Friday, 7 March 2025

ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం : మంత్రి పొంగిలేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్....పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయ్యింది. ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చిన హామీలను కొన్ని పూర్తి చేశాం... మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్ళను ఇచ్చే కార్యక్రమం మరో వారంలో మొదలవుతుంది అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేటవుతుంది ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించింది. వాటన్నింటినీ గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నాం ఎక్కడ తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోంది
ఇచ్చిన ప్రతి మాటను..హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటాం

No comments:

Post a Comment