Tuesday, 29 April 2025

ఎందుకు వచ్చావు అమ్మ సమస్య ఏమిటి : మంత్రి పొంగులేటి....


 వరంగల్ నగరంలోని  నాని గార్డెన్స్ లో భూభారతి చట్టం-2025 అవగాహన  కార్యక్రమంలో పాల్గొనడానికి  వేదిక వద్దకు చేరుకున్న  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడే ఒక వృద్ధురాలు కాగితం చేతిలో పట్టుకొని దీన స్థితి లో ఏదో అవసరం కోసం వేచి చూస్తున్నట్లుగా  ఉండడాన్ని గమనించిన మంత్రి స్వయంగా వేదిక పై నుండి నిలబడి ఆ వృద్ధురాలిని వేదిక మీదకు ఆప్యాయం గా పిలిచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా.. అని సమస్యను గురించి ఆరా తీయగా..  ఆ వృద్ధురాలు బదులిస్తూ తన పేరు వేల్పుల ఊర్మిళ అని 41 వ డివిజన్ శంభునిపేటలో తన నివాసమని, తన మనవరాలు వేల్పుల లిటి ఇటీవల 4 వ తరగతి పూర్తి చేసుకుని సెయింట్ గాబ్రియల్ పాఠశాలలో 5 వ తరగతి లో ప్రవేశానికి పరీక్ష రాసి  సీటు సాధించడం జరిగిందని, కానీ లిటి తల్లిదండ్రులు మనస్పర్ధల వల్ల  వేరు  గా ఉంటున్నారనీ, తన మనవరాలికి  సీటు దక్కినప్పటికిని  చదివించే స్తోమత తనకు లేదని మంత్రి వద్ద వాపోగా, వెంటనే స్పందించిన మంత్రి పొంగురేటి శ్రీనివాసరెడ్డి బాలిక చదువు కోవడానికి అయ్యే వ్యయాన్ని భరిస్తానని అక్కడికక్కడే ప్రకటించారు. దీంతో మనవరాలి చదువు సమస్య తీరడంతో వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేసింది.
**********************************************

*ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భేటీ అయిన భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య,  డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు*

ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు 

తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరిన ప్రతినిధులు 

వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తున్నటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపిన ప్రతినిధులు 

ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్న ప్రతినిధులు

ఆపరేషన్ కగారు నివారణకు కృషి చేయాలని మంత్రి సీతక్కను విజ్ఞప్తి చేసిన ప్రతినిధులు

*సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క*

*మంత్రి సీతక్క*

ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగం లోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయి. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలిబల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలనీ ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నాను. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు
ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తాను
ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారుమావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలిరెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయి

No comments:

Post a Comment