Wednesday, 5 March 2025

పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం....





న్యూ ఢిల్లీ :-సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది. తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దాఖలైన పిల్పై విచారణ జరిపిన సుప్రీం ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, తమిళనాడు , హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్లకు నోటీసులు జారీచేసింది.*ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔషదాల ధరలు పెరిగడం కొనుగోలు దారులకు భారమని సుప్రీం అభిప్రాయపడింది  ప్రైవేట్ ఆసుపత్రుల పై చర్యలు తీసుకోండంటూ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు డైరెక్షన్.

No comments:

Post a Comment