Tuesday, 18 February 2020

సెల్ భధ్రం చూడాలంటే డబ్బు కట్టాల్సిందే...#

శ్రీశైలం.. శివరాత్రి బ్రహ్మ ఉత్సవాల్లో భక్తులకు సెల్ భధ్రత జేబులకు చిల్లు పడుతోంది.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రముఖ క్షేత్రాలలో దర్శనానికి వెళ్లే భక్తుల మోబైల్ భధ్రపరచుకునేందుకు వున్న నగదు రుసుము ను ఎత్తివేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
 అయితే ప్రముఖ జ్యోతిర్లింగ శక్తి పీఠ క్షేత్రం శ్రీశైలంలో మాత్రం మోబైల్ భధ్రపరచే కౌంటర్ లలో ఒక్కోదానికి 5 వంతున చెల్లవేసి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది.. ఒక కుటుంబం దాదాపు 50రూపాయల వరకు మోబైల్ భద్రపరచేందుకు వెచ్ఛించాల్సిన పరిస్థితి నెలకొనివుంది...ఆదాయం పెంపుదలకు వివిధ మార్గాలు వుండగా అన్నివర్గాలు ఉపయోగించే మోబైల్ భద్రపరిచే క్లోక్ రూం వాళ్లు ముక్కుపిండి రూ.5/- వసూలు చేయడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పాలక వర్గం.. దేవదొయ శాఖ మోబైల్ కంట్రాక్టు రద్దు చేసి ఉచితం చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి      ఈ విషయం పై దృష్టి సారించాలని సామాన్య భక్తులు కోరుతున్నారు..

No comments:

Post a Comment