Tuesday, 24 December 2024

వెంటనే ఇల్లు కట్టి ఇవ్వండి..దిక్కారం పై కోర్టు కన్నేర్ర.... ధనవంతులవైతే ఇదే వేగం చూపిస్తారా అంటూ ప్రశ్న

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17: నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట గ్రామంలో స్టే ఉత్తర్వులున్నప్పటికీ అక్రమ నిర్మాణమంటూ కూల్చివేసిన పేదల ఇంటిని పునరుద్ధరించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. పేదలు ఇల్లు అయినందున కూల్చివేశారని, అదే ధనవంతులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ధైర్యం ఉందా అని నిలదీసింది. దోమలపెంటలో కటకం మహేశ్‌, నాగలక్ష్మి ఓ ఇల్లు కట్టుకొని చాలా ఏండ్ల నుంచి నివాసముంటున్నారు. అది అక్రమ నిర్మాణమంటూ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేయగా వారు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వారి ఇంటిని కూల్చరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ, కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించిం ది. ఉత్తర్వులు అమలులో ఉండగా నే ఇంటిని కూల్చివేయడంతో బాధితులు కోర్టు ధికరణ పిటిషన్‌ దాఖలు చేశా రు. దీనిపై జస్టిస్‌ పీ మాధవీదేవి విచారణ చేపట్టారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యదర్శి వల్ల ఇది జరిగిందని, ఇది జి ల్లా పంచాయతీ అధికారికి తెలియదని చెప్పారు. కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment