మహేంద్ర సింగ్ ధోనీ విత్ భగవద్గీత
విఖ్యాత క్రికెటర్ MS ధోనీ ఎంతటి కష్టతరమైన ఆటలో కూడా "మిస్టర్ కూల్" గా సైలెంట్ ఉంటూ చివరికి విజయం సాధించే దాకా "స్థితప్రజ్ఞుడిగా" ఉండటంలో, అతని మానసిక బలం, విజయంలో ప్రేరణలో నిలిచింది భగవద్గీత..
మొన్న IPL ఫైనల్ అయ్యాక ధోని గురువారం రోజున సర్జరీకి ముందు ముంబైలో తన కారులో భగవద్గీతను అందరికి చూపుతూ కనిపించాడు. ఇది భగవద్గీత పట్ల ఆయనకున్న విశ్వాసం.
ధోనికి స్కూల్ రోజుల్లో నుంచి భగవద్గీత చదివే అలవాటు ఉందని, రోజు అధ్యాయల వారిగా రోజు కొన్ని శ్లోకాలు చదువుతానని, ఇంట్లో ఉన్నపుడు తనతో పాటు భార్య సాక్షి, కుమార్తె జివా కి కూడా భగవద్గీత ను చదివి వినిపిస్తానని ధోని తెలిపాడు.
నేటి ఈ నవీన సాంకేతిక డిజిటల్ యుగంలో ప్రపంచ మేటి ఆటగాడు, ప్రఖ్యాత క్రికెట్ టీమ్ లకు లీడర్ గా ఉన్న ధోని భగవద్గీతను అనుసరించండం అనేది బాగా గమనించాల్సిన విషయం.
అందుకే మీరు కూడా మీ పిల్లలకు నేర్పించండి.
వారికి భగవద్గీత చదివేలా ప్రోత్సహించండి. ప్రతిరోజూ ఒక అధ్యాయంలో 5 శ్లోకాలు, వాటి తాత్పర్యంతో పాటు వివరణలు అర్ధమయ్యేలా చదివించండి. వారితోపాటు మీరు చదువుతూ అందులోని కొన్ని ప్రశ్నలు అడగండి. వారికి మన ధర్మం గురించి తెలియజేయండి..
ప్రస్తుత యువత భగవద్గీత విలువని, గీతాసారాన్ని అర్ధం చేసుకుంటే జీవిన విధానంలో ఉత్తమ మార్పు, చేపట్టిన కార్యాలల్లో, మానవ జీవిత సార్థకతలో విజయం సులభంగా సాధ్య పడుతుంది
(సోషల్ మీడియా పేజీ నుండి)
No comments:
Post a Comment