Wednesday, 2 December 2020

ఉద్యమనేత వారసుణ్ణి.. ప్రతిపక్షాలకు భయపడను.. మంత్రి అజయ్ కుమార్ వెల్లడి.


ఖమ్మం :  తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ఉధ్యమాల నేత అని ఆయన వారసునిగా ఖమ్మం జిల్లా   అభివృద్ధిని  ఉధ్యమంగా చేపట్టి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు  తెలంగాణ రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో నిర్మాణంలో నూతన ఐ.టి.హబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు..
ఖమ్మం నగరం చుట్టు 11 కిలోమీటర్ల మేరకు పలు రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని..కొన్ని పూర్తి  కావడంతో ఆయా ప్రాంతాల్లో చక్కటి వాతావరణం నెలకొన్నదని. చెప్పారు.
ఆహ్లాదకరమైన ఖమ్మం లక్ష్యంగా ముందుకు సాగుదామని ఆయన పిలుపు నిచ్చారు..
GHMC ఎన్నికల్లో తనపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని..
పోలింగ్ తేదీ నాడు తను ఎం.ఎల్.ఏ క్యార్టర్సుకు పరిమితమైనట్లు చెప్పారు..
GHMC ఎన్నికల్లో తెరాస విజయం తధ్యమని ఆయన నొక్కి చెప్పారు..

No comments:

Post a Comment