అక్కడ రజనీని చూసిన ఒక గుజరాతీ మహిళ , ఆయనను భిక్షగాడు అనుకొని రజనీ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు దానం చేసింది. ఈ సంఘటనకు రజనీ ఏమీ మాట్లాడకుండా ఆమెను చూసి చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారట. అది చూసిన కొంతమంది పరిగెత్తుకొని వచ్చి, “ ఆయనను ఎవరనుకుంటాన్నావ్........? అంటూ ఆ గుజరాతీ మహిళను తిట్టడం మొదలుపెట్టారట. దానితో బెదిరిపోయిన ఆ గుజరాతీ మహిళ , రజనీని పట్టుకొని క్షమించమని ఏడ్చిందట. దానికి రజనీ ఆమెను ఓదారుస్తూ, ఇది దేవుడు తనకు ప్రసాదించిన అసలు రూపమని చెబుతూ , తాను సూపర్ స్టార్ ను కాను ,కేవలం సామాన్యుడినే అని ఆ దేవుడు ఆమె చేత చెప్పించాడని ఆమెను ఓదార్చి , ఆమె ఇచ్చిన 10 రూపాయలకు తోడుగా మరో 10 లక్షల రూపాయలను కలిపి ఒక అనాథ శరణాలయానికి ఇచ్చాడట మన సూపర్ స్టార్. హ్యాట్సాఫ్ టు రజనీ కాంత్.
సేకరణ: సోషల్ మీడియా.
No comments:
Post a Comment