Wednesday, 23 October 2024

*ఖమ్మంలో 16వ అన్న ప్రసాద వితరణ*. *మాలదారుల ఆనందం**శరణు ఘోషతో* *మారుమోగుతున్న**అన్న ప్రసాద వేదిక*


*ఖమ్మం : వీడియోస్ కాలనీ వెంకటేశ్వర థియేటర్ ఏరియాలోని గురుస్వామి రాంప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న ప్రసాద వేదిక ప్రతిరోజు శరణు ఘోషతో మారుమోగుతోంది వేలాదిమంది అయ్యప్పలు అన్న ప్రసాదం స్వీకరించి ఆనందంతో అన్నదాత సుఖీభవ అంటుండగా. తిన్నదాతా జాయిభవ అంటూ వితరణ చేసిన వారు మారు పలుకుతున్నారు*
*అన్న ప్రసాద వితరణ అంటే అది ఒక మహాయోగం ఆ యోగంలో తరించిన వారిలో ఆధ్యులు డొక్కా సీతమ్మ గారు ఇంకా జిల్లెల్లముడి అమ్మగారు మరెందరో .. అన్నపూర్ణే సదాపూర్ణే అంటూ అన్న వితరణ వేదిక మారుమోగుతుండగా అన్నపూర్ణమ్మ కృప కోసం కృషి చేసే వారు అనేకులు వారు ఎందరో..సమర్పణ చేయడంలో ఒక ఆనందం ఉంది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. మీ భౌతిక శరీరాన్ని ‘అన్నమయ కోశం లేదా  ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో నిర్మించబడింది. కాబట్టి, మీరు అన్నసమర్పణతో శరీరం తిరిగి ఉత్తేజితంగా మారి దైవీక కార్యక్రమాలకు సన్నద్ధం అవుతుంది చేస్తే. తిన్నవారు అన్నదాత సుఖీభవ అంటూ అన్న ప్రసాద వితరణ చేసిన వారిని కొనియాడుతారు.. అన్నపూర్ణే సదాపూర్ణే అంటూ మనం నిత్యం ప్రార్థించే అమ్మ అన్నపూర్ణమ్మ సైతం అన్న సంతర్పణ చూసి *అత్యంత ఆనందం చెందుతుంది.* 
*మాలధారణం నియమాల తోరణం మనిషి ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి అందులో ఆధ్యాత్మికం దైవికం గా సంక్రమించే ఒక మార్గం దేవుని అనుమతి లేనిదే ఏ వ్యక్తి కూడా* *ఆ మార్గాన్ని అనుసరించలేడు అలా అనుసరించే వారిలో ఖమ్మం అయ్యప్పలు ఎందరో వారికి అన్న సంతర్పణ చేయడానికి పూనుకొని గత 16 సంవత్సరాలుగా భక్తి భావంతో మహా మహా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి..*
*ఈ గురు స్వామి మరి కొందరు స్వాములతో మమేకమై గత 16 సంవత్సరాలుగా అయ్యప్ప మాల ధారణ వేసుకున్న స్వాములకు ఖమ్మంలోని వీడియోస్ కాలనీలో గల పాత వెంకటేశ్వర థియేటర్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేలాది అయ్యప్పలు మాల ధారణ కాలంలో వీరి అన్న సంతర్పణలో సంతృప్తిగా భుజిస్తూ స్వామి శరణం అంటూ సాగుతున్నారు. అక్టోబర్ నవంబర్ జనవరి మాసాల్లో దాదాపు 100 రోజులు ఈ అన్న సందర్భంగా ఎటువంటి" *ఆటంకం లేకుండా సాగిస్తున్నారు రాంప్రసాద్ గురుస్వామి ఈ స్వామికి మరికొందరు స్వాములు ఆర్థికంగానూ.. సేవ పరంగాను వారి యొక్క చేయూతను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం కొనసాగించడంలో ఎందరో సహకారం ఉందని వారందరికీ తన ధన్యవాదాలు అయ్యప్ప ఆశీస్సులు ఉంటాయని రాంప్రసాద్ గురుస్వామి పేర్కొన్నారు ..*
*అయ్యప్పల రక్తదానం..*
*మాధవ సేవ తోపాటు మానవ సేవ అన్నట్లుగా ఈ ఏడాది కొందరు స్వాములు రక్తదానం కార్యక్రమం చేపట్టి దాన్ని* *విజయవంతం చేశారు. స్వాములే కాకుండా ఇతరులు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని రక్త దాతలుగా నిలిచారు. వీరిలో కొందరు రక్తదానం అనంతరం మాల ధారణ చేయడం విశేషం.*

No comments:

Post a Comment