Saturday, 31 December 2022

సీతాకళ్యాణాన్ని కనులకు కట్టిన కలేక్టర్ సతీమణి గౌతమి...

 భద్రాచలం, 31 డిసెంబర్:
 శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్  సతీమణి గౌతమి నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు.     శనివారం నాడు రాత్రి శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల  సందర్భంగా నాట్య కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీతా కళ్యాణం కూచిపూడి నృత్యం చేశారు.సీతా కళ్యాణ ఘట్టాన్ని నర్తనలో చూపరుల కళ్లకు కట్టారు..   అనంతరం కలెక్టర్ దంపతులకు దేవస్థానం తరపున ప్రశంస పత్రం అందించి, సన్మానం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు
     ఈ కార్యక్రమంలో నృత్య గురువు మీనా కుమారి, వనిత శ్రీ కాదండి చిన్నారులు పాల్గొన్నారు.

Thursday, 29 December 2022

తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం


 తిరుపతి, చిత్తూరులోని కెవిఆర్‌ జ్యూవెలర్స్‌ వ్యవస్థాపకులు శ్రీ కెఆర్‌.నారాయణమూర్తి, వారి సతీమణి శ్రీమతి కెఎన్‌.స్వర్ణగౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో(ఎఫ్‌ఏసి) అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు అందించారు.దాత అందించిన వివరాల మేరకు సుమారు 1756 గ్రాములు బరువుగల ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.1.30 కోట్లు. వీటిలో మూలవిరాట్‌ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీమలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి విలువైన రాళ్లు పొదిగిన మూడు పతకాలు ఉన్నాయి. 
కాగా, ఇదే దాత గతేడాది డిసెంబరులో సుమారు రూ.3 కోట్లు విలువైన కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా అందించారు.

Tuesday, 27 December 2022

“సింగ‌రేణి ద‌ర్శ‌న్”**ప్ర‌త్యేక ప్యాకేజీతో టి.ఎస్‌.ఆర్టీసీ... బ‌స్సును లాంఛ‌నంగా ప్రారంభించిన సంస్థ ఛైర్మ‌న్‌, ఎం.డి**ఇక న‌ల్ల బంగారం గ‌నుల‌ను ఎంచ‌క్క‌గా తిల‌కించే అవ‌కాశం

హైదరాబాద్ : నల్లబంగారం గనుల గురించి ఆసక్తి వున్నవారు ఇహ  టి.ఎస్‌.ఆర్‌.టి.సి బస్లో  సింగ‌రేణి గనులను చుట్టేయ్యవచ్ఛు. సింగరేణి బొగ్గు గనుల సంద‌ర్శ‌న‌కై  స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
ద‌శాబ్ధ‌ కాలానికి పైగా సిరులు కురిపిస్తున్న బొగ్గు గ‌నుల్లోంచి బొగ్గును ఎలా తీస్తారో ప్ర‌త్య‌క్షంగా తెల‌సుకోవాల‌ని కుతూహలంగా ఉండే వారికి ఇది ఎంతో ఉప‌యుక్తంగా ఉండ‌నుంది. 
ప్ర‌తి శ‌నివారం  అందుబాటులో ఉండ‌నున్న “సింగ‌రేణి ద‌ర్శ‌న్” బ‌స్సును సంస్థ ఛైర్మ‌న్ శ్రీ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎం.ఎల్‌.ఎ గారు,  మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వి.సి.స‌జ్జ‌న‌ర్‌, ఐ.పి.ఎస్ గారు లాంఛ‌నంగా జెండా ఊపి ప్రారంభించారు. 
మంగ‌ళ‌వారం బ‌స్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో ఛైర్మ‌న్ మాట్లాడుతూ,  ఈ సేవ‌ల్ని చారిత్రాత్మ‌క నిర్ణయంగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న అభివ‌ర్ణించారు. 
న‌గ‌ర అందాల‌ను తిల‌కించేందుకు వ‌చ్చే ప‌ర్యాట‌కుల కోసం  టి.ఎస్‌.ఆర్టీసీ గ‌త కొన్ని నెలల ముందు హైద‌రాబాద్ ద‌ర్శ‌న్  సేవ‌ల్ని ప్రారంభించిన విష‌యాన్ని గుర్తు చేశారు. 
అలాగే, భ‌క్తుల కోసం తిరుమ‌ల శ్రీవారి శీఘ్ర ద‌ర్శ‌న భాగ్యాన్ని కూడా క‌ల్పించిన‌ట్లు చెబుతూ, ఈ మేర‌కు టి.ఎస్‌.ఆర్టీసీ బ‌స్సుల్లో 7 రోజుల ముందుగా రిజ‌ర్వేష‌న్ చేసుకోవ‌ల్సి ఉంటుంద‌న్నారు. 
ఈ క్ర‌మంలోనే తాజాగా సింగ‌రేణి ద‌ర్శ‌న్ పేరిట స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. 
రానున్న రోజుల్లో కాళేశ్వ‌రం దేవాల‌యంతో పాటు బ్యారేజీని తిల‌కించేందుకు మ‌రో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 
సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ వి.సి.స‌జ్జ‌న‌ర్‌, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ, ఈ ప్యాకేజీ కింద ఒక‌రికి రూ.1600గా నిర్ణ‌యించిన‌ట్లు తెలుపుతూ బొగ్గు గ‌నుల తవ్వే విధానాన్ని ప్ర‌త్య‌క్ష్యంగా ప‌రిశీలించ‌వ‌చ్చ‌న్నారు. 
ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను బ‌ట్టీ సింగ‌రేణి ద‌ర్శ‌న్ స‌ర్వీసుల‌ను పెంచ‌డం జ‌రుగుతుంద‌ని, ఆదాయాన్ని పెంచుకునే  దిశ‌గా టి.ఎస్‌.ఆర్టీసీ అడుగులు వేస్తోంద‌ని స్ఫ‌ష్టం చేశారు. 
సింగ‌రేణి ద‌ర్శ‌న్, హైద‌రాబాద్ ద‌ర్శ‌న్‌ సేవ‌ల్ని వినియోగించుకుని సంస్థ‌ను ఆద‌రించాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. 
సింగ‌రేణి డైరెక్ట‌ర్ శ్రీ బాల్‌రాం గారు మాట్లాడుతూ, ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ ప్రాంతంలో బొగ్గు గ‌నుల త‌వ్వ‌కాల‌ను నేరుగా చూసి ఆనందించే విధంగా ఈ ప్యాకేజీని రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. 
భూగ‌ర్భ గ‌ని, ధ‌ర్మ‌ల్ ప్లాంట్ ల‌ను ఎంచ‌క్క‌గా తిల‌కించ‌వ‌చ్చ‌ని, ప్ర‌యాణంతో పాటు శాఖాహార భోజనాన్ని కూడా క‌ల్పించ‌డంతో ప్ర‌యాణీకుల‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు. 
టి.ఎస్‌.ఆర్టీసీ ప్ర‌యాణీకుల సౌక‌ర్యాల వైపు ఆలోచిస్తూ కొత్త కొత్త పంథాలో కార్యాచ‌ర‌ణ దిశగా అడుగులు వేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.
ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో హన్సా ఈక్విటీ పాట్న‌ర్స్‌, ఎల్‌.ఎల్‌.పి శ్రీ త్రినాథ్ బాబు గారు, సునీల్ రేగుల గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ శ్రీ మునిశేఖ‌ర్ గారు, శ్రీ వినోద్ గారు, శ్రీ పురుషోత్తం గారు, శ్రీ యాద‌గిరి గారు, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు గారు, సి.పి.ఎం శ్రీ కృష్ణ‌కాంత్ గారు, సి.టి.ఎం శ్రీ జీవ‌న్ ప్ర‌సాద్ గారు, సి.టి.ఎం (ఎం అండ్ సి) శ్రీ విజ‌య‌కుమార్ గారు, క‌రీంన‌గ‌ర్ ఆర్‌.ఎం శ్రీ ఖుష్రో షా ఖాన్ గారు, సి.ఎస్‌.ఒ శ్రీ విప్ల‌వ్ గారు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

*ప్ర‌జా సంబంధాల అధికారి*

Wednesday, 14 December 2022

బీఆర్ఎస్ పార్టీ జాతీయ అద్యక్షునిగా లెటర్ హెడ్ పై తొలి సంతకం...కెసిఆర్ కు వెల్లువలా శుభాకాంక్షలు.. అభినంధనలు...

-----------------------------------------------------------
ఢిల్లీలో  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ప్రారంభ హైలైట్స్
-----------------------------------------------------------
తెలంగాణ నుండి కదలిన గులాబీ దండు
ఖమ్మం జిల్లా నుండి తరలిన మంత్రి అజయ్ కుమార్, ఎంపిలు..నామా నాగేశ్వరరావు.. వద్దిరాజు రవి..ఎంఎల్.సి.తాత మధు..ఏంఎల్.ఏ సండ్ర వెంకట వీరయ్య తదితరులు.. 
 .- పలు రాష్ట్రాల మాజీ సీఎంలు, ఎంపీలు, జాతీయ రైతు సంఘాల నేతలు ప్రముఖులతో కలసి బి ఆర్ ఎస్ కార్యాలయం  ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌
- పూర్ణాహుతిలో పాల్గొన్నసీఎం కేసీఆర్‌ దంపతులు, అనంతరం 12.37 గంటలకు గులాబీ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ నేత కేసిఆర్
- అనంతరం కేసిఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయ ప్రారంభం. పాల్గొన్నఅఖిలేశ్ యాదవ్ మరియు కుమార స్వామి.
- కార్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్ లో ఆసీనులైన కేసీఆర్
- బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి ( బీఆర్ఎస్ కిసాన్ సెల్ ) ఏర్పాటు.
- బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా, హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత, గుర్నామ్ సింఘ్ చడూని " నియామకం.
- కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్ నియామకం.
- జాతీయ అధ్యక్షుని హోదాలో తొలి నియామక పత్రాలను అందజేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.
 సీఎం కేసీఆర్‌ కు శుభాకాంక్షల వెల్లువ.
-----------------------------------------------------------
భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు పడింది. దేశ  రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ఆవిర్భవించింది. దేశ రాజధానికి చేరిన తెలంగాణ అస్తిత్వ రాజకీయం నుంచి, భవిష్యత్తు జాతీయ పాలనకు ముందడుగు పడింది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ ప్రారంభోత్సవం - ముఖ్యాంశాలు.
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్డు నెంబర్ 5 లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. 
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణి దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంప‌తుల‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. యాగంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, , తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ కిసాన్ నేత గుర్నామ్ సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
దేశ రాజధానిలో ఎగిరిన గులాబీ జెండా :
పూర్ణాహుతి అనంతరం 12 గంటల 37 నిమిషాలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను  ఆవిష్కరించారు. తదనంతరం అతిథులు, పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. 
ఆనంతరం మొదటి అంతస్తులోని తనకు కేటాయించిన ఛాంబర్లో జాతీయ అధ్యక్షుని హోదాలో కుర్చీలో ఆసీనులైనారు.

బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా, హర్యానా కురుక్షేత్ర కు చెందిన జాతీయ రైతు సంఘం నేత, గుర్నామ్ సింఘ్ చడూని " ని అదినేత కేసిఆర్ నియమించారు. కార్యాలయ కార్యదర్శి గా రవి కొహార్ ను నియామించారు. జాతీయ అధ్యక్షుని హోదాలో తొలి నియామక పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎంపి నామా నాగేశ్వర్ రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజనానికి సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు,  రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. 
ఢిల్లీలో బీఆర్ఎస్ జోష్ : 
బీఆర్‌ఎస్‌ పార్టీ నూతన జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ రోడ్డు జై కేసీఆర్, జై భారత్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబిమయమైంది. పలు రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు, పలు పార్టీలకు చెందిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొన్నది.  దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం తెలంగాణ భవన్, సీఎం అధికారిక నివాసం 23 తుగ్లక్ రోడ్ లోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కేరింతలు, నినాదాలతో సందడి వాతావరణం నెలకొన్నది. 

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష యాదవ్, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నాం సింగ్, ఇతర రైతుసంఘాల నాయకులు, మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి,  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,   ఎంపీలు కె. కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి,  బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్ రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, పి రాములు, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Monday, 12 December 2022

సింహాద్రి అప్పన్న ఆలయంలో భక్తి శ్రద్దలతో నిత్య కైంకర్యాలు...


విశాఖ /సింహాచలం, సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో  వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు సోమవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.

శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి సహస్ర నామార్చన, వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా , పరోక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రా గమశాస్త్రం విధానంలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Wednesday, 7 December 2022

ఆందోళన వద్దు.. అండగా వుంటాం.. పాత్రీకేయుల ఇంటి జాగా బాధ్యత నాదే : మంత్రి పువ్వాడ

Hyderabad :: 07:12:2022
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. 
ఖమ్మం లోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇంటి జాగ ఇప్పించే బాధ్యత తనదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టు మరణిస్తే రూ.లక్ష ఇవ్వడంతోపాటు వారి కుటుంబానికి నెలకు మూడువేల పింఛన్‌, పిల్లల విద్య కోసం ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున అదనంగా ఇచ్చే ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పారు. 
జర్నలిస్టుల కొరకు గతంలో ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు చేసిందేమీ లేదని మంచి చేసిన వారికి జర్నలిస్టులు తోడుగా నిలవాలి అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
''ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ'' ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సందర్భాల్లో రాష్ట్రంలోని జర్నలిస్టుల గురించి చెప్పే ముచ్చట అని జర్నలిస్టుల స్థితిగతులు తనకు తెలుసునని చెప్తూ, వారి బతుకులు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి కేసిఆర్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యాక కూడా కేసిఆర్ లో జర్నలిస్టు సమాజంపై ఉన్న మమకారం ఏ మాత్రం తగ్గలేదు అని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తి ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Tuesday, 6 December 2022

జర్నలిస్టుల పట్ల కెసిఆర్ ఆదర్శంగా నిలబడాలి

ఖమ్మం తమ పథకాలు కేంద్రం ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల పట్ల కూడా ఆదర్శంగా నిలబడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచించారు ఖమ్మం ప్రెస్క్లబ్లో మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు జర్నలిస్టులు కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని 2014లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయాలని కోరుతున్నారని ఆయన నొక్కి చెప్పారు.

దశాబ్ద కాలం పైబడి జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెరాస ప్రభుత్వం 2014లో ఇళ్ల స్థలాల విషయం తన మేనిఫెస్టోలో చేర్చింసదని 8 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు సదర్ హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు జర్నలిస్టుల కనీస అవసరాలు ఇళ్ల స్థలాలు వైద్యం సంబంధించిన సమస్యలను వెంటనే కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణాది రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించారని అదేవిధంగా తెలంగాణలో కూడా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన పేర్కొన్నారు అలాగే దళిత బంధు తరహా జర్నలిస్టు బంధు పథకం కూడా తెలంగాణలో ప్రవేశపెట్టాలని అది నూటికి నూరు శాతం జర్నలిస్టులకు వర్తింపజేయాలని ఆయన కోరారు జర్నలిస్టులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదురైనా తమ సంఘం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు

తిరువణ్ణామలైలో వెలిగిన భరణి దీపం... నేడు కృత్తికా దీపోత్సవం..

తమిళనాడు : తిరువన్నమాలైలో సోమవారం భరణి దీపం కాంతులు వెదజల్లాయి ఆలయంలో అర్చకులు ఐదు పెద్ద ప్రమిదల్లో ఆవు నెయ్యి నింపి ఒత్తులు వేసి సోమవారం ప్రదోషకాలం సాయంత్రం వెలిగించి స్వామివారికి హారతులు ఇచ్చారు.

 సోమవారం 100 ఏళ్ల కాలంనాటి వెండి రథంపై ఊరేగింపు నిర్వహించారు భరణి దీపాన్ని యమగండాలు తొలగించే దీపంగాను సమస్త భారాలు తొలగించే దీపం గాను తమిళనాడు వాసులు భావిస్తారు భరణి దీపం సోమవారం వెలిగించగా ఈరోజు సాయంత్రం కృత్తికా దీప వెలిగించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి తమిళనాడు పోలీసులు కృత్తికా దీపోత్సవానికి భద్రత ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు ఈ కృత్తికా దీపోత్సవానికి దాదాపు 30 లక్షల మంది వీక్షించేందుకు వస్తారని అంచనాతో భారీ భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ కంట్రోల్ రూమ్ వ్యవస్థలు తిరువన్నమాలై పోలీసులు ఏర్పాటు చేశారు భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

Monday, 5 December 2022

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము....


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సోమవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి సోమవారం ఉదయం 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు.అనంతరం శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో  ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశ్రీశ్రీ  పెద్దజీయంగార్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయంగార్‌ స్వామి ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని , సన్నిధిలోని ఇతర ఆలయాల గురించి వివరించారు.  అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు.  ఛైర్మ‌న్‌, ఈవో కలిసి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ముకు అందజేశారు.

Sunday, 4 December 2022

ఓటు నమోదు చేసుకున్నారా అంటూ నగర వాసులతో కలేక్టర్ మాటామంతి.. ముందస్తు ఓటరు నమోదు పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం..


ఖమ్మం, డిసెంబర్ 4: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ అమలును జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. కలెక్టర్ నగరంలోని జిల్లా విద్యాధికారి, జిల్లా అటవీ అధికారి కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి, బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అక్కడి ప్రజలను సైతం ఓటు నమోదు చేసుకున్నారా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  18 సం.లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా తమ పేరును నమోదు చేసుకొనేలా, 17 సంవత్సరాలు నిండినవారు ముందస్తు నమోదులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ప్రతి పోలింగ్ కేంద్రాల వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులను, దివ్యాంగులను ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు. 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు అంటే, ఇంటర్ రెండో సంవత్సరం, ఆపై చదివేవారిని ముందస్తుగా దరఖాస్తును ఇవ్వడం కానీ, ఆన్లైన్ లో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఫామ్ - 6 ద్వారా నూతన ఓటర్లను నమోదు, ఫామ్ 6(బి), ఫామ్ - 7, ఫామ్ - 8 ద్వారా ఓటర్ల జాబితా వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతున్నదని ఆయన వివరించారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి, సర్వే ద్వారా ఓటర్ నమోదు చేయాలని, అర్హులైన కొత్త ఓటర్ల పేరు వివరాలతో జాబితా తయారుచేసి, వారందరు నమోదయ్యేలా చూడాలని అన్నారు. చనిపోయిన వారి వివరాలను సేకరించి జాబితా నుండి తొలంగింపుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులతో వారి వారి పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నది, ఎంత మంది క్రొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది, ఎంతమంది మరణించినవారు, వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయినవారు ఉన్నది, గరుడ యాప్ ఉపయోగిస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఇతర పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా ఇవ్వాలన్నారు. ఓటరుగా నమోదు చేయాల్సిన వారి జాబితాను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ గొల్లబజార్ లో ఇంటింటికి వెళ్లి, ఇంట్లో ఎందరు ఉన్నది, 17 సంవత్సరాలు నిండినవారు, కొత్తగా వివాహం అయి వచ్చిన వారు, ఓటు హక్కు ఎందరికి ఉన్నది, లేనివారు నమోదు చేసుకున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. 17 సంవత్సరాలు నిండిన వారి నుండీ ముందస్తు దరఖాస్తులు తీసుకోవాలని ఆయన అన్నారు. అర్హులైన ఒక్కరూ ఓటుహక్కుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, బూత్ స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు. 

Friday, 2 December 2022

కృత్తికా దీపానికి సిద్దమవుతున్న అరుణాచలేశ్వరుడు.... గిరి ప్రదక్షణం చేసిన డిజిపి శైలేంద్రబాబు

తమిళ నాడు : తిరువన్నామలై లో ఈనెల 6న జరగబోయే కృత్తిక దీపోత్సవం భద్రతా ఏర్పాట్లను సందర్భంగా భద్రత ఏర్పాట్లను తమిళనాడు పోలీసు ఉన్నతాధికారి శేలేంద్ర బాబు ips పరిశీలించారు గత ఏడాది కరోనా కారణంగా ఆలయం వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన కృత్తికా దీపం ఈ ఏడాది భక్తుల సందడి మధ్య నిర్వహించనున్నారు లక్షలాదిమంది భక్తులు హాజరై స్వామిని దర్శించుకోనున్నారు ఈ కారణంగా ఈరోజు పోలీసు భద్రతా ఏర్పాట్లను సేలేంద్రబాబు తనిఖీ చేశారు అంతకుముందు ఆయన కొందరు పోలీసు సిబ్బందితో కలిసి గిరిప్రదక్షిణం పరుగు లో పాల్గొన్నారు 14కిలో మీటర్ల అరుణచలం గిరిని 1.52 నిమిషాలలో    చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా సిబ్బందికి అభినందనలు తెలిపారు @ మణికుమార్.