Friday, 26 March 2021
చంద్రబాబు ఏ1గా, నారాయణ ఏ2 అమరావతి ల్యాండ్పూలింగ్.. - శైలజా చరణ్ రెడ్డి
Saturday, 20 March 2021
విజయవంతంగా ముగిసిన అతిపెద్ద సుదీర్ఘ ఓట్ల లెక్కింపు.. 90 గంటలు సాగిన ప్రక్రియ... సిబ్బందికి కమీషనర్ అభినందనలు....
Sunday, 14 March 2021
పవన్ కళ్యాణ్ వాక్యలను పరిశీలిస్తాం.... తెలంగాణ ఎస్.ఇ.సీ. శశాంక్ గోయల్
వరంగల్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో భాగంగా పట్టభద్రుల నుంచి వస్తున్న స్పందన బాగుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లతో మాట్లాడానని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ వేగవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నకిలీ కార్డులతో ఓటేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.... టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణీదేవీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్పై కూడా దర్యాప్తు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. అలాగే వాణీదేవికి ఓటేశానని చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యల పైనా విచారణ చేపడతామన్నారు. హన్మకొండలోని పలు పోలింగ్ కేంద్రాలను శశాంక్ గోయల్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందన్నారు. పోలింగ్ శాతం పెరగడం సంతోషకరమని, ఆన్లైన్లో డిలీట్ ఆప్షన్ వల్ల ఓటర్లకు నష్టం జరుగుతుందని మా దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ ప్రచారంపై సైబర్ క్రైం వాళ్లు చర్యలు తీసుకుంటారు.. ఫేక్ ఓటర్లపై ఆధారాలు చూపిస్తే దర్యాప్తు చేస్తాం అని శశాంక్ గోయల్ చెప్పారు.Thursday, 11 March 2021
కుంభమేళాకు సర్వం సిద్దం.. హరిద్వార్ కు పోటేత్తిన భక్తులు..
కుంభమేళా-2021 కోసం ఉత్తరఖండ్ రాష్ట్రం.. హరిద్వార్లో సర్వం కరోనా మార్గదర్శకాలతో కుంభమేళా జరుగుతున్న శివరాత్రి కుంభమేళాలో ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. గురువారం శివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గంగానదిలో మొదటి షాహి స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, సాధువులు తరలివచ్ఛారు. ఇప్పటికే వేలాది మంది సాధువులు హరిద్వార్ చేరుకున్నారు. రాష్ట్రంలోని హరిద్వార్, పౌరి గర్హ్వాల్, డెహ్రాడూన్ జిల్లాల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కుంభమేళా అధికారి దీపక్ రావత్ మంగళవారం వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. దీంతోపాటు పలుచోట్ల శానిటైజర్స్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కుంభమేళా సందర్భంగా భద్రత కోసం ఘాట్ల వెంట, రహదారులపై భద్రతా సిబ్బందిని మోహరించామని.. పరిశుభ్రత కోసం స్వచ్ఛంద కార్యకర్తలను నియమించామని తెలిపారు.
కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముందుగా వెబ్పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోనే వారికి ఈ-పాస్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుంభమేళాలో పాల్గొనేవారంతా అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. దీంతోపాటు 72 గంటల ముందు తీసుకున్న కరోనావైరస్ నెగెటివ్ రిపోర్ట్ సహా ఐడెంటిటీ పత్రాలను అప్లోడ్ చేయాలన్నారు. ఆ తర్వాతే ఈ-పాస్ను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కుంభమేళాలో పాల్గొనే యాత్రికులంతా ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, మాస్క్లు ధరించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారంతా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన మేరకు మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని.. ఒకవేళ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కుంభమేళా ప్రతి పన్నేండు ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ మహాకుంభ్ జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది. గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని, వ్యాధులు, పాపల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల అపార విశ్వాసం. ఈ కుంభంలో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్లు, 6 ప్రధాన స్నాన్ ఘాట్లుంటాయి. దానిలో భాగంగా భక్తులు గంగా నదిలో రేపు మొదటిగా పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకోనున్నారు.