ఖమ్మం ; స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ది.20-08-2022 నాడు ఉ.9.00 గం. లకు సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం నందు స్వయం సహాయక సంఘ సభ్యులు, ఐసిడిఎస్ సిబ్బంది మరియు ఆరోగ్యశాఖ సిబ్బందితో జాతీయ పతాకంలోని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులతో *75 ఆకారంలో సాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ప్రతిబింబించే విధముగా* ముగ్గుల పోటీలు, (దేశభక్తి ప్రధానాంశంగా) పాటల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గులపోటీలో ప్రతి మండలం నుండి 10 మంది యస్.హెచ్.జీ మహిళలు, ఐ.సీ.డియస్ అంగన్వాడీ టీచర్లు, వివిధ గ్రామాల నుండి పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలు మొత్తం గౌతమి జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగింది.
శ్రీమతి అనసూయ గారు జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గారు, శ్రీమతి మల్లీశ్వరి అసిస్టెంట్ కమిషనర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ గారు, శ్రీమతి డి.శిరీష అడిషనల్ డి.ఆర్.డి.ఓ ఈ.జి.యస్ గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినారు మరియు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ తృతీయ మరియు కన్సోలేశన్ బహుమతులు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శ్రీమతి స్నేహాలత మొగిలి, ఐ.ఏ.యస్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గారు, శ్రీమతి విద్యా చందన గారు డి.ఆర్.డి.ఓ, డి.ఆర్.డి.ఏ, ఖమ్మం గారు, శ్రీమతి సి.హెచ్ సంధ్యారాణి జిల్లా సంక్షేమ అదికారి గారు, శ్రీమతి. ఆర్. జయశ్రీ అడిషనల్ డి.ఆర్.డి.ఓ సెర్ప్ గారు, డి.ఆర్.డి.ఏ సిబ్బంది మరియు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి అరుణ మరియు కోశాధికారి ఇతర ఓ,బి సభ్యులు, , డీపీఎంలు, ఏపిఎం లు, సీ.సీలు యస్.హెచ్.జీ సభ్యులతో దేశభక్తి ఇనుమడింపజేసే విధంగా గౌతమి జిల్లా సమాఖ్య ఆధ్యర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
No comments:
Post a Comment