Sunday, 28 February 2021

చంద్రబాబు కుప్పం టూర్ ఫెయిల్యూర్, చంద్రబాబుని చీ కొట్టిన కుప్పం ప్రజలు - శైలజ చరణ్ రెడ్డి*



చంద్రబాబును రాష్ట్ర ప్రజలే కాకుండా చిట్టచివరకు కుప్పం ప్రజలు కూడా ఛీ కొట్టిన బుద్ధి లేకుండా చంద్రబాబు తో పాటు తన పుత్రుడు  లోకేష్  మరియు  దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ లు బుద్ధిలేని స్టేట్మెంట్స్ ఇస్తున్నారని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శైలజా చరణ్ రెడ్డి మండిపడ్డారు
ఆడలేక మద్దెల దరువు అన్నట్టు వైఎస్ఆర్సిపి కి వస్తున్న ప్రజా బలాన్ని తట్టుకోలేక  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన మరియు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని, ముందు తప్పులను సరి చేసుకొని క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు

అర్హతలేని వారిని ప్రజలు అందలం ఎక్కిస్తే అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకున్న దొంగలు సైతం పదవీ కాలం ముగిసిన కూడా ఈరోజు అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా ఆమె హెచ్చరించారు.

చంద్రబాబు కుప్పం టూర్ ఫెయిల్యూర్ అయిందని చంద్రబాబు ఏ మారుమూల నియోజకవర్గం అయినా వెతుక్కోవాల్సిన దిగా శైలజ చరణ్ రెడ్డి సూచించారు

Wednesday, 24 February 2021

GOLD SHANKU AND CHAKRA DONATED...


Devotee from Tamilnadu Sri Tangadurai has donated golden Shanku & Chakra icons weighing 3.5 kgs and worth Rs.2 crores on Wednesday.
He handed over the ornaments to Srivari temple DyEO Sri Haridranath at the Ranganayakula mandapam.

Tuesday, 23 February 2021

SRIVARI SEVAKULU SHOULD PARTICIPATE IN TTD DHARMIC ACTIVITIES- TTD ADDL. EO_____________!

Tirumala...
While appreciating the devoted services of Srivari Sevakulu, TTD Additional Sri AV Dharma Reddy called upon them to participate in TTD dharmic activities in their respective home turfs and extend their services as Custodians of Santana Dharma (Seva Dal).
Addressing the Srivari Sevakulu at Srivari Seva Sadan on Tuesday he said TTD aimed to utilise the services of Srivari Sevakulu in all its programs for promoting Sanatana Hindu dharma across the country by taking up unique programmes live Srinivasa Kalyanams, Kalyanamastu mass marriages for poor couple etc.

He was in all praise for Srivari Sevakulu who had rendered dedicated service during Ratha Sapthami at Tirumala held during last week, spiritual programs at organised by TTD at Kurnool, Visakhapatnam and Nellore etc.  
Referring to legends and Puranas, he spoke highly of Srivari Sevakulu as favourites of Lord Venkateswara and the lord always likes those who serve His bhaktas. He said Srivari Seva is a blessing for them to serve devotees for a week’s time at Tirumala.

He urged them to spread information about facilities and their experiences at Tirumala in their regions and inspire more youth and devotees to enlist as Srivari Sevakulu.

TTD SE-2 Sri Nageswara Rao, EEs Sri Subramaniam, Sri Mallikarjuna Prasad, Sri Jaganmohan Reddy, DE (Electrical) Smt Saraswati, AEO Srivari Seva Sri Ramakanth Rao and others were present.

Wednesday, 17 February 2021

KALYANAMASTHU LAGNA PATRIKA RECEIVES TIRUMALA LORD’S BLESSINGS


The team of Vedic Pundits fixed the auspicious dates of the Kalyanamastu mass marriage programme and handed over the Lagna Patrika to the TTD Executive Officer Dr KS Jawahar Reddy on Wednesday.
The Pundits team comprising of veteran Vedic scholar Sri G Bala Subramanya Shastri, Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani, Chief Preist of Tirumala temple Archakam Sri Venugopala Deekshitulu and former Agama Advisor of TTD Sri Vedantam Sri Vishnu Bhattacharya met on Wednesday morning at Nada Neeranjanam platform to deliberate and finalise the Muharat for the prestigious program.
Later the Pundits team handed over the Lagna Patrika to TTD EO Sri Jawahar Reddy. Speaking to media persons on the occasion, the EO said, the Pundits team after detailed discussions, have finalized three auspicious dates in the year 2021 including May 28 on Vaishaka Bahula Vidiya Friday Mula nakshatram, Simha lagnam between 12.34pm and 12.40pm, October 30 on Aswiyuja Bahula Paksha Tatkala Dasami Saturday Mukha nakshatram of Dhanur lagnam between 11.04am and 11.08 am, November 17, Karthika Shukla Paksha Tatkala Chaturthi Wednesday Ashwini Nakshatram and Dhanur lagnam between 9.56am and 10.02 am. He said the Kalyanamastu programme is aimed at organising free mass marriages to the poor couple. The programme was successfully conducted in six phases between 2007 and 2011 as part of the Hindu Sanatana Dharma Pracharam programme. TTD Trust Board under the Chairmanship of Sri YV Subba Reddy has decided to relaunch this programme during last board meeting and now the pundits have finalized the dates, he added.
Later the trays consisting of sacred material including Lagna Patrika, vermilion, turmeric, kankanams, fruits etc. were carried overhead by TTD EO, Additional EO and other pundits, As per practice the Lagna Patrika was placed at the lotus feet of Sri Venkateswara inside Srivari temple and offered special pujas.

HDPP Secretary Acharya Rajagopalan, Srivari Temple DyEO Sri Harindranath, VGO Sri Bali Reddy and others were also present.

Tuesday, 16 February 2021

బాసరలో భక్తుల సందడి.. వైభవంగా వసంత పంచమి వేడుకలు... బాసర సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి


ప్రసిద్ద పుణ్య‌క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 
అమ్మవారి సేవలో..పలు సమితీల సేవకులు..
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి కుటుంబ స‌మేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమ‌ర్పించారు.అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఆల‌య అధికారులు, త‌దిత‌రులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై  ఆలయ అధికారులతో మంత్రి చర్చించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

Tuesday, 9 February 2021

తిరుమలలో ఫిబ్రవరి 19 న రధసప్తమి వేడుకలు నిర్వహించనున్న టీటీడీ...

తిరుపతి

.తిరుమలలో ఫిబ్రవరి 19 న రధసప్తమి వేడుకలు నిర్వహించనున్న టీటీడీ...

రధసప్తమి వేడుకల్లో ఏడూ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివనున్న గోవిందుడు..
ఉదయం సూర్య ప్రభ వాహనంతో మొదలై చద్రప్రభ వాహనంతో ముగియననున్న రధసప్తమి వేడుకలు....

రధసప్తమి రోజు దర్శనం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్న టీటీడీ...

మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలో జరిగే చక్రస్నాన వేడుకలు ఏకాంతం...

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం       ఉదయం      5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.38 గంట‌ల‌కు)

చిన్నశేష వాహనం          ఉదయం         9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం              ఉదయం         11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం     మధ్యాహ్నం   1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం                   మధ్యాహ్నం     2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు

కల్పవృక్ష వాహనం         సాయంత్రం   4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం    సాయంత్రం   6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం        రాత్రి                 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

Monday, 8 February 2021

ఈ మీడియా సంస్థలో ఉద్యోగం కావాలంటే.... "ధరకాస్తు ఛార్జీలు..రూ.200/-" చెల్లించాల్సిందే..

న్యూస్‌టైమ్‌కు దరఖాస్తుచేసేందుకు నేడే ఆఖరు https://newstime.in/new-jobs-in-journalism/#.YCCxS-4RpKI.
పై ప్రకటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది...అయితే ఈ సంస్థలో ఉద్యోగం కావాలంటే
ధరకాస్తు ఛార్జీలు..రూ.200/- చెల్లించాల్సిందే...
ప్రైవేటు ఉద్యోగానికి ధరకాస్తు ఫీజు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా. మీడియా సంస్థలో ఉద్యోగం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ లింక్..
ప్రభుత్వ ఉద్యోగం తరహాలో..ఆన్లైన్ ధరఖాస్తు..
ఫోటో.. ఆధార్.. సహా అన్ని పక్కాగా రాయలి..
పూర్తి చేసేశాం ఉద్యోగం వచ్ఛేసిందనుకుంటే. వాట్స్ఆప్ లో కాలేసినట్టే.. ప్రభుత్వ ధరకాస్తుకు కట్టినట్లు ఫీజు 
ఓ రూ.200/- అక్షరాల రెండు వందల రూపాయలు..
UPI చెల్లింపులు చేసేసెయాలి. 
అసలు ఈ ప్రకటన నిజమో అబద్దమో తెలీదుగాని..
విధ్యార్థులే ప్రధాన టార్గెట్గా యూనివర్సిటీలలో బాగా సర్కులేట్ అవుతోంది.. ఇంటర్నెట్ ద్వారా.. యువత ఉద్యోగ బలహీనతను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఇలా మార్కెటింగ్ చేస్తున్నారనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తుండగా...
Newstime.in  పేరుతో ఓ సైట్. వుందని.. కాని..
ఈ ధరఖాస్తు వారికి చెందినదో కాదో చెప్పలేమని మరికొందరు మీడియా రిలేషన్ వ్యక్తులు పేర్కంటున్నారు..
ఈ ధరకాస్తు ప్రకటన నిజమో అబద్దమో తెలాల్సివుంది.. కాగా ధరకాస్తు ధరునితో పాటు నామిని పేరు నమోదు చెయమనడం కొసమెరుపు

Saturday, 6 February 2021

అంతర్వేదిలో రధసప్తమి నుండి వార్షిక కళ్యాణోత్సవాలు..


"శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య తిరు కల్యాణమహోత్సవములు"
స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ సప్తమి శుక్రవారం నుండి మాఘబహుళ పాద్యమి ఆదివారం వరకు అనగా
ది.19.02.2021 నుండి ది.28.02.2021వరకు జరుగును.

   © కార్యక్రమల వివరాలు ©

✓ 19.02.2021 శుక్రవారం రథసప్తమి :-

• సా౹౹ గం౹౹ 4.30 లకు "సూర్య వాహనము పై గ్రామోత్సవము.

• సా౹౹ గం౹౹ 6.30 ని౹౹లకు ధూపసేవ అనంతరం "ముద్రికాలంకరణ"(శ్రీ స్వామివారిని పెండ్లికుమారుని,అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట )అనంతరం "చంద్రప్రభ వాహనము" పై గ్రామోత్సవము.

✓ 20.02.2021 శనివారం అష్టమి :-

• సా౹౹ గం౹౹ 4.00 లకు "గరుడ పుష్పక వాహనము" పై గ్రామోత్సవము.

• రాత్రి 7 గం|| ని "పుష్పక వాహనము పై గ్రామోత్సవము.

✓ 21.02.2021 ఆదివారం నవమి :-

• సా౹౹ గం౹౹ 4.00 లకు "హంస వాహనము" పై గ్రామోత్సవము.

• రా౹౹ గం౹౹ 6:30 లకు   థూపసేవ అనంతరం ధ్వజారోహణం అనంతరం "శేష వాహనము" పై గ్రామోత్సవము.

✓ 22.02.2021 సోమవారం దశమి :-

• సా౹౹ గం౹౹ 4.00 లకు "పంచముఖ ఆంజనేయస్వామి వాహనము" పై గ్రామోత్సవము.

• రాత్రి౹౹ గం౹౹ 8.00 లకు  "కంచు గరుడ వాహనము" పై గ్రామోత్సవము అనంతరం

✓✓ రాత్రి౹౹ గం౹౹ 11:19 ని౹౹లకు ఆరుద్ర నక్షత్రయుక్త తులా లగ్న పుష్కరాంశమందు "శ్రీస్వామివారి తిరు కల్యాణ మహోత్సవము.✓✓

✓ 23.02.2021  మంగళ వారం ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) :-

• మధ్యాహ్నం గం౹౹ 2.30 ని౹౹లకు "శ్రీస్వామివారి రధోత్సవము"

✓ 24.02.2021 బుధవారం ద్వాదశి :-

• సా౹౹ గం౹౹ 4.00 లకు "గజ వాహనము" పై శ్రీవారి గ్రామోత్సవము.

• సా౹౹ గం౹౹ 5.30 ని౹౹ల నుండి గం౹౹ 7.00 వరకు శ్రీస్వామివారి సన్నిధి శుద్ధి చేయుటకు గాను దర్శనములు నిలిపివేయబడును.

• రాత్రి 7.00 గం౹౹లకు "అన్నపర్వత మహానివేదన" అనంతరం దర్శనములు,"పొన్నవాహనము" పై గ్రామోత్సవము.

✓ 25.02.2021 గురువారం త్రయోదశి :-

• మ౹౹ గం౹౹ 4.00 లకు "హనుమద్వాహనము" పై శ్రీవారి గ్రామోత్సవము.

• సా౹౹ గం౹౹ 5.00 లకు "సదస్యం"

•సా౹౹ గం౹౹ 6.30 ని౹౹లకు ధూపసేవ అనంతరం, రాత్రి 7.00 గం౹౹లకు "సింహవాహనము" పై గ్రామోత్సవము.

✓ 26.02.2021 శుక్రవారం, చతుర్దశి:-

• సాయంత్రం 4 గంటలకు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవం.
• రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై గ్రామోత్సవం. 16 స్థంభములు మండపం వద్ద "చోరసంవాదం"

✓27-02-2021  శనివారం, మాఘ పౌర్ణమి :- చక్రవారి,( సముద్ర స్నానం )

• ఉదయం గం౹౹ 8.30 లకు "  పుష్పక వాహనము" పై శ్రీ స్వామివారి గ్రామోత్సవము"చక్రవారి" " అవభృధోత్సవము" సముద్ర స్నానం.

• రాత్రి "ధ్వజ అవరోహణ"

✓ 28.02.2021 ఆదివారం మాఘ బహుళ పాఢ్యమి :-

• సా౹౹ 4.00 గం౹౹లకు "పుష్పక వాహనము" పై గ్రామోత్సవము.

• సా౹౹ 6.00 గం౹౹లకు అంతర్వేది గ్రామ చెరువులో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో చేసిన "హంస వాహనము" పై బ్రహ్మండమైన బాణసంచా కాల్పులతో శ్రీ స్వామివారి మరియు శ్రీ అమ్మవార్ల " తెప్పోత్సవము" 

•రాత్రి 8.00 గం౹౹లకు ఉత్సవరులకు తిరుమంజనములు,దర్పణసేవ,ధూపసేవ,ద్వాదశతిరువారాధన,విష్వక్సేనఆరాధన, పుణ్యాహవచనం,"శ్రీ పుష్పోత్సవము"చేగోలం విన్నపము,తీర్ధగోష్ఠి,శ్రీ స్వామివారి పవళింపు సేవ.

👉మిత్రుని కష్ణం విని చలించిన ఎంఎల్.సి.రాజేశ్వరరెడ్డి... 👉సాయం అందజేత..నేనున్నా అంటూ బరోసా.....

ఖమ్మం...
స్నేహం అంటే భుజం మీద చేయివేసి నడవడమే కాదు..  నీకెన్ని కష్టాలు వచ్ఛినా నీ వెనుక  నేనున్నా అని తట్టి చెప్పడం.. ఈ మాటలనే ఆచరణలో చూపారు.. 
#పల్లా రాజేశ్వరరెడ్డి#

వివరాలోకి వెళితే..
 అనారోగ్యంతో బాధపడుతున్న చిన్ననాటి మిత్రుడు రంగా నారాయణ   పరిస్థితి తోటి మిత్రుల ద్వారా తెలుసుకున్న తెరాస ఎం.ఎల్.సి..పల్లా రాజేశ్వరరెడ్డి.. మిత్రుల ద్వారా..ఆర్థిక సాయం.అందజేసి స్నేహం విలువలను మరోమారు చాటారు..
రంగా నారాయణ...ఉన్నత కుటుంబంలో పుట్టి బాగా బతికిన నేపథ్యంలో.. సుమారు  8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ రూపంలో వచ్ఛిన ఆపద  కేవలం మంచానికి పరిమితం చేసింది.
దీంతో ఆ కుటుంబం జీవనానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి..
తల్లి చెల్లెలు మాత్రమే వున్న నారాయణ ప్రమాదంతో శరీరకంగా..మనసికంగా..ఆర్థికంగా..కృంగిపోయాడు..ఇటీవలే తల్లి మరణించగా... ప్రస్తుతం.. తనకు..చెల్లెలికి వచ్ఛే ప్రభుత్వ పింఛన్ లతో అత్యంత ఇబ్బంది కరంగా ఖమ్మం నగరంలోని.. పిల్లిచిన్నక్రిష్ణ వీధిలో.. వాసవిగార్డన్ ఏరియాలో.. అద్దే గదిలో వుంటూ జీవనం గడుపుతున్నాడు..
రంగా నారాయణ విధ్యార్థి దశలో..పల్లా రాజేశ్వరరెడ్డితో  మౌంట్ ఫోర్డ్ స్కూలులో కలసి చదివారు ..గతంలో నారాయణ ఇబ్బందులు తెలుసుకున్న  పల్లా రాజేశ్వరరెడ్డి.. మిత్రుల.. ద్వారా కొంత మొత్తాన్ని  రెండు దఫాలుగా అందజేశారు.. కాగా.. శుక్రవారం మరోసారి మిత్రుల ద్వారా ఆర్థిక సాయం అందజేసి ధైర్యంగా వుండాలంటూ సందేశం పంపారు...గతంలో కూడా పలువురికి రాజేశ్వరరెడ్డి గారు ఇదే విధంగా తన అపన్నహస్తం అందించారని సన్నిహితులు పేర్కొన్నారు.

Friday, 5 February 2021

TTD CHAIRMAN INSPECTS VARIOUS PLACES AT TIRUMALA...

Tirumala....
TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Friday inspected four Mada streets, Laddu counters, Annaprasadam Complex at Tirumala and personally observed the amenities being extended to pilgrims after the relaxation of Covid 19 restrictions by interacting with the pilgrims.
Later he also inspected Annaprasadam Complex and verified Annaprasadam preparation, serving of food to pilgrims and cleaning process. The Chairman also rendered Annaprasadam Service to pilgrims and interacted with them over the quality of food. The pilgrims expressed immense satisfaction over the taste of Annaprasadam. The Chairman instructed the officers concerned to ensure measures not to waste food while serving Annaprasadam to devotees.

INSPECTS MADA STREETS
As the Radha Sapthami festival is in offing, the Chairman also inspected four Mada steets to see the arrangements. After Covid relaxation, this is the first mega fete TTD is going to host this year. In this connection, the Chairman discussed with the officials on how to allow pilgrims to the galleries following all Covid guidelines.
The Chairman also inspected the Laddu counters and verified the butter covers. Later he also inspected the new Potu which is under completion. He said the new Potu building which was a contribution by India Cements will soon be inaugurated.
Temple DyEO Sri Harindranath, VGO Sri Bali Reddy, Potu AEO Sri Srinivas, AVSO Sri Gangaraju were also present.

Tuesday, 2 February 2021

జగదానందకారకుడు.... ఇంగిత సంగీత వాగ్గేయకారుడు త్యాగయ్య...


Saint Tyagaraja - also known as Tyāgayya  
Birth name - Kakarla Tyagabrahmam
Born - 4 May 1767
Thiruvarur, Thanjavur Maratha kingdom
Died - 6 January 1847 (aged 79)
Thiruvayaru, Tanjore district,
Madras Presidency
త్యాగరాజు, ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వారే మన త్యాగయ్య కూడా. ప్రతి సంవత్సరం తిరువుయ్యూరు లో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలు లో బృందంగా దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖ గాయకులు త్యాగరాజ కీర్తనలు గానం చేస్తారు.
త్యాగరాజు, కాకర్ల త్యాగ బ్రహ్మం (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. అతను కీర్తనలు శ్రీరాముని పై అతనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.
బాల్యం, విద్యాభ్యాసం
త్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందు గల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.
జీవిత విశేషాలు
త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగ పరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. వారు జీవితమంతయూ ఊంఛవృత్తిని అవలంబించి సామాన్యముగా చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి. త్యాగరాజువారు మంచి వైణికులు కూడా.

18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ అతను 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత అతను పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ అతను ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

సంగీత ప్రతిభ
త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.

తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.

త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, "స్వరార్ణవము" ఇచ్చాడనీ, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని "స్వరరాగ సుధారసము" అను కృతిలో ఈ గ్రంథము గురించి త్యాగయ్య పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. "దివ్యనామ సంకీర్తనలు", "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించెను. "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.

త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు సవరించు
త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత అతను వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము

త్యాగరాజ ఆరాధనోత్సవాలు
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు.ఇతను జన్మదినం రోజుని భారతియ సంగీత దినొత్సవంగా జరుపుతాము. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్లో అతను సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

అతను భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత అతను నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి అతను సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు అతను రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల అతను సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల, సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.

సమాధి
త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని నాటగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.

రచనలు
రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణవం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

కీర్తనలు
త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలావరకు అతను మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', 'నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు. 

త్యాగయ్య గారు క్షేత్రములకు వెళ్ళునపుడు, ఆయా క్షేత్రము మీదను, క్షేత్రములోని దేవుని మీదను కృతులు రచించెను. అవి యేవనిన:

కొవ్వూరు పంచరత్నములు
(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామి పై వ్రాసిన ఐదు కృతులు). ఈయన పంచరత్న కీర్తనలు, సంగీతం మీద త్యాగయ్య పట్టును వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్య నామ సంకీర్తనలు కూర్చాడు.

పంచరత్న కీర్తనలు
త్యాగరాజ స్వామి వారి కీర్తనలలో ఉత్తమమైనవిగా విద్వాంసుల చేత నిర్ణయించబడినవి పంచరత్న కీర్తనలు...అవి.

జగదానంద కారక - నాట రాగం
దుడుకుగల - గౌళ రాగం
సాధించెనె - ఆరభి రాగం
కనకనరుచిరా - వరాళి రాగం
ఎందరో మహానుభావులు - శ్రీ రాగం

కీర్తన
పల్లవి 
ఎందరో మహానుభావులు అందరీకి వందనములు ॥ఎందరో॥

అనుపల్లవి 
చందురు వర్ణుని అందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా ॥రెందరో॥
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా ॥రెందరో॥
సరగుస బాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥
పతితపావనుడనే పరాత్పరు గురించి
బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును,
సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥
హరి గుణమణులగు సరములు గళమున
శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో
గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥
హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా
గనుల జూచుచును, పులకశరీరులయి ముదంబునను యశముగలవా
పయోధి నిమగ్నులయి ముదంబునను యశముగలవా ॥రెందరో॥
ప్రేమ ముప్పిరిగొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజ సుతునికి నిజరామ ॥రెందరో॥

Monday, 1 February 2021

ఆమే కర్తవ్యానికి జెజేలు అంటున్న జనం


విజయనగరం: 
ఆమేలో మనవత్వం పరిమళించింది..అన్ని వర్గాల అభినంధనలు అందుకుంటోంది
 ఓ అనాథ శవాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తన భుజాలపై రెండు కిలోమీటర్లు మేర మోసుకుంటూ శిరీష వెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్సై శిరీషను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. త్వరలో శిరీషకు ప్రశంసా పత్రాన్ని డీజీపీ అందజేయనున్నారు.  కాశీబుగ్గ ఎస్సై శిరీష.. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ  నడిచారు. అంతేకాదు, ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు. ఆమె మానవత్వాన్ని ప్రశంసిస్తూ పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. శిరీషను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవలను కొనియాడుతూ సెల్యూట్ మేడమ్ అంటూ ట్వీట్ చేశారు. ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని, ఇలాంటి పనులే చేయాలనే సమాజంలో... ఆమె ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారానికి, చేస్తున్న సేవకి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కాశీబుగ్గ మున్సిపాలిటీ లోని 2 వ వార్డులో  గల అడవికోత్తూరు పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని ఆనాధ మృతదేహన్ని ఎస్ఐ శిరీష కాశిబుగ్గ లలిత చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయంతో తన భుజాలపై పొలం గట్ల నుండి మోసుకొని రహదారి ప్రదేశానికి తీసుకు వచ్చారు.అనంతరం లలిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు.

Inspiring 🙏👏