భద్రతా ఏర్పాట్ల పరిశీలన
రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల కోసం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను సీవీఎస్వో నరసింహ కిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ మలికా గార్గ్ కలిసి పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గాలను తనిఖీ చేశారు. మాడ వీధులతోపాటు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై విజిలెన్స్, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వీరి వెంట టీటీడీ నిఘా, భద్రతా అధికారులు, తిరుమల పోలీసు అధికారులు ఉన్నారు.
TTDs CVSO and SP conducted an inspection of the mada streets in Tirumala in preparation for the upcoming Radhasapthami festival."
No comments:
Post a Comment