ఖమ్మం, ఏప్రిల్ 22: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 లో 938 వ ర్యాంక్ సాధించిన జిల్లాకు చెందిన సాయి అలేఖ్య సోమవారం నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సాయి అలేఖ్య ను అభినందించి సత్కరించారు. సాయి అలేఖ్య బోనకల్ మండలం, గోవిందాపురం (ఎల్) గ్రామ వాస్తవ్యులు కాగా, ఆమె తండ్రి పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేయుచున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, సాయి అలేఖ్య తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment