Saturday, 29 January 2022

జాతరపై తెలంగాణ మంత్రుల క్లారిటీ.... ఏర్పాట్లపై సమీక్ష.. ఏరియల్ సర్వే... పాల్గొన్న సీతక్క...

ములుగు/మేడారం : 
మేడారం జాతరపై మంత్రులు స్పష్టత ఇచ్చారు. కరోనా నేపథ్యంలోనే జాతర జరపడానికి ఎలాంటీ అడ్డంకులు లేవని వారు స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిపారు
మేడారం జాతర ఏర్పాట్లపై శనివారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్,ఎర్రబెల్లి దయాకరరావు తదితరులతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం 350 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే కొన్ని డిపార్ట్ మెంట్లలో పనులు పూర్తయ్యాయి, ఇంకా మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 4వేల బస్సులు, పదివేల మంది సిబ్బందితో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

జంపన్న వాగులో స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామని, ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని మంత్రి వివరించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆదివాసి సంఘాలతో మాట్లాడతామని కూడా మంత్రి వెల్లడించారు..
◆ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శాశ్వత ప్రాతిపదికన మేడారంలో పనులు చేపట్టినట్టు తెలిపారు. మేడారం మహాజాతరకు కోటి ముప్పై లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రతీ భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆదివాసీల అభిప్రాయాలకు గౌరవం ఇస్తామని, వారి సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా చూస్తామన్నారు. కానీ కొందరు జాతరను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. అయినా ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగానే జాతర నిర్వహిస్తుందన్నారు. కాగా జాతర ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా నిధులు రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రద్ధతో జాతర నిర్వహణకు ఆదేశించారని చెప్పారు.
◆ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆదివాసి సంప్రదాయాలకు అనుగుణంగా జాతర నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పూజారుల మనోభావాలు గౌరవిస్తామని, ఆదివాసి, గిరిజన ఆరాధ్యదైవమైన జాతరకు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగనివ్వమని,అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు.

అంతకుముందు జాతర జరిగే ప్రదేశం, జంపన్న వాగు ను మంత్రులు అధికారులు  సందర్శించారు.

Thursday, 27 January 2022

కధ బాగుంది కాని కలేక్టర్ కాదంటున్నారు... డౌటైతే కేరళోని మల్లపురం కలక్టరేట్ నెంబర్ ఇచ్ఛేశాం...

_*కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు ...?*_అంటు వివిధ బాషల్లో ప్రచారంలో వున్న కేరళలోని మల్లాపురం జిల్లా కలేక్టర్ కధ నిజం కాదని తెలుస్తోంది.. కాని ఆ కధ వాస్తావానికి దగ్గరగా వుండటంతో నెటిజన్లను ఆకట్టుకుంది.. దీంతో భారిగా షేరింగ్ అవుతోంది ఏది ఏమైనా ఇలాంటి కధలో నాయిక ఓ మంచి అధికారిగా వాస్తవంలో వుండే అవకాశం కొట్టిపారేయలేము...

  మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు.

ఆమె చేతి గడియారం తప్ప మరే ఇతర నగలు ధరించలేదు.
చాలా మంది విద్యార్థులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఆమె ఫేస్ పౌడర్ కూడా ఉపయోగించలేదు.ప్రసంగం ఆంగ్లంలో ఉంది. ఆమె ఒకట్రెండు నిముషాలు మాత్రమే మాట్లాడింది, కానీ ఆమె మాటల్లో దృఢ నిశ్చయం ఉంది. అనంతరం చిన్నారులు కలెక్టర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు.
ప్ర: మీ పేరు ఏమిటి?
నా పేరు రాణి, సోయామోయి నా ఇంటి పేరు. నేను జార్ఖండ్ వాసిని.

ఇంకేమైనా అడగాలా?

ఒక సన్నని అమ్మాయి ప్రేక్షకుల నుండి లేచి నిలబడింది.
అడగండి..
"మేడమ్, మీరు ఎందుకు మేకప్ వేసుకోరు?"
కలెక్టర్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె సన్నటి నుదుటి మీద చెమట కారింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది.  ప్రేక్షకులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెరిచి కొంచెం నీళ్లు తాగింది.  తర్వాత విద్యార్థిని కూర్చోమని నెమ్మదిగా సైగ చేసింది. అప్పుడు ఆమె నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది.
మీరు ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారు. ఇది ఎప్పటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పలేని విషయం.  దానికి సమాధానంగా నా జీవిత కథ మీకు చెప్పాలి. నా కథ కోసం మీ విలువైన పది నిమిషాలు కేటాయించడానికి మీరు సిద్ధంగా ఉంటే నాకు తెలియజేయండి.
సిద్ధమే అన్నట్టు స్పందన వచ్చింది.

నేను జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతంలో పుట్టాను. కలెక్టర్ ఆగి పిల్లల వైపు చూసింది.

నేను కోడెర్మా జిల్లాలోని "మైకా" గనులతో నిండిన గిరిజన ప్రాంతంలో చిన్న గుడిసెలో పుట్టాను.మా నాన్న, అమ్మ మైనర్లు. నాకు ఇద్దరు అన్నలు మరియు ఒక చెల్లెలు ఉన్నారు. వర్షం పడితే కారుతున్న చిన్న గుడిసెలో మేము నివసించేవారం.వేరే ఉద్యోగం దొరక్కపోవడంతో నా తల్లిదండ్రులు తక్కువ జీతానికి గనుల్లో పనిచేసేవారు. ఈ పని చాలా దారుణం గా ఉంటుంది. నాకు నాలుగేళ్ల వయసులో మా నాన్న, అమ్మ, ఇద్దరు అన్నదమ్ములు రకరకాల జబ్బులతో మంచం పట్టారు.గనుల్లోని ప్రాణాంతక మైకా ధూళిని పీల్చడం వల్లే ఈ వ్యాధి వస్తుందని అప్పట్లో వారికి తెలియదు.నాకు ఐదేళ్ల వయసులో మా అన్నలు అనారోగ్యంతో చనిపోయారు.
చిన్న నిట్టూర్పుతో కలెక్టర్ మాట్లాడటం ఆపి, రుమాలుతో ఆమె కళ్ళు తుడుచుకున్నారు. చాలా రోజులు మా ఆహారంలో నీరు మరియు ఒకటి లేదా రెండు రోటీలు ఉంటాయి. నా సోదరులిద్దరూ తీవ్రమైన అనారోగ్యం మరియు ఆకలితో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కరెంటు, పాఠశాల, ఆసుపత్రి, మరుగుదొడ్డి లేని గ్రామాన్ని మీరు ఊహించగలరా?  .
ఒకరోజు నాన్న నన్ను పట్టుకున్నప్పుడు
ఆకలితో,ఎండిపోయిన నా చర్మం, ఎముకలాంటి నా చేతిని పట్టుకున్న నాన్నతో కలిసి టిన్ షీట్లతో కప్పబడిన ఒక పెద్ద గని వద్దకు పనికోసం వెళ్ళాను. కాలక్రమేణా ఖ్యాతి గడించిన మైకా గని.అది ఒక పురాతన గని,తవ్వి, తవ్వి, పాతాళం వరకు విస్తరించింది.దిగువన ఉన్న చిన్న చిన్న గుహల గుండా వెళ్లి మైకా ఖనిజాలను సేకరించడం నా పని.  పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే సాధ్యమైయ్యేది.నా జీవితంలో మొదటి సారి కడుపు నిండా రోటీలు తిన్నాను. కానీ ఆ రోజు నేను వాంతి చేసుకున్నాను. నేను ఫస్ట్ క్లాస్‌లో ఉండాల్సిన సమయంలో, నేను విషపూరిత దుమ్ము పీల్చుకునే చీకటి గదులలో మైకాను సేకరిస్తున్నాను. అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడటంతో దురదృష్టవంతులైన పిల్లలు చనిపోవడం,అప్పుడప్పుడు కొందరు ప్రాణాంతక వ్యాధులతో చనిపోవడం అక్కడ సర్వసాధారణం. రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఒకసారి భోజనానికి సరిపడా సంపాదించవచ్చు.  ప్రతిరోజు విషపూరిత వాయువులను పీల్చడం, ఆకలి కారణంగా నేను సన్నగా మారాను. ఒక సంవత్సరం తర్వాత మా చెల్లి కూడా గనిలో పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా నాన్న, అమ్మ, చెల్లి, నేను కలిసి పనిచేసి ఆకలి లేకుండా బతకగలం అనే స్థితికి వచ్చాము.
కానీ విధి మరో రూపంలో మమ్ముల్ని వెంటాడడం ప్రారంభించింది. ఒకరోజు నేను విపరీతమైన జ్వరంతో పనికి వెళ్ళనప్పుడు, అకస్మాత్తుగా వర్షం కురిసింది. గని బేస్‌లో ఉన్న కార్మికులపై గని కూలిపోవడంతో వందలాది మంది చనిపోయారు. వారిలో నాన్న, అమ్మ, చెల్లి ఉన్నారు.కలెక్టర్ రాణికి రెండు కళ్లలోనూ కన్నీళ్లు కారడం మొదలయ్యాయి.  ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి.అప్పుడు నాకు ఆరేళ్లు మాత్రమే
చివరికి ప్రభుత్వ అనాధ ఆశ్రమానికి వచ్చాను. అక్కడ నేను చదువుకున్నాను.  నేను నా మొదటి వర్ణమాలలను మా గ్రామం నుండి నేర్చుకున్నాను. ఇప్పుడు కలెక్టర్ గా మీ ముందు ఉన్నాను.
నేను మేకప్ ఉపయోగించక పోవడానికి దీనికి మధ్య సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు.ఆమె ప్రేక్షకులను చూస్తూ చెప్పడం కొనసాగించింది.

ఆ రోజుల్లో చీకట్లో పాకుతూ సేకరించిన మైకా మొత్తం మేకప్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారని నేను చదువుకొనే సమయంలోనే తెలుసుకున్నాను. మైకా అనేది ముత్యాల సిలికేట్ ఖనిజంలో మొదటి రకం. పెద్ద పెద్ద కాస్మెటిక్ కంపెనీలు అందించే మినరల్ మేకప్‌లలో, 20,000 మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టిన బహుళ-రంగు మైకా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.కాలిపోయిన కలలతో, ఛిద్రమైన జీవితాలతో, శిలల మధ్య నలిగిన మాంసాలతో, రక్తాలతో గులాబీ మెత్తదనం మీ చెంపల మీద విస్తరిస్తుంది. మిలియన్ల డాలర్ల విలువైన మైకా ఇప్పటికీ ఉపయోగించబడుతుంది, గనుల నుండి శిశువు చేతులను కైవసం చేసుకుంది.  మన అందాన్ని పెంచుకోవడానికి. ఎంతోమందిని బలిగొన్న,
నలిగిన పిల్లల చేతుల నుండి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ ని నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి?  ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపునిండా ఎలా తినగలను? ఉన్నన్నాళ్లు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో, కళ్లలోని కన్నీళ్లు తుడుచుకోకుండా, తల నిమురుతూ వెళ్లిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు.
(జార్ఖండ్‌లో ఇప్పటికీ అత్యంత నాణ్యమైన మైకాను తవ్వుతున్నారు. 20,000 కంటే ఎక్కువ మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండానే అక్కడ పని చేస్తున్నారు. అనేక మంది చనిపోతున్నారు కొండచరియలు విరిగిపడటం, కొన్ని వ్యాధుల కారణంగా)
ప్రొఫెసర్ పాతూరి సీతారామంజనేయులు గారు ఇంగ్లీష్ లో పంపిన సందేశానికి
తెలుగు అనువాదం నా మిత్రుడు
*-అభినయ శ్రీనివాస్* చేసారు...
నేను చదివిన తర్వాత మీకోసం సమర్పిస్తూ..
మీ  *రంగినేని మహేంద్ర*

ఆంగ్లంలో....

I read in a message about Rani Soyamoyi IAS.


She narrated her story during an interaction with students in a school when she was District Collector, Malappuram. A student was curious about her not so attractive dress, not wearing any ornaments and absolute absence of makeup. She said :

“I was born in a tribal district in Jharkhand to parents who were working in Mica Mines. Mines engage child labour and I started working in the mines from age 5. We lived in abject poverty. No electricity, no toilets. Parents, my elder brother, me and my sister lived in a small hut not protected even from rains. My brother became sick and inadequate food and absence of medical attention resulted in his death. When my younger sister became 5, she also started working with us in the mica mines. We started earning enough for our survival.

One day, I remained at home as I had a fever. That day, when my parents and sister were still inside the Mines, there was a flood and landfall inside the Mines and in the accident, over 100 workers including my parents and sister lost their lives.

As the only surviving child in the family, I reached a government orphanage where I got an opportunity to go to school. Now, I am standing before you.

Tell me, how I will wear an attractive dress and jewellery or use cosmetics made from mica collected from Mines by thousands of kids who starve and work when they should be in school?”

ప్రస్తుతం మణప్పురం కలెక్టర్ V.R.Premkumar IAS గారు. సామాజిక మాధ్యమంలో రాణి నయోమోయి అనే ఝార్ఖండ్ అమ్మాయి గురించిన ఒక కథనం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం లేదు...

Collector mallapuram +91 483 273 4355

Wednesday, 26 January 2022

మహాత్మా గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


ఖమ్మం : పులిపాటి ప్రసాద్ విద్యా సంస్థల అధినేత మరియు మహాత్మా గాంధీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆద్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కళాశాల నందు కోవిడ్ నిభంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహిచారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగము మరియు త్రివర్ణ పతాకము యొక్క విశిష్టత గురించి వివరించారు.ఈ కార్యక్రమము నందు కావ్య హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ కావ్యచంద్ యలమూడి  యలమూడి రవీందర్ డిడియూజికెవై మేనేజ్మెంట్ రమేష్ జ్యోతి మరియు పారమేడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రతాప్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ నాగ జ్యోతి, రాణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ మరియు అధ్యాపక బృంధం అమల, భాగ్యలక్ష్మి, అరుణ, మాధవి, అశ్విని, చంటి, సాయిశ్రీ, ప్రవీణ్, స్వాతి, రామకృష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tuesday, 25 January 2022

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం- రావత్​కు పద్మ విభూషణ్

Delhi : 25-01-2022
కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది . 
నలుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు
17 మందికి పద్మ భూషణ్‌ పురస్కారాలు
107 మందికి పద్మశ్రీ పురస్కారాలు భారత రాష్ట్రపతి చేతుల మీదగా అందుకోనున్నారు.
వారిలో ఇటీవల హెలికాప్టర్న ప్రమాదంలో మృతి చెందిన భారత త్రివిధ దళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించగా..
రాధేశ్యామ్‌ ఖేమ్కాకు పద్మ విభూషణ్‌ అవార్డు
రాధేశ్యామ్‌ ఖేమ్కాకు మరణానంతరం పద్మ విభూషణ్‌
కల్యాణ్‌ సింగ్‌కు పద్మ విభూషణ్‌ అవార్డు
కల్యాణ్‌ సింగ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డు
భారత్‌ బయోటెక్‌ సీఎండీ, జేఎండీలకు సంయుక్తంగా పద్మ భూషణ్‌
కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్‌
గులాం నబీ ఆజాద్‌ (జమ్ముకశ్మీర్‌)కు పద్మ భూషణ్‌
బుద్ధదేవ్‌ భట్టాచార్య (బంగాల్‌)కు పద్మ భూషణ్‌
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు పద్మ భూషణ్‌
గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు పద్మ భూషణ్‌
గరికపాటి నరసింహారావు ‍‌(ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
గోసవీడు షేక్‌ హసన్‌ (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
డా.సుంకర వెంకటఆదినారాయణ (ఏపీ)కు పద్మశ్రీ అవార్డు
దర్శనం మొగిలయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
రామచంద్రయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
పద్మజా రెడ్డి (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌కు పద్మశ్రీ అవార్డు
టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు పద్మశ్రీ

Sunday, 23 January 2022

కిక్కిరిసిన మేడారం.. కరోనా భయంతో ముందస్తుగా మొక్కులు....


మేడారం: మేడారం:ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఇంకా నెల రోజులు సమయం ఉండగానే భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సమయంలో రద్దీ, కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా చాలా మంది భక్తులు ముందుగానే అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. 

ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం చేరుకొని గంటల తరబడి క్యూలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చల్లంగా చూడు తల్లీ అంటూ  వేడుకుంటున్నారు._ఉమ్మడి వరంగల్‌ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు రద్దీగా మారుతున్నాయి. దర్శనాల అనంతరం పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మరోవైపు కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తులు నిబంధనలు పాటించాలంటూ మైకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లు పెంచడం సహా భక్తులు ఎక్కువసేపు క్యూలో ఉంచకుండా త్వరగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతునమ ఆదివారం మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి భక్తులు వేలాదిగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణ కట్టల వద్ద తలనీనాలు సమర్పించుకున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఐటీ కమిషనర్ బాలకృష్ణ, బీజేపీ నాయకుడు తీన్మార్ మల్లన్న వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే మూడు లక్షలకు పైగా భక్తులు మేడారాన్ని సందర్శించారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

Thursday, 20 January 2022

ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర


మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధం అవుతోంది.

ములుగు (డీ) తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనుంది.

కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా.

ఫిబ్రవరి 16 న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలకు తీసుకొస్తారు.

17 న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల దగ్గరకు తీసుకొస్తారు.

18 న సమ్మక్క - సారలమ్మలకు ప్రజలు మొక్కులు చెల్లిస్తారు.

19 న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Saturday, 8 January 2022

మానవత్వం చాటిన భారతసైన్యం.. పాక్ బార్డర్ గ్రామస్తుల జేజేలు...

కాశ్మీర్ మంచుకొండల్లో మంచు వెల్లువెత్తిన వెళ్ల 
 సైన్యం  మానవత్వంతో  ఆపన్నులను ఆదుకుంటోంది   .లోలాబ్ లోయలోని సుదూర ప్రాంతాలకు ప్రకృతి వైపరీత్యాలు ఎల్లప్పుడూ తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. అటువంటి పరీక్షా సమయాల్లో ఈ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయాన్ని అందించడంలో భారతీయ సైన్యం ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఒక వైపు విపత్తు సహాయంలో వుంటునే మానవత్వంతో పౌరులకు బరోసాగా నిలుస్తున్నాయి భారత సైనిక బలగాలు..సంఘటనలలో జోరావర్ గారిసన్, నార్త్ లోలాబ్‌లోని తరియన్ గ్రామానికి చెందిన గర్భిణీ తల్లికి ఆకస్మిక ప్రసవ నొప్పి రావడంతో వారికి సాయం అందించేందుకు భారత సైన్యం ముందుకు వచ్చింది.  మంచు కురుస్తున్న కారణంగా  ఈ గ్రామంలో ఎటువంటి పౌర రవాణా అందుబాటులో లేకపోవడంతో మహిళ & ఆమె కుటుంబం బాధలో ఉన్నారు.బార్డర్   గ్రామం అయిన ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్దుల్ హమీద్ భార్య  హనీఫా బేగంకు భారత సైన్యం సహాయం అందించింది, ఆమె ప్రసవ నొప్పితో సకాలంలో ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేసింది. జోరావర్ గారిసన్, గుజ్జర్‌పట్టి సైనికులు విపరీతంగా మంచు కురుస్తు అననూకూల వాతావరణంలో ఆ మహిళను స్ట్రెచర్‌పై ఎక్కించి, దాదాపు 6 కి.మీల వరకు తీసుకుని వెళ్లి సుమో వాహనాన్ని ఏర్పాటు చేసి  వైధ్యం  కోసం ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆ గ్రామం భారత సైనికులకు జేజేలు పలికారు.ఆమె భర్త & కుటుంబ సభ్యులు కృతజ్ఞతతో  సైనికులను ఆలింగనం చేసుకున్నారు.. భారత సైన్యం యొక్క మానవతా ప్రయత్నాలను అన్ని వర్గాల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి.

Wednesday, 5 January 2022

తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్నపావురం ..చైనా ట్యాగ్ వార్తలు.. సోషల్ మీడియా లో వైరల్ కోసమేనా నిజం ఎంత..?

తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్నపావురం ..చైనా ట్యాగ్ వార్తలు..
 సోషల్ మీడియా లో వైరల్ కోసమేనా నిజం ఎంత..? 
ఒకటి మాత్రం నిజం చూసిన వారు చూసినట్లుగా గ్రూపులలో.. మిత్రులకు రకరకాలుగా ఫార్వార్డ్ చేసేశారు....

1)బ్రేకింగ్.
ప్రకాశం జిల్లాలో పావురం కలకలం,
కోడ్ నెంబర్ పసుపు రంగు కల్గిన టాగ్ తో ఉన్న పావురం స్థానికులకు దొరికింది,ఇదే తరహా పావురం నిన్న ఒడిశా రాష్ట్రంలో కూడా ప్రత్యక్షం కోడ్ నెంబర్ ఉండటం వలన చైనా పంపిన గూఢచర్యం అని అనుమానంతో పోలీసుల అదుపులో తీసుకున్నరు.సరికొత్త గూఢచార్యాన్ని చైనా చూస్తోందని అనుమానం..కాగా తెలంగాణ లో ఈ తరహా వార్త హల్చల్ చేస్తోంది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో వరి కల్లం దగ్గర ఓ పావురానికి ట్యాగ్ తో ధర్శనమిచ్చింది.ఆ పావురాన్ని  రైతులు పట్టుకోని చూడగా చైనా లిపిలో ట్యాగ్ కాలి కి కట్టి ఉన్నట్లు తెలుస్తుంది.ఈ వార్తలపై పోలీసు శాఖ క్లారిటీ ఇవ్వ వలసి వుంది..

Monday, 3 January 2022

జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుక

ఖమ్మం : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకను నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ చిట్టి మళ్ల అశోక్ నూతన సంవత్సర కేక్ కట్ చేసి  సిబ్బందితో ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో  ఖమ్మం .    సబ్ రిజిస్ట్రార్ -1,  అడప రవీందర్,  రిజిస్ట్రార్ -2 రాజేశం,  రిజిస్టర్ ఆఫ్ చిట్సు:    నరేందర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు