ప్రకృతి కన్నీరు పెట్టుకుంది
కంటిపాపల చూసే రామయ్య తమలో కలిసిపోయాడని తెలిసి ప్రకృతి కన్నీరు పెట్టుకుంది.. మొక్కల పెంపకంలో అలసట ఎరుగక
ఎండనక వాననక.. అణువణువు పచ్చదనం నింపేందుకు పరితపించిన వనజీవి రామయ్య ఇకలేడు..
ఆకుల రెపరెపలే తన శ్వాసగా జీవించి కోటి మొక్కలకు ఊపిరి పోసిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతికి సంతాపం
మణికుమార్ కొమ్మమూరు
సీనియర్ జర్నలిస్ట్, ఖమ్మం
వనజీవి పద్మశ్రీ రామయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో దరిపెల్లి రామయ్య ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం
చిన్ననాటి నుండి మొక్కల పెంపకం పై దృష్టి సారించిన రామయ్య స్వచ్ఛందంగా కోటికి పైగా మొక్కలను నాటి పర్యావరణం పై ప్రజలు అవగాహన కల్పించేందుకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ప్రకృతి పట్ల ఆయన బాధ్యతకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించిందివనజీవి రామయ్య మృతి పట్ల ప్రకృతి ప్రేమికులు.. పలువురు రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
No comments:
Post a Comment