Friday, 14 July 2023

జాగే తవజయ గాధ...చంద్రయాన్ - 3 తొలిదశ విజయవంతం


చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 తొలిదశ విజయవంతమైంది. బాహుబలి రాకెట్ గా పేరొందిన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ శాటిలైట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట షార్ సెంటర్ నుండి ప్రత్యక్షంగా చంద్రయాన్ ప్రయోగాన్ని పలువురు వీక్షించారు  తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.యావత్ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను చంద్రయాన్-3 మిషన్ నింగిలోకి మోసుకెళ్లింది. భారత అంతరిక్ష రంగంలో చంద్రయాన్ ప్రయోగం మరో కలికూతురాయిగా నిలిచిపోతుంది. నెల్లూరులోని శ్రీహారి కోట సతీష్ ధవన్ అంతరిక్షకేంద్రం నుండి ఈ రోజు శుక్రవారం చంద్రయాన్ -3 ఎల్వీఎం3-ఎం4  రాకెట్ ను ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి పంపించడం పట్ల ఊరు-వాడ ఆనందాన్ని వ్యక్తం చేశారు..ఇది అఖండ భారతవాని గర్వించదగ్గ విషయం.. ఈ సందర్భంగా ఇస్రో సిబ్బందితో సహా చైర్మన్,శాస్త్రవేత్తలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని  నరేంద్ర మోడీ, తెలుగురాష్ట్రాల ముఖ్యమంతులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వై.యస్.జగన్మోహన్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.అంతే కాకుండా చంద్రయాన్ 3 విజయవంతం రానున్న రోజుల్లో అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ దేశాన్ని కీలక పాత్ర నిర్వహించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.


No comments:

Post a Comment