Monday, 23 October 2023

*కన్నుల పండుగగా స్వామి వారి పారు వేట. .*పాల్గొన్న మంత్రి పువ్వాడ, కుటుంబ సభ్యులు..*



ఖమ్మం: విజయదశమిని పురస్కరించుకుని ఖమ్మం శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి పారు వేట కన్నుల పండుగగా జరిగింది.రేవతి సెంటర్లో గల ఆలయ మెట్ల వద్ద అర్చకుల అధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పారువేటలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పల్లకి ని ఎత్తుకుని స్వామి వారి పారు వేటను ప్రారంభించారు.అక్కడి నుండి నెహ్రూ నగర్, వైరా రోడ్డు, జెడ్పీ సెంటర్ మీదగా జమ్మిబండ వరకు స్వామి వారు భక్తులకు దర్శనమిస్తూ జమ్మిబండ్ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం(గుట్ట) పారువేట స్థలంకు చేరుకున్నారు.ఈ సందర్భంగా శ్రీ దుర్గా దేవి అమ్మ వారికి మంత్రి దంపతులు అజయ్ కుమార్, వసంత లక్ష్మీ, తనయుడు, కోడలు Dr. నయన్, అపర్ణ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ  సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..ఖమ్మం శాసన సభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి స్వామి వారి పారువేట సేవ, శమీ పూజ, అమ్మ వారి వద్ద పూజ, రావణ దహనం నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నానని అన్నారు.స్వామి వారి పారుసేవలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు నాకు మంచి ఆరోగ్యం, విజయం ఇవ్వడం వల్లే వారు దయ తోనే ఖమ్మంను ఇంత అభివృద్ది చేయగలిగా అని అన్నారు. ఇలానే ఆ స్వామి వారి దీవెనలు మన ఖమ్మం ప్రజలపై ఉండాలని, వారి చల్లని కరుణ మనందరిపై ఉండాలని కోరుకుంటూన్నానని అన్నారు. అనంతరం రావణ దహనం చేశారు.విజయాలను చేకూర్చ విజయదశమి ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని, ఇంటిల్లిపాది ఆనందోత్సాహాల మధ్య ఎంతో వేడుకతో ఈ పండుగను జరుపుకోవాలనిఆకాంక్షించారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు(చిన్న), గోలి అనూప్, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, దాదే అమృతమ్మ సతీష్, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరిరావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, సింగు శ్రీను, మందడపు రమా రావు, సత్యాల మధు, కణతాల నర్సింహా రావు, ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment