Wednesday, 10 January 2024

ప్రజలు వివేకంతో గెలిపించారు: మంత్రి పొంగులేటి



ఎవరు ఎన్ని చెప్పినా పది సంవత్సరాలు పాలించి ప్రజల గోడు పట్టని ప్రభుత్వాన్ని దించి ప్రజలు వివేకంతో 
 ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచారం,పౌరసంబంధాల శాఖామాత్యులు.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.. బుధవారం కూసుమంచిలోని పాలేరు క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులతో మమేకమైన శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు Brs పార్టీ ఖమ్మం జిల్లాలో ఏ మీటింగ్ పెట్టిన కేసీఆర్ డబ్బు అహంకారం తో ఉన్న వారిని గెలిపించొద్దనే స్లోగన్ ఇచ్చారని పేర్కొన్నారు.. 
గతంలో తాము అధికారంలో లేనమని,ముఖ్యమంత్రి గా వుండి ,ప్రజల సొమ్ము దోచుకోలేదని ,తెర వెనుక వేలాది కోట్లు సంపాదించలేదని. శ్రీనివాసరెడ్డి అన్నారు. ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులం ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రజల సేవకులుగా పనిచేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు...గత ప్రభుత్వం 6లక్షల 71 వేల కోట్ల అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజలు గమనించారని
.ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం తప్ప మాయమాటలు చెప్పి ప్రభుత్వం కాదు..ఇరిగేషన్ ప్రాజెక్టు ల పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పామో ఈరోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సమీక్ష చేస్తున్నారు.గత ప్రభుత్వం లో చేసిన తప్పులు కనపడతాయాని ఫైళ్లను మాయం చేసే కార్యక్రమం చేపడితే ఆ ఫైళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  తప్పు చేయకపోతే ఫైళ్లను మాయం చేయాలని బిఆర్ఎస్ నేతలు ఎందుకు చూసారు..  ప్రభుత్వ ఆస్తులను వారి తొత్తులకు కట్టబెట్టారు..ఇప్పటికే ఖమ్మం లో రెండు మూడు అంశాలను కలెక్టర్ బయటకు తీశారు..ప్రభుత్వ ఆస్తులను ప్రజలకు చెందే విధంగా చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది..వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఉంది..
కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ మనోధైర్యం తో గౌరవం గా ఉండి మీ కృషి తో తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో మీరందరూ భాగస్వామ్యులయి అందరం ప్రజల కోసం పని చేయాలని పొంగులేటి పిలుపు నిచ్చారు..

No comments:

Post a Comment