మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధం అవుతోంది.
ములుగు (డీ) తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనుంది.
కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా.
ఫిబ్రవరి 16 న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలకు తీసుకొస్తారు.
17 న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల దగ్గరకు తీసుకొస్తారు.
18 న సమ్మక్క - సారలమ్మలకు ప్రజలు మొక్కులు చెల్లిస్తారు.
19 న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
No comments:
Post a Comment