Thursday, 24 September 2020

సర్వభూపాలవాహ‌నంపైశ్రీదేవిభూదేవిస‌మేతశ్రీ‌మలయప్ప

  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం  సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు #స్వ‌ర్ణ‌ర‌థంబదులుగాశ్రీవారిఆలయంలోనిక‌ల్యాణోత్సవమండ‌పంలోశ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతోకలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.
 సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.   అనంతరం రాత్రి 7.30 గంటలకు శ్రీవారు గజవాహనంపై  లక్మీరమణునిగా దర్శనం ఇచ్ఛారు.కాగా ఉదయం తిరుమల గిరి రాయలు...
శ్రీరామ చంద్రునిగాధనుర్బాణాలతో..అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుని భూజస్కందాలపై నిలచి భక్తులకు దర్శనమిచ్చారు...

No comments:

Post a Comment