ఇళ్ల స్థలాల విషయం నాలుగు గోడల మధ్య చర్చించేది..
*వచ్చే వారం జర్నలిస్ట్లకు కొత్త అక్రిడిటేషన్లు*
ఖమ్మం జిల్లా: జర్నలిస్టులకు సంబంధించి ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇళ్ల స్థలాల విషయం న్యాయపరమైన సమస్య లు వున్నందున ఇలా సభలో చెప్పలేమని.. వాటిని వేరేగా చర్చిద్దాం అని మంత్రి స్పష్టం చేశారు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్లాలోని వైరాలో టీయూడబ్ల్యూ జే (ఐజేయూ) నాల్గో జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
*వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి*
వచ్చేవారంలో అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో యూనియన్ నాయకులతో చర్చించి ఫైనల్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత వెంటనే హెల్త్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉండటంతో న్యాయ నిపుణులతో చర్చించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మాటిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. జర్నలిస్టులకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు..
--------------------------------------------------------------------
*వార్తలు రాసేముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి..!!*
*జర్నలిస్టులకు తహశీల్దార్ యూనియన్ నేతల విజ్ఞప్తి*
*ఏదైనా సమస్య ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలి.*
*జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది., బ్లాక్ మెయిల్ పాల్పడే వారిపై పిర్యాదులు చేశాం..*
*బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి ఓ ఆన్లైన్ పత్రిక తనపైన తప్పుడు వార్తలు రాసి మానసిక వేదనకు గురి చేసిందని* అయినవోలు *తహసిల్దార్ విక్రమ్ కుమార్* అన్నారు.
*వరంగల్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ లో వరంగల్ జిల్లా తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు* చేశారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని, గత ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందని, అయినా అవి ఏమీ పట్టించుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నామని, *ఒక ఆన్లైన్ పత్రిక వారు అసత్య రాతలు రాసి, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని వారిపై మాత్రమే ఫిర్యాదు చేశామని,* ఎవరికైనా తమపై అనుమానాలు ఉంటే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, కానీ *ఆర్థికంగా డబ్బులు ఇస్తావా? లేదా? అని బెదిరింపులకు పాల్పడడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని* దీంతో పోలీసులు ఆశ్రయించానని విక్రమ్ కుమార్ తెలిపారు,
*తనకు మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉందని, పత్రిక విలేకరులపైన, వారి వృత్తి పట్ల అత్యంత అభిమానం, గౌరవం ఉన్నాయని* అయినవోలు *ఎమ్మార్వో విక్రమ్ కుమార్* తెలిపారు. కానీ *బ్లాక్ మెయిల్ చేసే ఆ..జర్నలిస్ట్ లను భరించలేక మాత్రమే పోలీస్ లను ఆశ్రయించానని* తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో వరంగల్ తహాసిల్దార్ ఇక్బాల్, ఖిలావరంగల్ తహసిల్దార్ నాగేశ్వరరావు, హన్మకొండ తహసిల్దార్ రవీందర్, హసన్ పర్తి తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్లు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment