Friday, 28 July 2023

మున్నేరు ముంపు ప్రాంతాల్లో... ఎమ్మెల్సీ తాతమధు,, కలెక్టర్ వి.పి.గౌతమ్ పర్యటన... బాధితులకు పరమార్శ...


ఖమ్మం, జూలై 28: ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ లతో కలిసి, మున్నేరు ముంపు ప్రాంతాలు పోలేపల్లి, కరుణగిరి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులు పరిశీలించారు. వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించి, బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్యం, క్రిమీ కీటకాలు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముంపు బెడద పూర్తిగా తొలగేవరకు పునరావాస కేంద్రంలో ఉండాలని ముంపు బాధితులకు సూచించారు. 
    ఈ సందర్భంగా జెడ్పి సిఇఓ అప్పారావు, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, తహసీల్దార్ సుమ, అధికారులు తదితరులు ఉన్నారు.
మున్నేరు ముంపు ప్రాంతాల బాధిత శిబిరాలను సందర్శించిన కలెక్టర్, వి.పి.గౌతమ్, సి.పి. విష్ణు వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిలు..
ఖమ్మం, జూలై 28: పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులకు భోజన, వసతి సౌకర్యం తో పాటు అన్ని మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, పోలీస్ కమీషనర్ తో నయాబజార్ ప్రభుత్వ పాఠశాల, రామ్ లీల ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనం, త్రాగునీరు, వసతులు పరిశీలించి, ముంపు బాధితులతో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భోజనం, సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు. పారిశుద్ధ్యం పాటించాలని, టాయిలెట్స్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని, వ్యర్థాలు వెంట వెంటనే తొలగించాలని వారు అన్నారు. పునరావాస కేంద్రం పరిస్థితి చక్కబడే దాకా ఉంటుందని, ఇప్పుడే ఇండ్లకు వెళ్లి, ఇబ్బందులు పడవద్దని వారు అన్నారు. ఇండ్లలో క్రిమికీటకాలు, విష సర్పాలు చేరవచ్చని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు తడి ఉండగా ఆన్ చేయడం లాంటివి చేయవద్దని వారు అన్నారు. తీగలపై బట్టలు ఆరవేయడం చేయకూడదని, విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 
    నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రంలో కలెక్టర్, సిపి లు భోజనం మధ్యాహ్న భోజనం చేశారు.
    ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, అధికారులు, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment