*ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తాను ప్రయాణించే దారిలో పేదల జీవితాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు గతంలో ఆటో కార్మికుల అడ్డాలో ఆయన కలెక్టర్ వారి బాగోగులను స్వయంగా విచారించారు అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ల వద్దకు వెళ్లి వ్యాపార నడుస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు అక్కడే ఆయన స్వయంగా టీ తాగారు అయితే తాజాగా త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల స్థితిని తెలుసుకున్న కలెక్టర్ ఆమెకు మెప్మా ద్వారా వెంటనే సహాయం అంది ఎలా చర్యలు చేపట్టారు
దివ్యాంగురాలు కమల చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆగారు. కలెక్టర్ అంటే ఎవ్వరో తెలియని కమల పల్లీలు కావాలా సార్ అని ఆడగటంతో... ఓ చిరునవ్వు నవ్వారు. దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది. స్పందించిన కలెక్టర్.. నీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటా ఇచ్చి వెళ్లారు. తర్వాత కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసిన కలెక్టర్, జమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లాడి కేవలం ఐదురోజుల్లోనే రూ.1లక్ష వ్యాపార రుణం చెక్కును గురువారం అందించారు. త్వరలో కమలతో కూరగాయాల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కార్యచరణ చేశారు.
No comments:
Post a Comment