విజయవాడ..
ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది.ఈ సందర్భంగా దుర్గమ్మ కు బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలను భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు సమర్పించారు.
బంగారు బోనం సిరస్సుపై ధరించి దారి పొడవునా న్రుత్యాలు చేస్తూ దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రాంతం మార్మోగింంది.
జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ
కమిటీ సభ్యులకు తొలుత స్వాగతం పలికిన దుర్గగుడి ఈవో భ్రమరాంబ, చైర్మన్ పైలా సోమినాయుడు
అనంతరం జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపుగా ఘాట్ రోడ్డుమీదుగా డప్పు వాయిధ్యాలు, వివిధ కళాకారులతో జాతరగా సాగిన దుర్గమ్మ కు బోనం సమర్పణ చేశారు.
No comments:
Post a Comment