Wednesday, 21 April 2021

సీఎం కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు : వైద్యులు


*హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు.సీఎంకు కొవిడ్‌ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్‌ లెవల్స్‌ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు. *ఆరు రకాల వైద్యపరీక్షలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్వహించారు.

సి రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్ పీ) డైమర్

ఐఎల్ 6

లివర్ ఫంక్షన్ టెస్ట్,

కంప్లీట్ బ్లాక్ పిక్చర్,

సిటీ స్కాన్‌, చెస్ట్ ఎక్స్ రే కూడా తీశారు. 40 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్కు బయలుదేరారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్  విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు.

త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమ‌వారం సీఎం కేసీఆర్‌కు క‌రోనా పాజిట‌వ్ నిర్ధార‌ణ కావడంతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోంఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇవాళ సాయంత్రం సోమాజిగూడ య‌శోద ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం సిటీ స్కానింగ్‌తోపాటు మరికొన్ని సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

No comments:

Post a Comment