Monday, 15 January 2024

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి వేడుకలు....


విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:     ఆలయ స్థానాచార్యుల వారు మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి వేద మంత్రోచ్చారణాల నడుమ సాంప్రదాయబద్ధముగా గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, మేళములతో వైభవముగా భోగి మంటలు కార్యక్రమంతో ఆదివారం సంక్రాంతి వేడుకలు మొదలు అయ్యాయి‌భోగి మంటలు వెలిగించి, ప్రదక్షిణలు చేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు , కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, కార్యనిర్వాహక ఇంజనీర్లు,  వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు  సిబ్బంది  భక్తులు..
భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపి, శ్రీ అమ్మవారి స్వామివారి కృపాకటాక్షములు అందరికీ ఉండాలని కోరుకున్నారు.
సంక్రాంతి సందర్బంగా మహామండపం 07వ అంతస్తు పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు..బొమ్మల కొలువు వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమములు నిర్వహించి  బొమ్మల కొలువు ప్రారంభించారు.
ఆకట్టుకున్న గంగిరెద్దుల విన్యాసములు, హరిదాసు కీర్తనలు, బొమ్మల కొలువు, వివిధ వర్ణముల ముగ్గులు, అయోధ్య రామమందిరం ముగ్గు, ఎద్దుల బండి, కోడి పుంజులు, రైతు, నాగలి, గుడిసె, రోకలి, చెరకు గడలు, తదితరులను తీర్చి దిద్దారు.కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ స్థానాచార్యులు  విష్ణుభట్ల శివప్రసాద శర్మ, పాలక మండలి సభ్యులు,  వైదిక కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి వార్లు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది..ఉదయం నుండి విశేషముగా అమ్మవారి దర్శనార్థం వస్తున్న భక్తులు... సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాట్లును విశేషముగా తిలకిస్తున్న భక్తులు..*పెద్దరాజగోపురం ఎదురుగా ఉన్న ప్రదేశం నందు సాయంత్రం 05 గం. లకు నిర్వహించనున్న చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోయు కార్యక్రమం జరిపించారు..

No comments:

Post a Comment