కల్పవృక్ష వాహనంపై భక్తుల కోరికలు ఈడేర్చే కల్పతరువుగా తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాసుడు దర్శనం ఇచ్ఛాడు.
తలపాగా, జాటీతో గోపాల నందనందునిగా మలయప్ప కనువిందు చేశాడు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై తలపాగా, జాటీతో గోవుల గోపన్నగా దర్శనమిచ్చారు.
కల్పవృక్ష వాహనం – ఐహిక ఫల ప్రాప్తి
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీ శివకుమార్, శ్రీ శేఖర్రెడ్డి, శ్రీ గోవిందహరి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment