Monday, 15 May 2023

అర్జీలను సత్వరమే పరిష్కారించండి... కలెక్టర్ వి.పి.గౌతమ్


 ఖమ్మం మే 15: అర్జీదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.  సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్‌ డే’’ లో కలెక్టర్‌ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి తగు చర్య నిమిత్తం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రైతు సంఘం వైరా మండల కమిటీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, టి.నాగేశ్వరావులు వైరా మండలంలో మొక్కజొన్న సాగు అధికంగా చేయడం జరిగిందని, అకాల వర్షాల తాకిడికి పండించిన  పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమను ఆదుకోవాల్సిందిగా సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు.   తల్లాడ మండలం తల్లాడ గ్రామ పంచాయితీ పరిధి మల్లారం రోడ్‌, 3 వ వార్డు నివాసులు బాలబారతి రోడ్‌, కొత్తగూడెం వెళ్ళు మార్గంలో చాపల దుకాణం, చికెన్‌ షాపుల వ్యర్థాలను వేయడం వల్లన, దుర్వాసన, రైస్‌ మిల్లు నుండి డస్ట్‌ వెలువడడం వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతున్నదని, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర్చగరలని, చెత్తకుండీలు ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు.  తిరుమలాయపాలెం మండలం సీతారాంపురం గ్రామనికి చెందిన గుంటి నాగేశ్వరరావు తనకు తాళ్ళచెర్వు రెవెన్యూ పరిధిలో సర్వేనెం.230/అ2/1లో 2 ఎకరాల 29 కుంటల వ్యవసాయ భూమి వారసత్వంగా వచ్చిన భూమిని వేరొకరి పేరున ఎక్కించడం జరిగిదని తన భూమిని తనకు ఎక్కించగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా తిరుమలాయపాలెం తహశీల్దారను ఆదేశించారు.  ఖమ్మం నగరం పంపింగ్‌వెల్‌రోడ్‌కు చెందిన సోపాల ధనలక్ష్మీ తన కూతురు సోపాల జననికి తలలో గడ్డ ఉండడం వల్ల కాళ్ళు చచ్చుబడి, కంటిచూపు కూడా లేక మంచానికే పరిమితం అవ్వడం జరిగినదని, ఆర్ధిక స్తోమత లేదని, తన కూతురు పేరున డబుల్‌ బెడ్‌రూమ్‌ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా రెవెన్యూ అధికారికి సూచించారు.  రఘునాథపాలెం మండలంకు చెందిన పద్మశాలి, గౌడ కమ్యూనిటీలకు సర్వేనెం.  17/పి నందు 59 కుంటల భూమిని కేటాయించడం జరిగినదని, అట్టి భూమి ప్రక్కన ఉన్న చిన్న (శివ) ప్రభుత్వం కేటాయించిన భూమి తనదని అక్రమించడం జరిగినదని, అట్టి భూమిని తిరిగి మాకు ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం అదనపు కలెక్టర్‌కు సూచించారు. ఖమ్మం నగరంకు చెందిన  కె.రమ్యశ్రీ తాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అకౌంటెంట్‌ కమ్‌ డి.ఈ.ఓ జాబ్‌ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగినదని దానిలో భాగంగా 75 శాతం ఓ.సి ఉమెన్‌ కోటా క్రింద మెరిట్‌లో                  ఉండడం జరిగినదని, తనకంటే తక్కువ శాతం ఉన్న వ్యక్తిని సెలక్ట్‌ చేయడం జరిగినదని విచారణ చేసి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్య నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి సూచించారు. 
‘‘గ్రీవెన్స్‌ డే’’ లో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌.మదుసూదన్‌, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా సైనిక బోర్డు సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ సైనికుల కుటుంబాలకు, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారం, పథకాలు అమలుచేస్తున్నదని తెలిపారు.మునిసిపల్, పంచాయతీల నుండి ఆస్తి పన్ను మినహాయింపు విషయమై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. బకాయిల మొత్తానికి మినహాయింపు ఉత్తర్వులు సంబంధిత అధికారులు జారీచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గ్యాలంటరీ అవార్డ్ గ్రహీత ఎన్. రోశయ్య కు నగదు గ్రాంట్ చెల్లింపుకు చర్యలు చేపట్టాలన్నారు. గన్ లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసిన మాజీ సైనికుల దరఖాస్తుల పరిష్కారం వెంటనే అయ్యేలా చూడాలన్నారు. మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన వారికి ప్రత్యేకంగా ఉద్యోగ మేళా నిర్వహించాలన్నారు. జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని డబల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో మాజీ సైనికులకు 2 శాతం ఇండ్ల కేటాయింపులు చేపట్టాలన్నారు. స్వయం ఉపాధికల్పనకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం పై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాజీ సైనికులకు కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జిల్లా ఇంచార్జ్ సైనిక సంక్షేమ అధికారి శ్రీరామ్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. బి. మాలతి, డిఆర్డీవో విద్యాచందన, డిపివో అప్పారావు, డిపిఆర్వో ఎం.ఏ. గౌస్, నాన్ అఫీషియల్స్ కె. నవీన్, ఎస్.ఎం. అరుణ్, వై. రామకృష్ణ, కె. నరేష్, ఎల్. భాస్కర్, పి. రవి మారుతి, అధికారులు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment