ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ క్రెడాయి, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మరియు టి.ఎస్.రెరా అధికారులతో సమావేశం నిర్వహించారు.సామాన్య ప్రజలకు అవిభక్త వాటాల భూముల అమ్మకం మోసానికి దారితీస్తుందని క్రెడాయి, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులకు టిఎస్ రెరా అధికారులు తెలియజేశారు. తదనుగుణంగా ప్రజలకు అవసరమైన సూచనలు / పత్రికా ప్రకటనలను జారీ చేయాలని రెరా కార్యదర్శి మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్లు కమిషనర్, ఐజి ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ ప్రెస్ నోట్ ద్వారా అటువంటి సంస్థల యుడిఎస్ భూములను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు, తెలంగాణ స్టేట్ రెరాలో నమోదు కాని సంస్థల యుడిఎస్ భూముల కొనుగోళ్లు భవిష్యత్తులో వ్యాజ్యానికి దారితీయవచ్చునని తెలిపారు.
ఈ విషయాన్ని పరిశీలించి, ఇటువంటి మోసపూరిత అమ్మకాలు జరిగిన చోట తగిన చర్యలు తీసుకోవాలని హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రవి గుప్తా కు ప్రధాన కార్యదర్శి సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రవి గుప్తా, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్, శ్రీ శేషాద్రి, డిటిసిపి/రెరా సెక్రటరీ శ్రీ విద్యాధర్, ఇతర అధికారులు మరియు క్రెడా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment