Friday, 18 September 2020

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోనే శాస్త్రోక్తంగా బ్ర‌హ్మోత్స‌వాలు.. 23న స్వామివారికి సిఎం జగన్ ప‌ట్టువ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ...

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య అంకురార్ప‌ణ జ‌రిగిందని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. శ‌నివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంట‌ల మ‌ధ్య‌ మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌ంంకాగా. ఈ నెల 23వ తేదీ గ‌రుడ‌సేవ రోజున సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందువ‌ల్ల గ‌రుడ‌సేవ రోజు స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించనున్నారని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  తిరుమల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో క‌లిసి శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. 
బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హింంచనున్నట్లు తెలిపారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుందని.
24వ తేదీ ఉద‌యం ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ య‌డ్యూర‌ప్ప‌తో క‌లిసి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుంటారని పేర్కొన్నారు. అనంత‌రం ఉద‌యం 7 గంట‌ల‌కు నాద‌నీరాజ‌న వేదిక మీద జ‌రిగే సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో పాల్గొంటారని. ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ర్ణాట‌క స‌త్రాల నిర్మాణానికి ముఖ్య‌మంత్రులిద్ద‌రు భూమిపూజ చేయనున్నట్లు ఎస్వీ తెలిపారు. 
 ఈసారి స్వ‌ర్ణ‌ర‌థం, ర‌థ‌రంగ డోలోత్స‌వం బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుందని.ఈ నెల 27వ తేదీన చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయని పేర్కొన్నారు.
 తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భ‌‌క్తులు ఎదురు చూస్తారని. ఈ ఏడాది కోవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయాల‌నే ఉద్దేశంతో పాల‌క‌మండ‌లి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిందని అన్నారు.. ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుపుతామని
స్వామివారికి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారన్నారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని తెలిపారు. టిటిడి ప్ర‌జాసంబంధాల విభాగం ద్వారా మీడియాకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, ఫొటోలు అందుతాయని చెప్పారు.
సిఎం ఆదేశం మేర‌కే కాగ్ ఆడిటింగ్‌
మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల టిటిడి మీద, ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీద చేసిన ఆరోప‌ణ‌ల గురించి విలేక‌రులు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డిని ప్ర‌శ్నించగా
తిరుమ‌ల‌లో రాజ‌కీయాంశాలు మాట్లాడ‌డం ప‌ద్ధ‌తి కాద‌ని ఆయ‌న తిర‌స్క‌రించారు. 
మాజీ ముఖ్య‌మంత్రి టిటిడికి సంబంధించిన అంశాల‌పైనే ఆరోప‌ణ‌లు చేసినందువ‌ల్ల స్పందించాల‌ని విలేక‌రులు కోరారు.
గ‌త‌ ప్ర‌భుత్వ హ‌యాంలో టిటిడిలో జ‌రిగిన నిధుల దుర్వినియోగం, అవ‌క‌త‌వ‌క‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వంతో సంబంధం లేని సంస్థ‌తో ఆడిటింగ్ చేయించాల‌ని ఎంపి సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హైకోర్టులో పిల్ వేశార‌ని ఛైర్మ‌న్ చెప్పారు. 
ఈ విష‌యం గురించి తాను ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన‌పుడు గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే కాకుండా ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా జ‌రిగిన నిధుల ఖ‌ర్చుపై కాగ్‌తో ఆడిటింగ్ చేయించాల‌ని సిఎం ఆదేశించారు. 
పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని సిఎం తీసుకున్న ఈ నిర్ణ‌యం మేర‌కు టిటిడి నిధుల వ్య‌యంపై కాగ్ ఆడిటింగ్ జ‌రిపించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో తీర్మానం చేశాం. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల‌లో జ‌రిగిన ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను, అవినీతిని తాము పూర్తిగా నిర్మూలించాం. తిరుమ‌ల‌లో ఎలాంటి అన్య‌మ‌త ప్ర‌చారం జ‌ర‌గ‌లేదు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో నెల్లూరు ఆర్‌టిసి డిపోలో ముద్రించిన అన్య‌మ‌త ప్ర‌చార టికెట్ల‌ను కుట్ర‌పూరితంగా తిరుమ‌ల‌కు పంపిన విష‌యం విచార‌ణ‌లో తేలింది. దీని మీద పోలీసు కేసు కూడా న‌మోదైందని వివరించారు.
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మీద న‌మ్మ‌కం, భ‌క్తి ఉన్న అనేక‌మంది ఇత‌ర మ‌తాలకు చెందిన వారు ద‌ర్శ‌నానికి వ‌స్తారని కోవిడ్‌-19 నేప‌థ్యంలో టిటిడి ఆదాయం త‌గ్గినా స్వామివారి కైంక‌ర్యాలు, ఆగ‌మ కార్య‌క్ర‌మాలు ఎలాంటి లోటు లేకుండా కొన‌సాగుతున్నాయని పేర్కొన్నారు.
కోవిడ్ ఇబ్బందుల వ‌ల్ల బ్యాంకులు వ‌డ్డీ త‌గ్గించ‌డంతో గ‌తంలో టిటిడి డిపాజిట్ల మీద 9 శాతం దాకా వ‌చ్చే వ‌డ్డీ ప్ర‌స్తుతం 4.5 శాతానికి త‌గ్గింది. డిపాజిట్ల మీద అధిక వ‌డ్డీ ల‌భించేలా చేయాల‌నే ఉద్దేశంతోనే నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఆర్‌బిఐ గ్యారంటీ ఉంటే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సెక్యూరిటీ బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆలోచించామన్నారు. సమావేశంలోటిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ
అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి భూమిపూజ జ‌రుగుతున్న స‌మ‌యంలో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం లైవ్ ఉన్నందువ‌ల్ల ఎస్వీబీసీ ఆ కార్య‌క్ర‌మాన్ని లైవ్ ఇవ్వ‌లేక‌పోయిందని. ఆ త‌ర్వాత వార్త‌ల్లోను, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలోను ఈ అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌సారం చేసిందని చెప్పారు.శ్రీ‌వారి ఆల‌యంలో హుండీ నిండిన త‌రువాతే కొత్త వ‌స్త్రం మార్చ‌డం జ‌రుగుతుందని.ఈ ఏడాది డిసెంబ‌రుకు రూ.5 వేల కోట్ల డిపాజిట్లు కాల‌ప‌రిమితి ముగుస్తుందని. ఆ త‌రువాత అధిక వ‌డ్డీ వ‌చ్చేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌స్తామని చెప్పారు. 
శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ కోవిడ్ నేప‌థ్యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించినందున. చ‌క్ర‌స్నానానికి సంబంధించి ఆల‌యంలోనే ఏర్పాట్లు చేశామని. అయినా, అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం మార్పులు వుంటాయని చెప్పారు. అష్ట‌దిక్పాల‌కుల‌కు జ‌రిగే ఉప‌చారాలు, బ‌లి, నైవేద్యాల స‌మ‌ర్ప‌ణ ఆల‌య ప్రాకారంలోనే నిర్వ‌హింంచామన్నారు. ఈ మీడియా స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌,  సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment