమించలేదని,  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీని ద్వారా పత్రికా స్వెచ్ఛ, నైతికత, జవాబుదారితనం, బాధ్యతలు మొదలగునవి పర్యవేక్షిస్తూ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తప్పు చేస్తే మీడియాపై చర్యలు తీసుకునే అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మారుతి సాగర్, మాజీద్, బసవ పున్నయ్య, రమణారావు, రంగసాయి, యూసుఫ్ బాబు, రమణ కుమార్,  సువర్ణ, తదితరులు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి తమ సూచనలు, సలహాలు అందజేశారు.ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ అధ్యక్షత వహించగా, జాయింట్ డైరెక్టర్ కే. వెంకట రమణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, అధికారులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.