Friday, 19 June 2020

గుడిగంటలు...స్వామి నామమే భక్తుల చేవిలో మారుమ్రోగాలి.. నో హరన్ జోన్ గా తిరుమల...

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఓంకారం, గుడిగంటలు తప్ప రణ- గొణ ధ్వనులకు అవకాశం లేకుండా చూడాలి.
తిరుమల నో- హారన్ జోన్ గా పరిధి చెందాలి, అందుకు అందరి సహకారం కావాలి
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఎ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్...
ఈ రోజు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి  ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్  పవిత్రమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి నామస్మరణం వినబడాలనే ఉద్దేశ్యంతో శ్రీవారి భక్తులు ఆ దేవదేవుడిపై లీనమై ఉంటారు. కావున వాహనాల యొక్క రణ-గణ ధ్వనులకు ఆస్కారం లేదు. తిరుమల క్షేత్రం మొత్తం నో-హారన్ జోన్ గా ప్రకటన చేశారు.
      ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఓంకారం, గుడిగంటల మోతలు తప్ప రణ-గణ ధ్వనులకు అవకాశం లేకుండా చూడాలన్నారు. శ్రీవారి ఆకాంక్షతో కలియుగ వైకుంఠం తిరుమలను నో-హారన్ జోన్ గా చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. తిరుమల ప్రాధాన్యత, పవిత్రత, కలియుగాన ఈ క్షేత్రానికి ఉన్న ఎనలేని విశిష్ట దృష్ట్యా ఈ ప్రాంతం మొత్తం నో-హారన్ జోన్ కావల్సిన ఆవశ్యకత ఉందని, అయితే ఇది అపరాదంతోనో, కఠినమైన నిబంధనలతోనో‌ కాకుండా అవగాహనతో మార్చాలి. "నో-హారన్ జోన్ విత్ నో ఫైన్స్ " ను సాకారం చేయాలని, భక్తులు, ఉద్యోగులు, స్థానికులు, వాహనదారులు ఇందుకు సహకరించాలని, ప్రపంచంలో ఎన్నో చోట్ల తిరిగోచ్చినా ఈ అనుభూతి ఎక్కడా లేదు, ఉండదు కూడా ఈ ప్రశాంత వాతావరణం మరెక్కడా కనబడదు. అందుకే ప్రశాంతతకు మారుపేరైన కలియుగ తిరుమల గిరుల్లో రణ-గణ ధ్వనులు శబ్దకాలుష్యాన్ని తెచ్చి పెట్టి భక్తిపారవశ్యానికి విఘాతం కలిగిస్తాయని నా అభిప్రాయం. అందుకు అందరు సహకారము అందిస్తే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయవచ్చునని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలిపారు. అనంతరం వాహన దారులకు శబ్ద కాలుష్యంపై అవగాహన కల్పించారు.   
          ఈ సందర్భంగా అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి సుప్రజ మేడం గారు, తిరుమల అడిషనల్ యస్.పి శ్రీ మునిరామయ్య గారు, యస్.బి డి.యస్.పి గంగయ్య, తిరుమల డి.యస్.పి ప్రభాకర్ రావు, తిరుమల ట్రాఫిక్ డి.యస్.పి రమణ కుమార్, I టౌన్ సి.ఐ జగన్మోహన్ రెడ్డి, II సి.ఐ చంద్రశేఖర్ వారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment