Friday, 7 February 2020

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో పరుగులు...

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోరైలు మార్గాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ జేబీఎస్ స్టేషన్ లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 
అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ శ్రీ పద్మారావు గౌడ్‌, మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీ మహమూద్‌ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీ మల్లారెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీ రేవంత్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, మేయర్‌ శ్రీ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీ బాబా ఫసీయుద్దీన్‌ ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment