Friday, 30 April 2021

జర్నలిస్టులకు హెల్ప్‌ డెస్క్ ... రేపటి నుండి ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌..


తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్‌ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడాన్ని ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ స్వాగతించింది. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో కోవిడ్‌ ఉధృతి, అనేక మంది జర్నలిస్టుల మరణాలు, వైద్యం కోసం జర్నలిస్టుల పడుతున్న తీవ్ర ఇబ్బందులను వివరించటం జరిగిందిప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌ బృందం విజ్ఞప్తి మేరకు శనివారం నుండి ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ను జర్నలిస్టుల కోసం అందుబాటులో ఉంచుతామని వైద్యశాఖ ఉన్నతాధికారులకు శుక్రవారం ప్రకించారు. లక్షణాలున్న జర్నలిస్టులు తమ వివరాలను అందులో అప్‌లోడ్‌ చేసే పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక టీంను అందుబాటులోకి తెస్తామని ౖడైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఉన్నతాధికారులు తెలిపారు.అదే విధంగా జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వాక్సినేషన్‌ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

లాక్ డౌన్ ఆలోచన లేదు..!! ప్రదాని మోదీ

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, చర్యలపై చర్చిస్తున్నారు. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వర్చుపల్ పద్దతిలో ఈ సమావేశం జరుగుతోంది.


ఈ సందర్భంగా *దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు.* కరోనా కేసుల ఆధారంగా లాక్‌డౌన్‌పై *ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని మోదీ తెలిపారు.* కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని మోదీ సూచించారు.

Thursday, 29 April 2021

లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేదు : మంత్రి ఈట‌ల స్పష్టీకరణ

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. రేప‌ట్నుంచి 19 జిల్లా డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారికి జిల్లా డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల్లో ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారు 3, 4 రోజుల‌కు ఒక‌సారి ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ర్టంలో ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి ఈట‌ల హెచ్చ‌రించారు. తెలంగాణ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టాల‌కు చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు.
కేంద్రం కేటాయించే వ్యాక్సిన్ల‌ను బ‌ట్టి రాష్ర్టంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. టీకాలు వ‌చ్చే ప‌రిస్థితిని బ‌ట్టి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు. 3.5 కోట్ల టీకాలు 3 నెల‌ల్లో ఇవ్వాల‌ని అనుకుంటున్నాం. దిగుమ‌తి చేసుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇస్తుందా? అని ప్ర‌శ్నించారు. ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకా వేసే అవ‌కాశం ఉంది. టీకా, కొవిడ్ ప‌రీక్ష‌లు వేర్వేరు కేంద్రాల్లో ఉండాల‌న్న వాద‌న కూడా ఉంద‌న్నారు. దీనిపై ఆలోచిస్తామ‌న్నారు. వ్యాక్సిన్ల కోసం ప‌క‌డ్బందీగా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు

తెలంగాణలో లాక్డ్ డౌన్ ఆలోచన లేదు..


తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డ్ డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు. ఇష్టం లేదని
 హోంమంత్రి   అన్నారు.

Tuesday, 27 April 2021

కాళేశ్వరునికి ఏకాంతంగా పూజలు.. దర్శనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన....

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం యంత్రాంగం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే, స్వామివారికి అర్చకులు నిత్యం పూజలు చేస్తారని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు ఆలయ సిబ్బంది, ఓ అర్చకుడు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. అలాగే గ్రామంలో 50కిపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎక్కువగా భక్తులు వస్తున్నందున కరోనా వ్యాప్తికి అవకాశం ఉండడంతో భక్తులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పారు.

Wednesday, 21 April 2021

సీఎం కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు : వైద్యులు


*హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు.సీఎంకు కొవిడ్‌ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్‌ లెవల్స్‌ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు. *ఆరు రకాల వైద్యపరీక్షలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్వహించారు.

సి రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్ పీ) డైమర్

ఐఎల్ 6

లివర్ ఫంక్షన్ టెస్ట్,

కంప్లీట్ బ్లాక్ పిక్చర్,

సిటీ స్కాన్‌, చెస్ట్ ఎక్స్ రే కూడా తీశారు. 40 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్కు బయలుదేరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్  విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు.

త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమ‌వారం సీఎం కేసీఆర్‌కు క‌రోనా పాజిట‌వ్ నిర్ధార‌ణ కావడంతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోంఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇవాళ సాయంత్రం సోమాజిగూడ య‌శోద ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం సిటీ స్కానింగ్‌తోపాటు మరికొన్ని సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

TN GOVERNOR OFFERS PRAYERS TO HILL LORD_________!!


The Honourable Governor of Tamil Nadu, Sri Bhanwarilal Purohit offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy on Wednesday.
Earlier, on his arrival at the main entrance of the temple-Maha Dwaram, he was welcomed by Addl Executive Officer Sri AV Dharma Reddy, temple priests. 
After offering prayers to Dwajasthambham in the temple, the Governor had darshan of Lord Venkateswara.  Later at Ranganayakula Mandapam, the Vedic Pundits offered him Vedasirvachanam. 
The Addl EO presented Thirtha Prasadams and a Coffee Table Book on Lord to the Governor.
Temple DyEO Sri Haridranath, Reception DyEO Sri Bhaskar, OSD Sri Ramakrishna and others were present.

అంజనాద్రే హనుమ పుట్టిన నెలవు...టిటిడి వెల్లడీ..

*ఓం నమో వేంకటేశాయ🙏*

*తిరుమల :
*హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అధికారిక ప్రకటన*విడుదల చేసింది.
అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ ఓ కమిటీని నియమించింది. అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించినట్లు కమిటీ సభ్యులు ఈవోకు తెలిపారు.అనంతరం
*తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని పేర్కొంది.. ఈ మేరకు..జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర్ శర్మ* ఓ ప్రకటన విడుదల చేశారు.

*మల సప్తగిరుల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలంగా టీటీడీ వివరణ


*ఆకాశ గంగా తీర్థం లో పన్నెండేళ్ళపాటు అంజనాదేవి తపస్సు*చేసినట్లు పురణాల ద్వారా వెల్లడి అవుతోంది అన్న కమిటీ సభ్యులు

*నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించారని తెలిపారు.

*అంజనాద్రి పై వెలసిన జపాలి తీర్థం హనుమంతుని జన్మ స్థలంగా పరిశోధన లు చెబుతున్నాయన్నారు.
*పౌరాణిక వాజ్మయ శాసన చారిత్రిక ఆధారాలను సేకరించిన ఆనంతరం తాము నిర్థారణకు వచ్ఛినట్లు కమిటీ వెల్లడి.

రామ భక్త హనుమాన్...
ఆయన భక్తులకి దేవుడు! అదే సమయంలో తానే స్వయంగా మహాభక్తుడు! ఒక భక్తుడే.. దేవుడై పూజలందుకోవటం.. కేవలం హనుమంతుడి విషయంలోనే సాధ్యం!

ఆంజనేయుడనగానే మనకు శ్రీరామ భక్తుడు గుర్తుకు వస్తాడు. ఎక్కడెక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడక్కడ మారుతి ఇప్పటికీ, ఎప్పటికీ ఆనందబాష్పాలు రాలుస్తూ కూర్చుంటాడట! అంటే, మనకు రామదూత రక్షణ, అనుగ్రహం కావాలంటే ‘’రామ’’ అని పలకటమే మార్గం. ఆయన అమాంతం వచ్చి మన వద్ద వాలిపోతాడు. అటువంటి చిరంజీవి అయిన భవిష్యత్ బ్రహ్మ.. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు! చైత్ర మాసంలో రామ నవమి తరువాత వచ్చే పౌర్ణమి నాడు కొన్ని చోట్ల హనుమాన్ జయంతి జరుపుతుంటారు. అయితే, చైత్ర పౌర్ణమి ఆంజనేయుని పుట్టిన రోజు కాదు. అది హనుమద్ విజయయాత్ర. సీతమ్మను దర్శించి తిరిగి వచ్చిన మారుతిని శ్రీరామచంద్రుడు గౌరవించిన రోజని పండితులు చెబుతుంటారు. అసలు హనుమద్ జయంతి మాత్రం వైశాఖ బహుళ దశమి రోజున.

హనుమంతుడ్ని రామాయణంలో ఒక పాత్రలా కాక ఒక పరబ్రహ్మ స్వరూపంగా దర్శించిన మహర్షి పరాశరుడు. ఆయన వ్యాస భగవానుని తండ్రి. అతడు అందించిన మహా పవిత్ర గ్రంథం పరాశర సంహిత. అందులో చెప్పిన శ్లోకమే మనకు ఆంజనేయ జయంతి జరుపుకోవడానికి ప్రమాణం. ఇక పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవటం తెలుగు ప్రాంతంలో తరతరాలుగా వస్తోంది. మన రామాలయాలు, హనుమదాలయాలు వైశాఖ బహుళ దశమినాడు మహోత్సవాలకు కేంద్రాలవుతాయి.

ఒక్కసారి ఆంజనేయ అవతరణంలోకి తొంగిచూస్తే హనుమ రుద్రాంశ సంభూతుడు. ఆయన శివుడే! ఒకానొక సమయంలో గార్ధభాసురుడు అనే రాక్షసుడ్ని సంహరించాల్సి వస్తే విష్ణువు ఆ పనికి పూనుకున్నాడట. కానీ, శంకరుడు ఆ పని నారాయణుడు చేయలేడని పందానికి దిగాడట. చివరకు, గార్ధభాసురుని గోవిందుడే హతమార్చాడు. పందెంలో తాను ఓడిపోయినందుకు కైలాసనాథుడు వైకుంఠధామునికి దాస్యం చేస్తానని అన్నాడు. కానీ, లక్ష్మీపతి ఆ అవసరం వచ్చినప్పుడు చేద్దువుగాని అని మహాదేవునికి చెప్పాడు.

రావణాసుర వధకి విష్ణువు రాముడై వచ్చే ముందు ఇతర దేవతలు అందరూ తమతమ అంశలతో భువిపై వానర, భల్లూకాలుగా జన్మించారు. వారిలో ఒకడిగా పరమ శివుడు తన అంశని అవతరింపజేశాడు. ఆ రుద్రాంశ స్వరూపుడే మన ఆంజనేయుడు! ఆయన పుత్రుడి కోసం తపమాచరించిన కేసరీ సతీ అయిన అంజనా దేవీ గర్భంలో వాయు దేవుని వరంగా ప్రభవించాడు. పైగా హనుమ జననం మన తిరుమల కొండల్లోనే జరిగింది. ఇప్పటికీ ఏడు కొండల్లో ఒక దానికి అంజనాద్రి అనటం అందుకే! అక్కడే ఆంజనేయుని తల్లి నిష్ఠగా తపస్సు చేసి వాయు దేవుని వరంతో మహావీరుడ్ని తనయుడుగా పొందింది.

హనుమంతుడు పెరిగి పెద్దవాడై వాలి తమ్ముడైన సుగ్రీవునికి మంత్రి అయ్యాడు. వాలి భయంతో భార్యని, రాజ్యాన్ని వదిలి కొండపై బ్రతుకుతోన్న సుగ్రీవుడికి మళ్లీ రాజ్యం, భార్య, మరీ ముఖ్యంగా, రామానుగ్రహం కలిగింది హనుమ కారణంగానే! ఆయన దేవుడుగా భావించే శ్రీరాముడికి కూడా సీతమ్మ జాడ వెదికి పెట్టాడు. ఇలా దేవుడికే సాయం చేసిన భక్తుడు ఆంజనేయుడు తప్ప మరొకరు ఎవరూ మనకు కనిపించరు! శ్రీరాముడంతటి వాడికి భార్యా వియోగం పోగొట్టిన వాడు, తమ్ముడైన లక్ష్మణునికి సంజీవని పర్వతం మోసుకొచ్చి ప్రాణదానం చేసిన వాడు మన సంజీవరాయుడు! రాముడి నుంచీ మోక్షం కూడా కోరని పరమ నిస్వార్థ, మహా పవిత్ర భక్త శిఖామణి ఆంజనేయుడు!

హనుమంతుని దేవుడుగా భావించి పూజించవచ్చు. ఆయన లంకకి వెళ్లి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకుని తిరిగొచ్చిన సుందర కథనంలో ఆయన ధైర్య, వీర్య, సాహసాల నుంచీ ప్రేరణ పొందవచ్చు. అలాగే, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఆయన ఏదీ చేయకుండా ఉండలేదు. అలాగని ఏదీ కూడా ప్రతిఫలంపై దృష్టితో చేయలేదు. రాముని కోసం కర్తవ్యంగా చేశాడు. ఆ కర్తవ్య దీక్ష మనమూ అలవర్చుకుంటే విజయాలు ఉప్పెనలా వస్తాయి. ఓటములు ఎన్నొచ్చినా మనల్ని పెకలించకుండా వాటి దారిన అవి పోతాయి. అందుకే, ఆంజనేయుడ్ని పూజించాలి. అంతకంటే ఎక్కువగా ఆయన గాథలు, వ్యక్తిత్వంలోంచి ఎంతో ఎంతెంతో నేర్చుకోవాలి…

జై శ్రీరామ్! జై హనుమాన్!

కరోనా నిబంధనల మధ్య భధ్రాద్రి రాముని కళ్యాణం.. పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి..పువ్వాడ ఆజయ్ కుమార్


*****శ్రీరామ జయం**** 
 శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, వాటి తర్వాత వీధి వీధి నా వెలసే నవమి పందిళ్ళు.
ఆ పందిళ్ళ లో దొరికే బెల్లం పానకమూ, వడపప్పూ. 
ఆ వైభవానికి తగ్గట్టుగా పందిట్లో పోసే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. కరోనా కారణంగా ఈ ఆనందం  అందరికీ దూరం కాగా...
భద్రాచలంలో శ్రీ రామనవమి వేడుకలు బుధవారం నిరాడంబ‌రంగా జ‌రిగాయి.  కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి కూడా భక్తజనం లేకుండానే సీతారామ కళ్యాణం, పట్టాభిషేకం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు శ్రీ సీతారాముల స్వామివారికి ముత్యాల త‌లంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.  వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కళ్యాణం జ‌రిగింది దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల  అధికారులు ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.

Tuesday, 20 April 2021

ప్రయాణ సమయం కుదించిన..ఆర్టీసీ.. రాత్రి 9గంటలకు డిపోకు చేరాలని సూచన...

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో బస్సుల ప్రయాణ సమయాన్ని ఆర్టీసీ కుదించింది. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. సిటీ బస్సులు రాత్రి 9 గంటలలోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఇతర జిల్లాలకు రాత్రి 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సుల సమయాన్ని తొమ్మిదిలోపు వెళ్లేలా ఆయా డిపో మేనేజర్లు సమన్వయం చేసుకుంటారన్నారు. ప్రయాణికులందరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఈడీ యాదగిరి పేర్కొన్నారు.

Sunday, 18 April 2021

BHASHYAKARULA SATTUMORA PERFORMED AT TIRUMALA...


The advent of the birth star of Sri Ramanujacharya, Arudra Nakshatra on Sunday, Bhashakarula Sattumora was observed in Tirumala.
Since the great Sri Vaishnavaite Ramanuja has written the foreword to Mimamsa as per norms of Visishtadwaita, he was known as Bhashyakarulavaru.
After Sahasra Deepalankara Seva, the deities accompanied by Sri Ramanujacharya on another Tiruchi taken on a procession along four Mada streets.
Later in the evening, Sattumora was observed at Bhashyakaulavari Sannidhi inside Tirumala temple between 7pm and 9pm.
Both the Senior and Junior pontiffs, Jeeyangars, temple staffs were also present.

Saturday, 17 April 2021

మాస్కును ఛాలెంజ్ గా స్వీకరిధ్ధాం... వైకాపా మహిళా నేత శైలజఛరణ్ రెడ్డి పిలుపు...

*#MaskChallenge*

ప్రతి ఒక్కరు మాస్క్ చాలెంజ్ ని స్వీకరించి కరోనానం పటిష్ణంగా ఏదుర్కోందమని..వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి  శైలజ చరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
మనం మాస్కు పెట్టుకున్న ఫోటోలని పదిమందికి పంపించి మాస్క్ చాలెంజ్ స్వీకరించమని చెప్పండి. అలాగే వారిని కూడా మాస్క్ ఫోటోలతో ఇంకో పది మందికి మాస్క్ చాలెంజ్ ఇవ్వమని చెప్పండి.అంటూ ఆమే ఛాలెంజ్ విసిరారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
ఆరోగ్యంగా జీవిద్దాం... ఆనందంగా జీవిద్దాం.....
ఇది మన సామాజిక బాధ్యత అని శైలజఛరణ్ రెడ్డి పేర్కొన్నారు ్్

I am giving you the *#Maskchallenge*. Accept The challenge and make your own mask. Continue the chain by challenging 10 more people. Full-fill your social responsibility by wearing MASK.

 *#WearMask*
*#ShailajaReddy*
*#BeResponsible*

Tuesday, 13 April 2021

భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకల ఆరంభం..

వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్రమహోత్సవాలు ప్రారంభమైనాయి. ఉదయం 4.00గంటలకు నిర్మాల్యాపనయనం జరిపిన అనంతరం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట అర్చకులు అమ్మవారికి ఉత్సవాంగీకార ప్రార్థన జరిపారు. అమ్మవారి అనుజ్ఞ లభించిన అనంతరం గణపతి పూజ పుణ్యాహవాచనం పూర్వాంగవిధి జరిపి అమ్మవారికి పూర్ణాభిషేకం నయనానందకరంగా జరిపారు.వెనువెంటనే సర్వతోభద్ర మండలారాధన జరిపి కల్పోక్తంగాదేవతాహ్వానం జరుపడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువిధములైన జపహోమార్చనాదులు జరిపారు.ఈరోజుకార్యక్రమాలకు నగర ప్రముఖ న్యాయవాది శ్రీ కుమ్మరి సాంబయ్య-సునీత దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.
వరంగల్ పశ్చిమ MLA దాస్యం వినయభాస్కర్ రేవతి దంపతులు ఆలయానికి విచ్చేసి ఉగాది వేడుకలలో పాల్గొన్నారు.ఆలయానికి విచ్చేసిన MLA దంపతులకు EO రామల సునీత ప్రధానార్చకులు భద్రకాళిశేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి 
నవరాత్రులలో ప్రతినిత్యం దాతల సౌజన్యంతో జరుపపబడే లక్షపుష్పార్చన MLA
వినయభాస్కర్ దంపతుల చేతులమీదుగా ప్రారంభింపజేశారు.కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భక్తులను దర్శనానికి అనుమతించారు.అయినవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి కుమారులు రాధాకృష్ణ శర్మజరిపిన పంచాంగ శ్రవణం భక్తులను ఆకట్టుకుంది. దాదాపు పది వేల మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించారు. ఏలాంటి తారతమ్యం లేకుండా VIPలకు కూడా ఈసారి సాధారణంగానే ఏర్పాట్లు జరిపిన తీరు ఆలయ అధికారులను భక్తుల మన్ననలకు పాత్రులను చేసింది

Sunday, 11 April 2021

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మహిళ కానిస్టేబుళ్ల జరిమానా*.



*ట్రిపుల్ రైడింగ్ పై  సిరియస్ అయిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శాఖపరమైన చర్యలకు ఆదేశం*

విధినిర్వహణలో భాగంగా 
ఈనెల 9 వ తేదిన షర్మిలా సంకల్ప సభకు హజరైయ్యేందుకు  TS04FD0822 నెంబరు గల ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లు వెళ్తున్నట్లు నగరంలోని ఆనంద్ విహార్ సెంటర్ వద్ద  వున్న సీసీ కెమెరాలలో గుర్తించారు. మరోవైపు మహిళ పోలీసులు నిబంధనలు వ్యతిరేకంగా డ్రైవింగ్.. సెల్ ముచ్ఛటపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు..మీకో రూల్..మాకో రూలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు..ఈ విషయంలో ఖమ్మం  సిపి.విష్ణు ఎస్ వారియర్..చర్యలకు ఆదేశించారు.
ఖమ్మం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన మహిళ కానిస్టేబుల్, మరో ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లతో కలసి హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకరమైన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద ట్రాఫిక్ పోలీసులు రూ,, 3300/- జరిమానా విధించారు. 
ట్రిపుల్ రైడింగ్ పై  సిరియస్ అయిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ భాధ్యతరహితంగా వ్యవహరించిన ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు

Friday, 9 April 2021

తిరుమలలో 12 మంది అర్చకులకు కరోనా పాజిటివ్


తిరుమల తిరుపతి దేవస్థానం లో పనిచేస్తున్న 12 మంది అర్చకులు కరోనా బారినపడ్డారు. గత ఏడాదిలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడ అర్చకులు కరోనా బారినపడ్డారు. అప్పట్లో కరోనా భయానికి కొన్ని రోజుల పాటు ఆలయాలను కూడా మూసివేశారు.టీటీడీలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.ఇప్పటికే 4 వేల మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.మిగిలినవారికి కూడ వ్యాక్సినేషన్ చేయించనున్నారు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.బుధవారం నాడు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకి కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడ పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు గాను వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే వ్యాక్సినేషన్ ను అందించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఇటీవలనే అధికారులను ఆదేశించారు.

Thursday, 8 April 2021

Tolerance brings in me a sense of peace and satisfaction.. Sudha Murthy

𝑨𝒕𝒕𝒂𝒄𝒉𝒎𝒆𝒏𝒕 𝒊𝒏 𝒅𝒆𝒕𝒂𝒄𝒉𝒎𝒆𝒏𝒕 Story shared by 
सदानंद पै 

When my daughter wed and left home, I felt a part of me left.  With a daughter and a son, I was very happy in my life. When she
was in her teens, I felt as if she was my "physical extension" .
So when she left home to set up her own home, I felt I lost a limb from my body. Next time she came to stay with us for a few days, I was astonished how her priorities had changed. We too must have given the same shocks to our own parents. While she was talking to me, she used the word "Amma" (mother). But that word was not for me. That word referred her "mother in law".
I felt she was always in a hurry to go back to her house and not stay with me for a few more days. That was the first time, I understood that I have to start practicing detachment with attachment.
Two years after my daughter’s marriage, my son left for higher studies to US. Having experienced a child's separation once, I was better equipped emotionally. I became busy with various classes held in the city related to vedanta.
I just wanted to be away from home. Because my husband was a 24/7 workaholic. My son used to write how he was missing my home and the food cooked by me and how he was waiting to come back to live in Chennai with us.
After a few years, he did come back and we got him married. He started living separately with his wife and we were also happy that they wanted to be independent from the beginning. But now, it was all changed !

In the USA, he missed my cooking, now if I called him my home with his wife for a meal, he always says an excuse like "oh, amma, we have other plans for the day, please don't mistake us, if we don't come today" ! I could see that his priorities had also changed completely. We talk so many things and give so much advice to others, but when it comes to our own children, acceptance comes very late.
Our next step is to just leave them undisturbed in every way. It was at that time, that I made the following, my 'new profile'. In all my relationships, I give my best and do my best to live up to what I say. My attachment with them is complete. However, I remain detached in the sense that I do not expect them to reciprocate my affection. I love them too much. But I decided not to expect the same degree of love from them.
Most importantly, I make a conscious effort , not to interfere or pass judgements on the lives they choose to lead. My concern for my beloved people will not fade with my detachment. If you let go of the ones you love, they will never go away – this is the beauty of attachment with detachment !
I have learnt to love and let go. This principle has developed tolerance in me. When I let the people live the way they want to, I learn to accept them for what they are. 
Most importantly, I learn to tolerate the world around me and this tolerance brings in me a sense of peace and satisfaction. Since both my children live in Chennai, I follow this very strictly, you know why ! Now I have realised that we start growing mentally much more only after the children leave the house and we have to tackle the emotional vacuum, that arises, along with age-related problems .
I specially dedicate this post to my friends, who are totally dependent on their children's lives, to nurture their own selves emotionally.  Please develop your own interests, hobbies etc, however ordinary they seem to be. 
We must learn to love whatever we do instead of Doing whatever we love !!

Author:  Sudha Murthy, Chairperson, Infosys Foundation


Thursday, 1 April 2021

అవిభక్త వాటాల కొనుగోలుతో తస్మాత్ జాగ్రత్త : తెలంగాణ సి.ఎస్ : సోమేష్ కుమార్. రిజిస్ట్రేషన్ శాఖ అప్రమత్తంగా వుండాలంటూ సూచన..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ క్రెడాయి, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మరియు టి.ఎస్.రెరా అధికారులతో సమావేశం నిర్వహించారు.సామాన్య ప్రజలకు అవిభక్త వాటాల భూముల అమ్మకం మోసానికి దారితీస్తుందని క్రెడాయి, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులకు టిఎస్ రెరా అధికారులు తెలియజేశారు. తదనుగుణంగా ప్రజలకు అవసరమైన సూచనలు / పత్రికా ప్రకటనలను జారీ చేయాలని రెరా కార్యదర్శి మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్లు కమిషనర్, ఐజి ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ ప్రెస్ నోట్ ద్వారా అటువంటి సంస్థల యుడిఎస్ భూములను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు, తెలంగాణ స్టేట్ రెరాలో నమోదు కాని  సంస్థల యుడిఎస్ భూముల కొనుగోళ్లు భవిష్యత్తులో వ్యాజ్యానికి దారితీయవచ్చునని తెలిపారు.
ఈ విషయాన్ని పరిశీలించి, ఇటువంటి మోసపూరిత అమ్మకాలు జరిగిన చోట తగిన చర్యలు తీసుకోవాలని హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రవి గుప్తా కు ప్రధాన కార్యదర్శి సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి  శ్రీ రవి గుప్తా, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్, శ్రీ శేషాద్రి, డిటిసిపి/రెరా సెక్రటరీ శ్రీ విద్యాధర్, ఇతర అధికారులు మరియు క్రెడా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.