Sunday, 9 March 2025

జిల్లా పరిషత్లో ఎల్.ఆర్.ఎస్. పై అవగాహన సమావేశం... జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ రావు

 
ఖమ్మం జిల్లా, రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం ఎల్.ఆర్.ఎస్. ను అనుసరించి రిజిస్ట్రేషన్ లకు సంబంధించిన విధివిధానాలపై అవగాహనకు నేడు (సోమవారం) స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి సమావేశం సోమవారం ఉదయం 9.00 గంటల నుండి చేపడుతున్నట్లు, ఇట్టి సమావేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల యజమానులు, ప్లాట్ల యజమానులు, దస్తావేజు లేఖరులు హాజరుకావాలని జిల్లా రిజిస్ట్రార్ అన్నారు. ఈ సమావేశంలో  రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులు పాల్గొని ఎల్.ఆర్.ఎస్. పై పూర్తి అవగాహన కల్పిస్తారని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment