హైదరాబాద్ : వెంటిలేటర్ పై ఉన్న హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్ను బీసీసీఐ రద్దు చేయాలని. తెలంగాణలో క్రికెట్ క్రీడా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టి సి ఏ కు పూర్తి బాధ్యతలను అప్పగించాలని తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ SD రోడ్ లోని తాజ్ ట్రై స్టార్' హోటల్ లో జరిగిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో ) జిల్లా కమిటీల ప్రతినిధుల గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పాల్గోని పలు సమస్యలపై చర్చించారు..
సమావేశం అనంతరం టీసీఏ ప్రధాన కార్యదర్శి ధారం గురువా రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డా. జి. ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)ని పూర్తిగా రద్దు చేయాలని, బీసీసీఐ రాజ్యాంగం అలాగే జాతీయ క్రీడా పాలనా చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సభ్యత్వ గుర్తింపును టీసీఏకే ఇవ్వాలని డిమాండ్ చేశారు..హెచ్సీఏ చట్ట విరుద్ధంగా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ “వెంటిలేటర్ దశకు చేరిందని విమర్శించారు. హెచ్.సి.ఏ కు రాజ్యాంగ ఎటువంటి అనుమతి లేదని, పరిపాలనా కోరం,
జిల్లా స్థాయిలో ప్రతినిత్వం వంటివి లేవని
హెచ్సీఏ హైదరాబాద్ నగరానికి వెలుపల ఎటువంటి మౌలిక సదుపాయాలు లేదా క్రికెట్ కార్యక్రమాలు లేకపోయినా, నకిలీ “డిస్ట్రిక్ట్ క్రికెట్ కాన్సెప్ట్”తో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని టీసీఏ పేర్కొంది.
హైకోర్టు నియమించిన సింగిల్ మెన్ కమిటీ ఉన్నప్పటికీ, హెచ్సీఏ ఎలా కొనసాగుతోందో అర్థం కావడం లేదని టీసీఏ ప్రశ్నించింది. “హెచ్సీఏలో ఉన్న చాలా మంది సభ్యులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని” టీసీఏ వ్యాఖ్యానించింది.
“తెలంగాణ యువత ఇక హెచ్సీఏ జోక్యం భరించే స్థితిలో లేదని ధారం గురువా రెడ్డి అన్నారు. టి సి ఎ ఇప్పటికే చట్టపరమైన చర్యలు చేపట్టిందని: జిల్లా టీసీఏ కమిటీలు సైతం ఆయా జిల్లాల పరిధిలో పోలీసు అధికారులకు ఫిర్యాదులు సమర్పించాయన్నారు.
గత 10 సంవత్సరాల హెచ్సీఏ ఆర్థిక అవకతవకల వివరాలను సిఐడికి టి సి ఏ అందజేసిందని తెలిపారు.
ప్రస్తుతం సీఐడీ విచారణలు కొనసాగుతున్నట్లు
33 జిల్లాల ప్రాతినిధ్యం కలిగిన కొత్త టీసీఏ నేతృత్వం
టీసీఏ ఇటీవల కొత్త గవర్నింగ్ బోర్డును ఎన్నుకుందని, ఇది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాలకు సమగ్ర ప్రాతినిధ్యం కలిగిన కొత్త యాజమాన్య నిర్మాణంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా టి సి ఏ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లను ప్రకటించింది:
1. తెలంగాణ గోల్డ్ కప్ 2025:
నవంబర్ 15, 2025న ప్రారంభం
రాష్ట్రంలోని 33 జిల్లాలు పాల్గొనే ప్రీమియర్ లీగ్ ఫార్మాట్, 5 జోన్లలో నిర్వహణ.
2. టీసీఏ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్:
డిసెంబర్ 2025లో నిర్వహణ.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించడమే. లక్ష్యంగా టిసిఏ పేర్కొంది
టీసీఏ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డా. జి. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ
“బీసీసీఐ గత దశాబ్ద కాలంగా జిల్లాల స్థాయిలో క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేసిన టీసీఏ కృషిని గుర్తించాలి. హెచ్సీఏని పూర్తిగా రద్దు చేయాలి లేదా కేవలం హైదరాబాద్ నగర పరిమితులకే పరిమితం చేయాలి.”
“రాష్ట్ర స్థాపన ఉద్యమంలో తెలంగాణ యువత పోరాటం సమాన అవకాశాల కోసం జరిగింది. ఇప్పుడు బీసీసీఐ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి, అవినీతి చేసిన వారిని శిక్షించి, టీసీఏకి సరైన గుర్తింపు ఇవ్వాలి.”
బోర్డ్ సమావేశంలో గవర్నింగ్ సభ్యులు
కపిలవాయి రవీందర్,
చిత్తరంజన్ కుమార్,
డాక్టర్ కూరపాటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
*Manikumar Kommamuru, 📱 9032075966*