Saturday, 8 February 2020

రిజిస్ట్రేషన్ & స్టాంప్సు శాఖకు ఇ-గవర్నస్ అవార్డు

ఇ - గవర్నస్ జాతీయ అవార్డును 2019-2020 గాను తెలంగాణ టి-చిట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ దక్కించుకుంది నేడు ముంబైలో జరిగిన 23వ ఇ-గవర్నన్న్సన్సు సదస్సులో  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ సుభాషిని ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు తెలంగాణ ప్రభుత్వం తరఫున అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇతర  ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు .
ఇ-గవర్నెన్స్‌పై రెండు రోజుల వార్షిక జాతీయ సదస్సు యొక్క 23 వ ఎడిషన్ ముంబైలో శుక్ర, శనివారాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి హాజరైన ప్రముఖులు ప్రభుత్వ కార్యాలయాలు ఆన్‌లైన్‌ సేవలపై విస్తృతంగా చర్చించారు. ఇ - గవర్నస్ ద్వారా పౌర సేవలలో ఏర్పడుతున్న ఇబ్బందులు సమావేశంలో ప్రస్తావనకు వచ్ఛాయి. 
ఇబ్బందులు తొలగించేందుకు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని పలువురు విజ్జప్తి చేశారు..
రెండు రోజుల సమావేశాన్ని ముంబైలో రాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే ప్రారంభించారు .
ఈ సమావేశానికి ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అజయ్ సాహ్నీ, పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల కార్యదర్శి కె. శివాజీ హాజరయ్యారు.
ఆరోగ్యం, వ్యవసాయం, విద్య మరియు భూమి పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం గుర్తించబడిన ప్రాధాన్యత రంగాలలో ఇ-గవర్నస్ సేవలను కొనియాడారు. సుమారు 800 మంది హాజరు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం ,  17 రాష్ట్రాలు  చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment