Monday, 30 January 2023

నేను చూసిన తిరుమల రధసప్తమి..


విమానాల్లో తిరిగే సాఫ్ట్వేర్ భార్య కుమారుడితో..తిరుమల తరలివచ్ఛి..తిరుమల మాడవీధిలో ఉదయం 4గంటలకే మాడవీధిలో కూర్చొని... సూర్యప్రభ వాహనం మొదలు..రాత్రి 8గంటల వరకు వచ్ఛిన ప్రతి వాహనానికి గ్యాలరీ నుంచే  కర్పూర హారతి ఇస్తూ ఉపవాసంతో తిరుమల వాసుని దోసిలి మొగ్గి ఆర్తితో..అను రక్తితో గోవిందా అంటున్న దృశ్యం నేను చూశాను..
హైదరాబాద్ నుండి 
ఇద్దరు ఆడపిల్లలతో 
తరలి వచ్ఛిన కోటిశ్వరుని ఇల్లాలిది అదే భక్తి..అదే ఆర్తి అదే అనుభూతి..
మరో రైతు ..ఇంకో వ్యాపారి..మరో ఉద్యోగి..ఇంకో చిరువ్యాపారి..మరో కూలి..ఇంకో చిరు ఉద్యోగి..
15 గంటల పాటు తిరుమల మాఢవీధుల్లో ఎంతో ఒపికగా ఎంతో ఒద్దికగా... గొవిందుని ఏడు వాహనాలకు..హారతులు ఇస్తూ.  అర్తిగా..గోవిందా అంటూ ఆత్మానందం పొందిన క్షణాలు ..కోవేల వదిలి.. భక్తులను కరిణించేందుకు..కటాక్షించేందుకు వచ్ఛిన లక్మీ వల్లభూనికి..పద్మావతి రమణునికి... ఆపద మొక్కులవానికి మాఢవీదుల్లో  అడుగడుగునా
నిరాజన కైంకర్యాలు... అధ్భుతం...అది అమోఘం...అందరి పట్ల ఆశ్రీత వత్సలునిది అదే అభిమానం..అదేవాత్సల్యం.. అదే కరుణా రసం..
కడగి ధనికుని మీద కురయు  చూపోకటే..పుడమి పేదనిపై వెలయు కరుణోకటే..కడు పుణ్యులను..పాప కర్ములను జడగాయూ వెంకటపతి నామమోకటే...
తిరుమల లో శనివారం.. సూర్య రధసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు...
ఉదయం నుండి రాత్రి వరకు 
ఏడువాహనాలపై తరలివచ్ఛిన శ్రీనివాసుని చూసి భక్తజనం పరవశించారు..
..................@ మణికుమార్ కొమ్మమూరు
తిరుమల శ్రీవారి సేవలో..మోబైల్ : 9032075966.
తిరుమల రధ సప్తమి వేడుకల బంధోబస్తుకు వచ్ఛిన కానిస్టేబుల్ ముస్లిం మతస్తుడు..
 సైతం తన విధులను ఎంతో బాధ్యత గా నిర్వహించారు..
వెంకటేశ్వరునితో తన అనుబంధాన్ని.. నాతో పంచుకున్నారు

Thursday, 26 January 2023

ఖమ్మంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ వి పి గౌతం ...


ఖమ్మం, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో 74 వ గణతంత్ర దినోత్సవ  వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ప్రగతిపై ఆయన సందేశం ఇచ్చారు. పాఠశాలల విద్యార్థులచే చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.  గణతంత్ర వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డి.సి.సి.బి.చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఉమామామహేశ్వరరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా, అదనపు డి.సి.పి. డా. షబరిష్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 25 January 2023

నేలకొండపల్లిలో ఘనంగా భక్తగ్రేసరుడు రామదాసు జయంతి వేడుక...


ఖమ్మం, జనవరి 25: శ్రీరాముని అపర భక్త గ్రేసరుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా పాలనా యంత్రాంగం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం, స్థానిక భక్తరామదాసు కళాపీఠం ఆధ్వర్యంలో నేలకొండపల్లి లో  స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ధ్యాన మందిరంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వేద పండితులచే చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. భక్త రామదాసు విగ్రహంపై నిర్మించిన మండవ గోపురంపై కలశం ప్రతిష్ట, సంప్రోక్షణ, తీర్థ ప్రసాదాలు, మాలాధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భక్త రామదాసు జన్మ క్షేత్రంలో ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడిటోరియం నిర్మాణ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీ నిధులు రూ. 10 కోట్లలో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. 3 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
     కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ తదితర పనులు రూ. 75 లధ్యాన మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని అపర భక్తాగ్రేసరుడైన భక్తరామదాసు చరిత్రను రానున్న తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ విస్తతంగా ప్రచారం చేయాలన్నారు. ధ్యాన మందిరంలో జరుగుతున్న ఆలయ ఆధునీకరణ పనులు సైతం నత్తనడకన సాగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, నేలకొండపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ రాయపూడి నవీన్‌, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, దోసపాటి కల్పన, స్థానిక శ్రీ భక్త రామదాసు విద్వత్‌ కళాపీఠం అధ్యక్షులు సాదు రాధాకృష్ణమూర్తి, మందిరం పూజారి రమేష్‌, సంగీత అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 24 January 2023

ప్రకృతి వనంలో మొక్కలు నాటిన కలేక్టర్


ఖమ్మం, జనవరి 24: సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ భవన సముదాయం ఆవరణలో ఏర్పాటుచేసిన బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవన సముదాయం ఆవరణలో 3 ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 3 వేల మొక్కలు ఇట్టి వనంలో నాటుతున్నట్లు ఆయన అన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  అంతకుముందు కలెక్టర్ భవన సముదాయం లోని ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్, కలెక్టరేట్ రికార్డు రూం లను సందర్శించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. సముదాయం లో అధికారుల, సిబ్బంది వాహనాల పార్కింగ్ పై సూచనలు చేశారు. పార్కింగ్, నో పార్కింగ్ సైన్ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. 
    ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్డీఓ విద్యాచందన, అధికారులు తదితరులు ఉన్నారు.

Saturday, 21 January 2023

తెలంగాణలో రహాదారులు -భవనాలకు గృహానిర్మాణం..

హైదరాబాద్ : _తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది._ _రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ‌లో గృహ నిర్మాణ శాఖను విలీనం చేస్తూ ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు._

గృహ నిర్మాణ శాఖ ఆస్తులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆర్ అండ్ బీ శాఖ‌కు బ‌దిలీ చేశారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆస్తులు, ప‌థ‌కాలు, సిబ్బంది బాధ్య‌త‌ల‌ను ఆర్ అండ్ బీ శాఖ‌కు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకోసం ఆర్ అండ్ బీ శాఖ‌లోనే ప్ర‌త్యేక సెల్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.
ఈ శాఖలో ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో పాటు బలహీనవర్గాల గృహ నిర్మాణాన్ని ఇతర శాఖలు చేపడుతున్నందున ఈ శాఖను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాఖలోని గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్‌ స్వగృహ, దక్కన్‌ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
శాఖలో మిగిలిన అంశాలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఆర్‌ అండ్‌ బీ శాఖకు బదిలీ చేసింది. దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ, ఆర్‌ అండ్‌ బీ, సాధారణ పరిపాలనా శాఖలను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు.

Wednesday, 18 January 2023

గులాబీ దళపతి కెసిఆర్ భుజం తట్టారు...ఎర్రదండు నేత కరచలనం చేశారు.. ఇది ఖమ్మం కలెక్టర్ కు దక్కిన ప్రత్యేక గౌరవం..




గులాబీ దళపతి కెసిఆర్ భూజం తట్టారు...ఎర్రదండు నేత కరచలనం చేశారు.. ఇది ఖమ్మం కలెక్టర్ కు దక్కిన ప్రత్యేక గౌరవం..అంతే కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి,అరవింద్ కేజ్రీవాల్,  పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ,సమాజ్ వాది ఛీఫ్ అఖిలేష్ యాదవ్తో పాటు పలు పార్టీ ల నేతలు..బిఆర్ఎస్ ముఖ్యనేతల శుభాకాంక్షలు అందుకున్న ఏకైక కలెక్టర్ గా ఖమ్మం కలేక్టర్ వి.పి.గౌతమ్ గుర్తుండిపోతారు. .ఈ సన్నివేశం ఖమ్మం సమీకృత కలేక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది..
వివరాల్లోకి వెళితే.....
ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు
సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ గురించి జాతీయ నేతలకు సీఎం కేసీఆర్‌ వివరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలు నేతలకు వివరించారు.
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని భావించారు. ఆ తర్వాత భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. ఇందులో భాగంగానే ఖమ్మం వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద తెలంగాణ సర్కారు నయా కలెక్టరేట్‌ను నిర్మించింది. వెయ్యి అడుగుల ఫేసింగ్‌, 11 వందల అడుగుల లోతు ఉండేలా చేపట్టే ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను రూ.53.20 కోట్ల వ్యయంతో నిర్మించింది. అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతంగా సమీకృత కలెక్టరేట్‌ రూపుదిద్దుకున్నది.

Friday, 13 January 2023

ప్రగతి భవన్ లో ఘనంగా జరిగిన గోదాదేవి కళ్యాణం..పాల్గొన్న కెసిఆర్ దంపతులు....


పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో  సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది. 
వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు శోభ దంపతుల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగ కొనసాగింది.
హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది.

ఘనంగా ముగిసిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. జనవరి 7 నుండి శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి నీరాటోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి శ్రీ రామచంద్ర తీర్థ క‌ట్ట‌కు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడున్న మండ‌పంలో అమ్మ‌వారిని కొలువుతీర్చి వేడినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అడుగుడుగునా హారతులు సమర్పించారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

Thursday, 12 January 2023

సరిహద్దుల్లో డ్రోన్ల వేట..తలపై రూ.45లక్షల రివార్డు..!*చిక్కినట్లే చిక్కి.. తప్పించుకున్న హిడ్మా?.



హెలికాప్టర్‌, డ్రోన్ల ద్వారా వేట.. చిక్కినట్లే చిక్కి.. తప్పించుకున్న హిడ్మా?.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో నక్సల్స్‌, పోలీసులకు మధ్య కాల్పులు


భూపాలపల్లి, చర్ల, జనవరి 11:

పాతికేళ్లుగా పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా కోసం హెలికాప్టర్.. డ్రోన్ ల వేట కొనసాగుతోంది.. 

తలపై రూ.45లక్షల రివార్డు వున్న హిడ్మా ఆచూకీ దండకారణ్యంలో పోలీసులకు సవాల్‌గా మారిన నేపథ్యంలో  మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) మొదటి బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ అలియాస్‌ హిద్ముల్లా టార్గెట్‌గా పోలీసులు స్పెషల్‌ ఆపరేషన్‌ను చేపట్టారు.
భద్రాద్రి జిల్లా చర్ల మండల సరిహద్దులోని.. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా చింతల్నార్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలౌరీ అడవుల్లో హిడ్మా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఓ బృందం బుధవారం సాయంత్రం హెలికాప్టర్‌, డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఈ క్రమంలో హెలికాప్టర్‌ యాంపురం గ్రామం సమీపంలోని అడవుల వద్దకు చేరుకోగానే.. కింది నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. హెలికాప్టర్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఆ సమయంలో హిడ్మా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మా, అతని అనుచరులు ఈ దాడిలో మృతిచెందినట్లు ప్రచారం జరిగినా.. పోలీసులు దీన్ని నిర్ధారించలేదు. ‘‘హెలికాప్టర్‌లో ఉన్నవారంతా క్షేమంగా బేస్‌క్యాంప్‌ చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు’’ అని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. హిడ్మాపై రూ.45లక్షల రివార్డు ఉంది. భద్రతా దళాలను హతమార్చిన ఘటనల్లో హిడ్మా కీలక నిందితుడు. పాతికేళ్లుగా పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు.

*కన్నుగప్పి తప్పించుకున్న హిడ్మా?*

దండకారణ్యంలో అణువణువూ తెలిసిన హిడ్మా.. పోలీసుల ఆపరేషన్‌ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి హిడ్మా బలౌరీలో సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడి నుంచి చుట్టూ నాలుగు అంచెల్లో హిడ్మా అంగరక్షకులు కాపుకాచారని తెలుస్తోంది. కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌ బలగాల హెలికాప్టర్‌, డ్రోన్లు బలౌరీ వైపు వెళ్తుండడాన్ని గమనించే.. యాంపురం వద్ద ఉన్న హిడ్మా అనుచరులు కాల్పులు జరిపినట్లు స్పష్టమవుతోంది. పోలీసు తేరుకొనేలోపే హిడ్మా ఎస్కేప్‌ అయినట్లు తెలిసింది.

*తెలంగాణ సరిహద్దుల్లో హైఅలెర్ట్‌*

ఛత్తీస్ గఢ్‌ కాల్పుల ఘటన నేపథ్యంలో మావోయిస్టులు తలదాచుకునేందుకు తెలంగాణలోకి వచ్చే అవకాశాలుండడంతో.. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం సరిహద్దుల వద్ద హైఅలెర్ట్‌ ప్రకటించారు.

*అటవీ గ్రామాల్లో దాడులు: మావోయిస్టులు*

సీఆర్పీఎఫ్‌, కోబ్రా బలగాల ఏరియల్‌ దాడులను మావోయిస్టులు ఖండించారు. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోని గ్రామాల్లో వైమానిక బాంబు దాడులు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సుక్మా సౌత్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో బుధవారం అర్ధరాత్రి ఓ లేఖ విడుదలైంది. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు డ్రోన్‌లు, హెలీక్రాఫ్టర్ల ద్వారా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.

*హిడ్మా స్కెచ్‌ వేస్తే..*

2007లో సుక్మా జిల్లా ఉర్పల్‌మెట్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి చేసి, హతమార్చాడు

2010లో తడ్‌మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు

2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్‌ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర

2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను హతమార్చాడు

2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు.

శబరిమలై లో ప్రసాదాల అమ్మకం నిలిపివేత...6 లక్షల టిన్నులు తొలగింపు

*తిరువనంతపురం, కేరళ

శబరిమల అరవనంలో ఉపయోగించే ఏలకులు తీవ్రమైన క్రిమిసంహారం అని తేలింది. దీని ఆధారంగా సన్నిధానంలో అరవణ పంపిణీని హైకోర్టు అడ్డుకుంది. ఉన్న అరవణ పాయసం సీల్ చేయాలని కూడా కోర్టు సూచించింది. శబరిమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్  ఏలకులు లేకుండా అరవణాలను దేవస్వం బోర్డు తయారు చేసి పంపిణీ చేయవచ్చని హైకోర్టు కూడా చెప్పింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైకోర్టులో సమర్పించిన నివేదికలో ఏలకుల్లో తీవ్రమైన పురుగుమందులు ఉన్నాయని పేర్కొంది. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ పరిశీలించిన యలకుల్లో తీవ్రమైన మోతాదులో పురుగుమందులు ఉన్నట్లు తేలింది.

స్పైసెస్ బోర్డ్ పై తనిఖీ నిర్వహించారు. ఈ యాలకులో పద్నాలుగు జాతుల పురుగుమందులు ఉన్నాయి. ఇవి అనుమతించదగిన పరిమాణం కంటే ఎక్కువ. బబుల్ కిల్లర్స్ , కలుపు కిల్లర్స్ తనిఖీలో కనుగొనబడ్డాయి. ఇవి మానవ శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి దర్యాప్తులో కనుగొనడం సీరియస్ గా ఉందని కోర్టు గమనించింది. తినలేని యాలకులతో అరవణ తయారు చేస్తారా, అరవణ స్టాక్ ఎంత ఉందని గతంలో కోర్టు అడిగ

No Cyber Attacks Reported Said White House...All fleights or on Board in US

👉Flight Aware is reporting more than 3,500 flights have already been delayed in  US - a jump of more than a thousand  due to a major FAA computer outage.
The White House says there is no evidence of a cyber attack.
The domino effect of this morning's delay will continue throughout the day. A computer outage at the Federal Aviation Administration brought flights to a standstill across the U.S. early Wednesday, with thousands of delays quickly cascading through the system at airports nationwide.

Wednesday, 11 January 2023

కంటివెలుగు విజయవంతానికి అందరికృషి అవసరం : కలెక్టర్ వి.పి.గౌతమ్.


ఖమ్మం, జనవరి 11: కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా. జి. శ్రీనివాసరావు లతో కలిసి వైద్యాధికారులతో కంటి వెలుగు కార్యక్రమ అమలుపై కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం చాలా కాలం నిర్వహించినట్లు, ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం 100 పని దినాలలో చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో 55 కంటి వెలుగు బృందాలు ఏర్పాటుచేసినట్లు, అన్ని బృందాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. బృందాలన్నింటికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేయాలన్నారు. కంటి పరీక్షలు నాణ్యతతో చేయడం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. జిల్లా సీనియర్ వైద్య శాఖ అధికారి నిర్వహణ బాధ్యతలు చేపట్టాలన్నారు. బృందం కంటి వెలుగు శిబిరాన్ని ఉ. 9.00 గంటల నుండి సా. 4.00 గంటల వరకు సోమవారం నుండి శుక్రవారం వరకు వారానికి 5 రోజులు నిర్వహించాలన్నారు. బృందాలకు రోజువారీ భోజన ఖర్చులకు రూ. 1500 లు జిల్లా వైద్య, ఆరోగ్యాధికారికి మొత్తం పంపినట్లు, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అట్టి మొత్తం పంపిణీ చేయాలన్నారు. బృందానికి రవాణా కొరకు అద్దె కారు కు అనుమతించినట్లు ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్, కంటి స్క్రీనింగ్ తదుపరి రెండుసార్లు డాటా నమోదు చేయాల్సి ఉంటుందని, నమోదులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఎడిఎం, డీడీఎం, ఏఎన్ఏం బృంద సిబ్బందికి శిక్షణ ఏర్పాటుచేసి పూర్తి చేయాలన్నారు. లేటెస్ట్ వర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. శిబిరం వద్ద క్యూ లైన్ పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రోజు కార్యక్రమం పూర్తి కాగానే ఇంవెంటరీ మాడ్యూల్ లో వివరాలు నమోదు చేయాలని, ఎన్ని రకాల, ఎన్ని కళ్ళజోళ్ళు ఇచ్చినది, మిగులు, ఇంకా అవసరాలు నమోదు చేయాలని అన్నారు. ఏఆర్ మిషన్లు మంచి స్థితిలో ఉండాలని, అన్ని పరికరాలు ముందస్తుగా చూసుకొని ఎన్నికల సన్నద్ధంలా ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో శిబిరం కేంద్రాల వద్ద టెంట్, త్రాగునీరు, కుర్చీలు, టేబుళ్లు అన్ని మౌళిక వసతుల కల్పన చేయాలన్నారు. శిబిరం ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి ప్రజల సేకరణ ఎంతో ముఖ్యమని ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో ప్రతిరోజు 120 మంది పరీక్షలకు వచ్చేట్లు చూడాలన్నారు. ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేసి, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేయాలన్నారు.సమీక్ష లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ, డిఎంవో, డాటా ఎంట్రీ వారు ఎంతో ముఖ్యమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు నాయకత్వంతో ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, శిబిరం బృంద, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. బఫర్ సిబ్బంది, మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యలు వస్తే, అర గంటలో రీప్లేస్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, పీఆర్, మునిసిపల్ అధికారులు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆమె తెలిపారు. ఇన్వెంటరీ ని నమోదు చేస్తూ, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమ నిర్వహణ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టి కార్యక్రమం విజయవంతం చేస్తామన్నారు. సూక్ష్మ ప్రణాళిక రూపొందించి అమలుచేస్తామన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సమావేశాలు నిర్వహించి, షెడ్యూల్ ఆందజేసినట్లు ఆయన అన్నారు. అన్నిరకాల చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమని, వ్యక్తిగత శ్రద్దతో చేపట్టాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి జిల్లా స్థాయిలో, వైద్యాధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో నాయకత్వం వహించాలన్నారు. అన్ని ఏర్పాట్లు రెండు రోజుల్లో పూర్తి చేసుకొని, సన్నద్ధంగా ఉండాలన్నారు. అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని ఆయన తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ తో రోజువారి ప్రజాసేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఎంసిహెచ్, ఎన్సీడి, ఇమ్యునైజేషన్ తదితర సేవలు ఆగకూడదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఎంఐ డిసి ఎండి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇన్వెంటరీ స్టాకును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, అవసరాలను ముందస్తుగా తెలిపితే సరఫరా కు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏఆర్ మిషన్లలో లోపం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, టెక్నీషియన్లను పంపి సరిచేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతి, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. రాంబాబు, వైద్య ఆరోగ్య ప్రాజెక్ట్ అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 10 January 2023

ఏమ్మేల్సీ రేసులో 40 మంది..జగన్ కు చేరిన లిస్థు..... ఆధినేత మదిలో పార్వతి పురం నేత పేరంటున్న అబిజ్ఞ వర్గాలు..!!

రానున్న ఎమ్మెల్సీ ఎంపిక జాబితా లో ప్రస్తుత టిడ్కో ఛైర్మన్ ప్రసన్న కుమార్ కి చోటు దక్కినట్టు సమాచారం..గత ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికి జగన్ ప్రసన్న కుమార్ కి టిడ్కో ఛైర్మన్ పదవితో సరిపెట్టారు. అయితే ఛైర్మన్ పదవి ప్రసన్న కుమార్  నీ సంతృప్తి పరచలేకపో యింది. అందుకే ఓ వైపు పార్వతిపురం నియోజకవర్గం లో తిరుగుతూ మరో వైపు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పార్వతి పురం ఎమ్మెల్యే గా ఉన్న జోగారావు పై అనేక అవినీతి ఆరోపణలు, సొంత వర్గంలో చీలికలు రావడంతో ప్రసన్న కుమార్ కి జనాదరణ పెరుగుతుంది. గత ఎన్నికలలో ప్రసన్న కుమార్ కీ టికెట్ ఇవ్వకుండా జోగారావు కి టికెట్ ఇవ్వడం పై సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు విమర్శలు ఆలస్యంగా సంధిస్తున్నారు..ఈ తరుణంలో పార్వతి పురం కేడర్ రెండూ ముక్కలు అవుతుంది అని గమనించిన ప్రసన్న కుమార్ కి ఎమ్మెల్సీ  పదవి  ఇచ్చి ఓ వైపు ఓట్లు చిలకుండ మరో వైపు నాయకుడు పోకుండా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కానీ ప్రసన్న కుమార్ చివరి వరుకు ఈ జాబితాలో ఉంటారా అనేది ప్రశ్న. ఇప్పటి వరకూ ప్రసన్న కుమార్ పేరు సొంత నియోజకవర్గం లో తప్పా పక్క వారికి తెలీదు. రాష్ట్రం మొత్తం TIDCO గృహాల వద్ద పర్యటన చేస్తున్న ఒక్క వార్త వచ్చిన దాఖలు లేదు.తిరుగుతూ పని చేస్తున్న ప్రచారం లేకపోవడంతో  ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న ఎమ్మెల్సీ ల జాబితాలో పదవీ వచ్చే జాబితా వరుకు చేరుకోవడం చాలా కష్టమే ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు డబ్బు, మందు, ప్రచారం చుట్టూ తిరుగుతూ వస్తున్నాయి అలాంటిది అన్నిటికీ దూరంగా ప్రయాణిస్తున్న ప్రసన్న కీ ఎమ్మెల్సీ పదవి ప్రసన్నం అవుతుందా అంటే పెద్ద ప్రశ్న గా మారింది. లేదా స్థానిక ఎమ్మెల్యే జోగారావు మీద ఉన్న ఆరోపణలు తో ప్రసన్న కుమార్ కి టికెట్ ఇస్తారా అంటే జోగారావు అవినీతి డబ్బు తో అందరి ( మీడియా,అధికారులు) నోరు మూసేస్తున్నాడు. ఇలాంటి కష్ట తరుణంలో ప్రసన్న కుమార్ కి టికెట్ వస్తుందా.. అతని సన్నిహితులు కి మాత్రం టికెట్ వస్తుంది అని ప్రసన్న కుమార్ చెప్పుకొని తిరుగుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి వద్ద ఉన్న 40 మంది లిస్ట్ లో ప్రసన్న కుమార్ పేరు ఉంది. మరి అందులో నుంచి లిస్ట్ కట్ ఆఫ్ 23 కి వెళ్తుంది. ఆ 23 మంది లో ఆయనకి చోటు దక్కితే అదృష్టవంతుడే అవుతాడు.

Sunday, 8 January 2023

ఊహలు గుసగుసలాడే..


హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు  నివాసానికి  వెళ్లిన పవన్ కళ్యాణ్ కుప్పం సంఘటన పై చర్చించారని తెలుస్తుండగా రాబోయే ఎన్నికల్లో పొత్తు

ఖరరైతే చంద్రబాబును పవన్ కళ్యాణ్ అడుగుతున్న సీట్లలో 24అసెంబ్లీ సీట్లు ఇవే.. అన్నట్లు ఊహాగానాలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

1. విశాఖ నార్త్
2. చోడవరం
3. గాజువాక
4. భీమిలి
5. యలమంచిలి
6.రాజానగరం
7. అమలాపురం
8.రాజోలు
9. కాకినాడ రూరల్
10. భీమవరం
11. నరసాపురం
12. తాడేపల్లి గూడెం
13. కైకలూరు
14. విజయవాడ పశ్చిమ
15. తెనాలి
16. సత్తెనపల్లి
17. గుంటూరు పశ్చిమ
18. పుట్టపర్తి
19. గిద్దలూరు
20. చీరాల
21. చిత్తూరు
22. తిరుపతి
23. దర్శి
24.అనంతపురం అర్బన్..

కాగా ఈనాటి బేటీ పై వైకాపా శ్రేణులు విమర్శలు గుప్పించాయి...

Friday, 6 January 2023

తెరుచుకున్న రుద్ర ద్వారాలు... శైవక్షేత్రల్లో ఘనంగా అరుద్ర అభిషేక అర్చనలు....

శివాలయాల్లో పుష్యపూర్ణమి ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు హోమాలు అభిషేకాలు అర్చనలతో వివిధ శివాలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు సందడి మొదలైంది ప్రముఖ క్షేత్రమైన అమరావతి శ్రీశైలం కాళహస్తి తదితర సవిక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి ముఖ్యంగా శైవుల ప్రప్రధమ శివాలయం తమిళనాడు శ్రీ రామనాథపురం జిల్లా లోని ఉత్తర కోసం మంగై మంగళ నాథ స్వామి..
ఈ లోకంలో ప్రప్రధమ శివాలయం ఉత్తరకోస మంగై మంగళనాధ స్వామి శివాలయం అని శైవులు ధృఢంగా చెప్తారు. దేవతలంతా ఉత్తరకోసమంగైలోనే మొదటిసారిగా ఆరుద్రా దర్శనం చేసుకున్నారని ప్రతీతి. ఇక్కడ వెలసిన పరమేశ్వరుడు స్వయంభూ ఈశ్వరుడని, కళ్యాణ సుందరేశ్వరుడని, ప్రళయకేశ్వరుడు, కైతై వనేశ్వరుడని, దురితపావకుడని, ఇలవంతికేశ్వరుడని పలు పేర్లతో పిలువబడుతూ బదరీవృక్షం క్రింద ప్రతిష్టించబడ్డాడు.
మూల విరాట్ మంగళనాధుడు స్వయంభూరూపంగా చతురస్ర పానువట్టంలో దర్శనమిస్తున్నాడు. అమ్మవారు మంగళాంబికాదేవి తన హస్తమునందు జపమాలతో దర్శనమిస్తున్నది. బలమైన వాద్య శబ్దాలకి మరకతం వంటి సున్నితమైన శిల బీటలు దీస్తుంది . అటువంటి సున్నితమైన మరకత శిలతో నటరాజ స్వామి విగ్రహం చేయబడినది. విగ్రహం 5 అడుగుల ఎత్తు వుంటుంది. ప్రపంచంలోనే అపురూప శిల్పంగా ఈ నటరాజ శిల్పం కీర్తించబడుతున్నది.ఇక్కడ నిత్యమూ మధ్యాహ్నం మరకత లింగానికి, స్ఫటిక లింగానికి జరిపే అభిషేకాలు విశేషమైనవి. ఈ ఆలయ స్ధలవృక్షమైన బదరీ వృక్షం 3000వేల సంవత్సరాల పురాతనమైనదని చెప్తారు. ఈ ఉత్తరకోసమంగై ఆలయంలో ప్రాతఃకాల పూజలో అమ్మవారు ఈశ్వరుని పూజించడం ఐహీకం. ఆ విధంగానే నాయన్మరులలో ఒకరైన మాణిక్యవాచకర్ అనే పరమ శివభక్తుడు అమరజీవిగా వరం పొంది పరమేశ్వరునికి ఆహారం కైంకర్యం చేస్తాడని భక్తులు విశ్వసిస్తారు. 

తిరుప్పెరుంతురైలో మాణిక్యవాచకర్ కి పరమశివుడు స్వయంగా దర్శనమిచ్చిన తరువాత తిరిగి  దర్శనమిచ్చిన ఆలయం ఉత్తరకోసమంగై. మాణిక్యవాచకర్ తమ తిరువాచక గ్రంధంలో 38 చోట్ల యీ ఆలయాన్ని గురింఛి కీర్తించారు. మంగళనాధుని ఆలయానికి ఉపాలయంగా స్వయంభూ వారాహి అమ్మవారి ఆలయం సమీపముననే వున్నది. ఈ అమ్మవారు ప్రాచీనకాలంలో "మంగై బిడారి" అని పిలువబడినది.రామేశ్వరం వలెనే యీ ఆలయ ప్రాకారం అంతా విశాలమైన మండపములతో బ్రహ్మాండంగా నిర్మించబడినది.ఒకే రోజు మూడువేళలా మంగళనాధుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ లేని మోక్షం పొందుతారని భక్తులు ధృఢంగా నమ్ముతారు. ఏ అడ్డంకులు కలుగకుండా వుండడానికి భక్తులు యీ ఆలయానికి వచ్చి ఈశ్వరుని పూజించి శుభాలు పొందుతారు .
మరోవైపు ఇక్కడ కోలువై ఉన్న మరకత నటరాజ స్వామి కి ప్రత్యేకత వుంది..
శిల్పాచార్యుల అద్భుత ప్రతిభకు నిదర్శనము 

మయుని నిర్మితం మరకత నటరాజ విగ్రహం & కుడి వైపున పురుషుల నృత్య కదలికలు మరియు ఎడమ వైపున స్త్రీల నృత్య కదలికలతో పంచలోహ నటరాజ విగ్రహము 

మరకరము (పచ్చ) విలువైన రత్నం. గరుడ పురాణం ప్రకారం సర్పరాజైన వాసుకి అను సర్పం బకాసురుని పిత్తాశయాన్ని సంగ్రహించి ఆకాశంనందు ఎగురుతున్న సమయంలో అది చూసిన వాసుకి శాత్రువు గరుత్మంతుడు వాసుకితో యుద్ధం చేయును. ఆ సమయంలో వాసుకి నోటిలోకి పిత్త కోశం మలయ పర్వత ప్రాంతంపై వదిలి వేయును. ఆ పిత్తాశయ భాగాలు విడిపోయి పడిన ప్రదేశాలలో అంతయు ఆకుపచ్చగా ప్రకాశించును. అందులోని కొంత భాగాన్ని గరుత్మంతుడు ంరింగును. దానితో గరుడు మూర్చపోవును. లేచిన వెంటనే బయటికి వదిలివేయును. అదా పడిన ప్రదేశంలో పుట్టిన పచ్చలను గరుడపచ్చలని అంటారు.మరొక కథ ప్రకారం నలమహారాజుకు శనిగ్రహ పీడ విముక్తి కలిగిన తదుపరి విష్ణుమూర్తిని ప్రార్థించి శివలింగమును ప్రసాదించమని కోరగా విష్ణుమూర్తి మరకతమును ఇవ్వడం జరిగింది. దానిని నలుడు ప్రతిష్ఠించాడు. అది ఇప్పటికీ పూజలందుకొంటున్నది. ప్రస్తుతం పాడిచ్చేరి రాష్ట్రంలోని తరువళ్ళూరు అను పట్టణమున గలదు.అమర కోశములో గారుత్మతం మరకత మశ్మ గర్భోహరిన్మణి అని వివరణ ఉంది. గరుత్మంతుని వలన ఉద్బవించినది, కావున, "గారుత్మతం" 'రాయి'నుండి ఉద్బవించినది కావున, అశ్మ గర్భ. పచ్చని రంగును కలిగి ఉన్నది కావున హరిన్మణి, "పచ్చ", "పచ్చలు" అన్న పేర్లు ఉన్నాయి.

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో అత్యంత పురాతనమైన శివాలయాలలో ఒకటి.అరుల్మిగు మంగళేశ్వరి ఉదనురై మంగళనాథ స్వామి దేవాలయం. దేవస్థానం రామనాథపురం సమస్థానం  క్రింద వస్తుంది. నవగ్రహాల ఆవిర్భావానికి ముందే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం నాలుగు యుగాల నాటిది.ఈ ఆలయంలో మరకత నటరాజ విగ్రహం చాల ప్రత్యేకమైనది.దీనిని విశ్వకర్మ  వంశీయులలో మయుని నిర్మితం ...
1300వ సంవత్సరంలో ఢిల్లీని పాలించిన ప్రముఖ మొఘల్ రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉతిరకోసమంగైలో మరకత ​​నటరాజ విగ్రహం ఉందని తెలుసుకుని దానిని దోచుకోవడానికి ప్రయత్నించాడు.  అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఎన్నో మార్లు ఈ విగ్రహమును తీసుకొనివెళ్ళాడనికి ప్రయతనము చేసి విఫలం అయ్యారు. పాండ్యన్ రాజుల పాలన అత్యుత్తమంగా ఉన్నప్పుడు, ఈ ప్రదేశం కొంతకాలం రాజధానిగా పనిచేసింది.ఈ ఆలయ శాసనాలలోనే  రావణుని భార్య మండోదరి పేరు ప్రస్తావించబడింది.అందువల్ల ఈ ప్రాంతం రామాయణ కాలానికి పూర్వమే అంటారు ఈ ఆలయంలోని పంచలోహ  నటరాజ విగ్రహము  చాలా భిన్నంగా ఉంటుంది మరియు విగ్రహం యొక్క కుడి వైపున పురుషుల నృత్య కదలికలు మరియు ఎడమ వైపున స్త్రీల నృత్య కదలికలతో కూడిన ఒక అద్భుతమైన కళాఖండం  శిల్పాచార్యులు యొక్క ప్రతిభకు నిదర్శనము. ఈ మరకత నటరాజ స్వామి కి మూడు సంధ్యల్లో మూడు పూజలు చేసి చందనము పూసి ఆ చందనము ప్రసాదముగా తీసుకున్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి.వార్షిక ఆరుద్ర దర్శనం , తిరుఉత్తరకోశమంగయ్                శ్రీఆది నటరాజ స్వామి (మరకత నటరాజ)
 ఏడాది మొత్తం చందనం లో కప్పబడి ఉండే ఈ స్వామి ఆరుద్ర ముందు రాత్రి చందనం తీసి అభిషేకం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ,తిరిగి మళ్ళీ చందనం తో కప్పి వేస్తారు   ఉత్తరకోశామంగయ్ , రామనాధపురం జిల్లా రామేశ్వరం దగ్గరలో ఉన్న ఈ ఆలయ సమూహం 
.మదురై.. రామనాధపురం మార్గంలో రామనాధపురానికి 10 కి.మీ దూరంలోకుడి ప్రక్కగా విడిపోయి తూత్తుకుడి .. తిరుచ్చెందూరు వెళ్ళే మార్గంలో 15 కి.మీ దూరంలో  ఉత్తరకోస మంగై ఆలయం వున్నది.....@ మణికుమార్ కొమ్మమూరు

Thursday, 5 January 2023

రైల్వే 3వ లైన్ పనులపై కలేక్టర్ ఫోకస్... ట్రాక్ పై నడిచి భూ సేకరణ ప్రాంతాల్లో. పరిశీలన...


ఖమ్మం, జనవరి 5: కొండపల్లి (విజయవాడ) నుండి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ విద్యుద్దీకరణ తో పాటు ఏర్పాటుకు గాను ఖమ్మం జిల్లాలో అవసరమగు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ఖమ్మం అర్బన్ మండలంలో 3వ రైల్వే లైన్ భూ సేకరణ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. స్థానిక నర్తకి థియేటర్ వద్ద, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్రింద ప్రాంతాన్ని కాలినడకన ట్రాక్ వెంబడి సారధి నగర్, బురహాన్ పూర్ తదితర ప్రాంతాలు, కోల్పోవుచున్న ఇండ్లు, కట్టడాలను కలెక్టర్ పరిశీలించారు. రైల్వే లైన్ ఎక్కడి వరకు వస్తుంది, ఎంత మేర భూ సేకరణ అవసరం ఉంటుంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి ఎంత మేర సేకరణలో వెళ్తుంది, తిరిగి రహదారికి భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్, ఇతర కట్టడాలు ఎంత మేర ప్రభావితం అవుతాయి అడిగి తెలుసుకున్నారు. రైల్వే గేటు వద్ద నుండి ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లి ట్రాక్ ప్రక్క నున్న నీటి నిల్వలు ఎలా తొలగించాలి, డ్రయినేజికి సమస్యలు తలెత్తకుండా ఏ ఏ చర్యలు చేపట్టాలి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ శిబిర కార్యాలయం భూ సేకరణలో ఎంత మేర నష్టం వాటిల్లుతుందో అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ కట్టడాలు, ఇతరాలు ప్రభావితం అయ్యేది సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొండపల్లి (విజయవాడ) నుండి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్  విద్యుద్దీకరణ తో పాటు ఏర్పాటుకుగాను జిల్లాలో భూసేకరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి మండలాలకు చెందిన 30 గ్రామాల నుండి 117.19 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇట్టి భూసేకరణలో భాగంగా ఖమ్మం అర్బన్ మండలంలోని ఖమ్మం రెవిన్యూ గ్రామం నందు సుమారు 1.10 ఎకరాలు, బురహాన్ పురం రెవిన్యూ గ్రామం నందు 1.16 ఎకరాల సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, రైల్వే డివిజనల్ ఇంజనీర్ టి. సూర్యనారాయణ, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, ఆర్ అండ్ బి ఏఇఇ విశ్వనాథ్, టౌన్ ప్లానింగ్ అధికారులు వసుంధర, వికాస్, సంతోష్, రెవిన్యూ అధికారి జి. శ్రీనివాసరావు అధికారులు తదితరులు ఉన్నారు.

Monday, 2 January 2023

ముక్కోటి కాంతుల బంగారు రధంపై భక్తులను కరుణించిన తిరుమలేశుడు..

భద్రాద్రి రాముడు ఉత్తరద్వారంలో భక్తులను కరుణించాడు..శ్రీరంగంలో రంగనాధుడు ఉత్తరద్వారంలో కోలువు తీరాడు..సింహచలంలో వరహానరసింహుడు..యాదాద్రి లో లక్మీ నరసింహుడు..తిరుమల వేంకటాద్రివాసుడు..తెలుగు నెలే కాదు దేశవీదేశాల్లో ముక్కోటి కాంతులు దేదీప్యమానంగా వేలుగులీనాయి
 ఏకాదశి వైభోగం: తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో భక్తుల కిటకిటలాడుతున్నాయి
 ప్రధాన ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాలకు పొటెత్తారు.. ఉత్తర ద్వారంలో దేవేరులతో కూడి వచ్ఛిన స్వామిని దర్శనం చేసుకున్నారు. వివిధ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్ని కిక్కిరిసాయి
తిరుమల శ్రీవారి ఆలయంలో.. 
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.  ద్వారాన్ని సుందరంగా అలంకరణ చేసింది టీటీడీ.  గర్భాలయం నుండి మహా ద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. 12 టన్నుల పుష్పాలతో తిరుమలని వైకుంఠంగా తీర్చిదిద్దారు. అదనంగా.. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకోగా.. భక్త జనం పోటెత్తుతోంది.
ఇక  తిరుమల వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్ వై..వి. సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ‘‘అర్దరాత్రి 1.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించాం. ముందుగా నిర్ణయించిన మేరకే ఉదయం 6 గంటలకు సర్వ దర్శనం ప్రారంభించారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి ఉంటుంది. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు తీసుకొని తిరుమల రావాలి. ఆన్ లైన్ లో రోజుకు 20 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు  జారీ చేశాం. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వ దర్శన టోకెన్లు నాలుగున్నర లక్షలు జారీ చేస్తున్నాం అని తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో స్వర్ణ రథంలో శ్రీవారు దర్శనం ఇచ్ఛారు..
యాదాద్రిలో తొలిసారి..
యాదాద్రి చరిత్రలో మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. పునర్నిర్మానం తర్వాత  తొలిసారిగా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నార లక్ష్మీనరసింహ స్వామి. ఉదయం 6.48 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కొనసానుంది.