విజయవాడ :
అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు నిర్వహణకు ఆలయ అధికారులు సన్నధం అవుతున్నారు..9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మకు
వేదమంత్రాల నడుమ కుంకుమ అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు
అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమివ్వనున్న దుర్గమ్మ
18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా...
19న శ్రీ గాయత్రీ దేవిగా,
20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా ,
21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ
22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా,
23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా,
24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం... అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం
కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం.
రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారులు సమీక్షలు చేస్తున్నారు.
గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు
ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్న దుర్గగుడి అధికారులు.
No comments:
Post a Comment