కేంద్ర మంత్రి రామ్మోహన్ డబ్బులు కట్టాలని.. కేంద్రం నుండి తేవాలని ఏ.పి.ముఖ్యమంత్రి చంద్రబాబు అనడంతో అక్కడ నవ్వులు పూసాయి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నియోజకవర్గం ఈదుపురంలో దీపం పథకం 2 ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఈదుపురం చేరుకున్న చంద్రబాబు నాయుడు, ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్; కెంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఇతర అధికారులతో కలిసి అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు అక్కడ వారి కుటుంబానికి దీపం 2 పథకం కింద సిలిండర్ అందజేశారు. మీ ఇంటికి గ్యాస్ తీసుకొని వచ్చాను అని చంద్రబాబు వారితో అనడంతో చంద్రబాబుకి శాంతమ్మ, కుటుంబ సభ్యులు నమస్కరించారుఅనంతరం శాంతమ్మతో ఇంట్లో పాలు ఉన్నాయమ్మా మంత్రులందరూ మీ ఇంటికి వచ్చారు కాఫీ పెట్టి ఇస్తావా అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పోయి వెలిగించి పాలు పెట్టి టీకా కాచారు.. శాంతమ్మ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడిన చంద్రబాబు అక్కడ జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ మంజూరు చేశారు. టీకాచేసమయంలోనే దీపం 2 పథకానికి డబ్బులు కేంద్రం నుంచి వచ్చేలా చూడాలంటూ రామ్మోహన్ కు చెప్పారు..
No comments:
Post a Comment