ఖమ్మం, డిశంబర్ -6 : ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై క్షేత్ర స్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి జిల్లాకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ అందిందని, లాగిన్ ఐడీలు ఇచ్చారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపిడివో లు, ఎంపిఓ లు, ఏపీవో లు, మునిసిపల్ కమిషనర్ల కు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు శిక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు.జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం క్రింద స్వీకరించిన దరఖాస్తుల్లో 357869 దరఖాస్తులు ఇండ్ల నిమిత్తం వచ్చినట్లు, ఇందులో అత్యధికంగా ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 53990 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ అన్నారు. రోజుకు ఒక అధికారిచే కనీసం 40 దరఖాస్తుల పరిశీలన లక్ష్యంగా చేపట్టి, ఈ నెల 20 లోగా దరఖాస్తుల విచారణ పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలన్నారు.ఈ సమీక్షలో శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డిఆర్వో రాజేశ్వరి, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, హౌజింగ్ ఇఇ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment