Thursday, 30 October 2025

బట్టి పట్టు వద్దు.... సృజనాత్మక చదువులు నేర్పండి.... కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


*బట్టిపట్టే చదువుకు స్వస్తి పలికి స్కిల్స్ పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

**నెల రోజుల పాటు ఎవ్రీ చైల్డ్ రీడ్స్  కార్యక్రమం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు*

**1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంట సమయం కేటాయింపు*

*ఖమ్మం ఎన్ఎస్సీ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
ప్రతి విద్యార్థి బట్టిపట్టి చదివే విధానాన్నికి స్వస్తి పలికి రీడింగ్ స్కిల్స్ పెరిగేలా ఉపాధ్యాయులు బోధన పద్దతిని మెరుగుపర్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఖమ్మం నగరం ఎన్ఎస్పీ రోడ్ లోని ఎన్ఎస్సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లలో మధ్యాహ్నం 3.00 గంటల నుండి 4.00 గంటల వరకు నిర్వహించే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను తిరుగు విద్యా భోదనను గమనించారు. రెండు, మూడవ తరగతి గదిలో విద్యార్థులను ఎలావున్నాయి రైమ్స్ అని అడిగారు. బోర్డు పై అక్షరాలను వ్రాసి వాటియొక్క ఉచ్చారణ ను విద్యార్ధులను అడిగి కలెక్టర్ సామర్థ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* జిల్లాలోని ప్రతి విద్యార్థికి చదివే సామర్థ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యా ప్రమాణాల పెంపుదలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు.  విద్యార్థులకు ముందుగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలు రావడం చాలా కీలకమని అన్నారు.  
ఒక విద్యార్థికి చదివే సామర్థ్యం అందిస్తే జీవితాంతం ఉపయోగ పడుతుందని, విద్యార్థుల చదివే సామర్థ్యం పెంపు చేయడం కోసం చేపట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్టి భోదన చేయాలన్నారు.
30 రోజుల పాటు ప్రతి రోజు విద్యార్థి గంట సేపు చదివే సామర్థ్యంపై అభ్యాసన చేసేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బుక్ లెట్ తయారు చేయడం జరిగిందని అన్నారు. బుక్లెట్ లో ఉన్న అంశాలను తూ.చ. తప్పకుండా ఉపాధ్యాయులు ఫాలో అవుతూ పిల్లలు చదివే సామర్థ్యం పెంపొందేలా కృషి చేయాలని అన్నారు.
ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు ఒక యాప్ తయారు చేశామని, దీనిని యూ.డి.ఐ.ఎస్. తో అనుసంధానం చేయడం వల్ల ఎటువంటి డాటా ఎంట్రీ అవసరం ఉండదని, ప్రతి బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో (అక్షరాలు, పదాలు, వ్యాఖ్యలు) అప్ డేట్ మాత్రం చేయాలని అన్నారు. ఆంగ్ల అక్షరాలను ఫోనెటిక్ సౌండ్ తో సహా నేర్పేలా  కోర్సు డిజైన్ చేశామని అన్నారు. 
ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడితే ఎవ్రీ చైల్డ్ రీడ్స్  కార్యక్రమం పరిపూర్ణంగా అమలు చేయవచ్చని, నెల రోజుల తర్వాత ప్రతి విద్యార్థి కనీసం ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి రోజు పాఠశాల సమయాల్లోనే ప్రాథమిక తరగతి విద్యార్థులకు అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఎంఓ ప్రవీణ్, హెడ్ మాస్టర్ లు, సంబంధిత టీచర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
*#మణికుమార్ కొమ్మమూరు, మోబైల్:9032075966#*

No comments:

Post a Comment