Saturday, 28 December 2024

ఏడుకొండలు చేరాలంటే..! ఏడు మార్గాలు ఉన్నాయి మీకు తెలుసా..!!



 *అందరికీ తెలుసు. మరి ఆ 7కొండలు ఎక్కేందుకు 7 మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు..? ఆ ఏడు మార్గాల్లో… ఏ దారి నుంచి వెళ్లినా… తిరుమల చేరుకోవచ్చు.ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.*                                               *(1) మొదటిది అలిపిరి. ఇది అందరికీ తెలిసిన దారే. తిరుమల వెళ్లేందుకు ప్రధాన మార్గం కూడా ఇదే. బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్‌ జీపులు… అన్నీ అలిపిరి నుంచే వెళ్తాయి. కాలినడకన కొండెక్కేవారు మొదట ఎంచుకునేది కూడా అలిపిరి మార్గమే. ఎందుకంటే ఇది… తాళ్లపాక అన్నమాచార్య నడిచిన మార్గం. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. కొంత నడకమార్గం కాగా… 3650 మెట్లు ఉంటాయి. ఈ మార్గం నుంచి వెళ్తే.. ఎన్నో ఉపాలయాలు, మోకాళ్ల పర్వతాన్ని దర్శించుకోవచ్చు.* 
 *(2) రెండో మార్గం.. శ్రీవారి మెట్టు మార్గం. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం నుంచి… మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవారు పద్మావతి అమ్మవారిని వివాహమాడిన శ్రీనివాసుడు… తిరుమలకు ఈ మార్గం నుంచే వెళ్లారట. అందుకే దీనికి శ్రీవారి మెట్టుఅందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరొచ్చింది. శ్రీవారి మెట్టు నుంచి మూడుకిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మార్గంలో వెళ్తే… గంటన్నరలో తిరుమల చేరుకోవచ్చు.* 

 *(3) మూడో మార్గం.. మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యంలో ఉంటుంది. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుంచి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి… శ్రీవారి ఆలయం చేరుకుంటారు. ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాతి మెట్లను ఏర్పాటుచేశారు.* 

 *(4)నాలుగో మార్గం… కళ్యాణి డ్యామ్‌. తిరుమల కొండకు పశ్చిమం వైపున ఉంటుంది. డ్యామ్‌ నుండి 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం 15 కిలోమీటర్లు. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే తిరుమల చేరుకుంటారు.* 

( *5) ఐదో మార్గం… తుంబురుతీర్థం. కడప సరిహద్దు-చిత్తూరు ఎంట్రెన్స్‌ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి తుంబురుతీర్థం, పాపవినాశనం మీదుగా తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం నుంచి పాపవినాశనం మధ్య 12 కిలోమీటర్లూ దూరం ఉంటుంది. పాపవినాశనం నుంచి సులువుగా తిరుమల చేరుకోవచ్చు.* 

 *(6)ఆరో మార్గం.. అవ్వాచారి కోన. ఏడుకొండల మధ్యలో ఉన్న కొంత పల్లపు ప్రాంతాన్నే అవ్వాచారి కోన అంటారు. దీనినే అవ్వాచారి కొండ అని కూడా పిలుస్తారు. అవ్వాచారికొండ…. మొదటి ఘాట్‌రోడ్డులోని అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంటుంది. రేణిగుంట సమీపంలోని కడప-తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి లోయలో ఉన్న అవ్వాచారి కోన మీదుగా పడమరవైపుకి వెళ్తే… మోకాళ్ల పర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.* 

( *7) ఏడో మార్గం… తలకోన. ఇక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తిరుమల కొండకు తల భాగంలో ఉంటుంది కనుకే.. దీనికి తలకోన అని పేరువచ్చింది. తలకోన జలపాతం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలో వెళితే తిరుమల వస్తుంది. ఈ మార్గం 20 కిలోమీటర్లు ఉంటుంది.* 

 *సేకరణ.. సోషల్ మీడియా ద్వారా

No comments:

Post a Comment